నూతన సంవత్సర కానుకగా రాబోయే గురువారం ‘వనవీర’ అనే సినిమా రిలీజ్ కాబోతోంది. ముందు ‘వానర’ అనే పేరుతో ఉన్న ఈ సినిమాకు ఇటీవల ఏవో ఇబ్బందులు తలెత్తి ‘వనవీర’ అని టైటిల్ మార్చారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ నిర్వహించిన ప్రెస్ మీట్లో హీరో కమ్ డైరెక్టర్ అవినాష్ తిరువీధుల.. రిలీజ్ ముంగిట టైటిల్ మార్చాల్సి రావడంపై చాలా ఎమోషనల్ అయ్యాడు.
అలాగే ఈ సినిమాలో భాగమైన ఒక నటుడు.. ప్రమోషన్లకు దూరంగా ఉండడం మీదా స్పందించాడు. ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్ అని ఆ నటుడిని సినిమాలో పెట్టుకున్నామని.. కానీ తమ చిత్రం గురించి సోషల్ మీడియాలో ఒక పోస్టు కూడా పెట్టలేదని వాపోయాడు అవినాష్. ఆ నటుడెవరో పేరు చెప్పకపోయినా అది నందు అని అందరికీ అర్థమైపోయింది.
నందు లీడ్ రోల్ చేసిన ‘సైక్ సిద్దార్థ’ కూడా జనవరి 1నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా ‘వనవీర’ హీరో, దర్శకుడు అవినాష్ తన మీద పరోక్షంగా చేసిన విమర్శలపై నందు స్పందించాడు. ‘వనవీర’ సినిమా మేకర్స్ తన పేరు ఎత్తకుండా తనను విమర్శించినప్పటికీ.. తనకేమీ బాధ లేదని, ఆ సినిమా మీద తనకు ప్రేమే ఉందని నందు చెప్పాడు.
ఎప్పుడో 36 ఏళ్ల కిందట మోహన్ బాబు హీరోగా నటించిన, విలన్గా చేసిన సినిమాలు ఒకే రోజు రిలీజయ్యాయని.. తర్వాత అలాంటి ఘనత సాధించిన నటుడు తానే అని ఒక జర్నలిస్టు మిత్రుడు చెప్పాడని.. ఇలా జరుగుతున్నందుకు తనకు చాలా గర్వంగా ఉందని నందు చెప్పాడు.
ఐతే ‘వానర’ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ గురించి ముందు రోజు సాయంత్రం నిర్మాత కాల్ చేసి చెప్పాడని.. అప్పుడు తాను గుంటూరులో ఉన్నానని.. మరుసటి రోజు 10 గంటలకు తాను ప్రెస్ మీట్కు రాలేనని చెబితే, నిర్మాత సరే అన్నాడు తప్ప.. తన కోసం సాయంత్రం వరకు వెయిట్ చేస్తానని కూడా అనలేదని.. తనకు ముెందే సమాచారం ఇచ్చి ఉంటే ఈ ఈవెంట్ కోసం ప్లాన్ చేసుకుని ఉండేవాడనని నందు చెప్పాడు. తన మీద విమర్శలు చేసినప్పటికీ ఆ సినిమా మేకర్స్ మీద తనకేమీ కోపం లేదని.. ఆ సినిమా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని నందు చెప్పాడు.
This post was last modified on December 29, 2025 10:43 pm
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…