టాలీవుడ్లో మరో సెలబ్రెటీ పెళ్లికి రంగం సిద్ధమైంది. అల్లు అరవింద్ కొడుకుల్లో అందరి కంటే చిన్నవాడైన శిరీష్ ఒక ఇంటివాడు కాబోతున్న సంగతి ఇప్పటికే వెల్లడైంది. నయనిక అనే అమ్మాయితో ప్రేమలో పడ్డ శిరీష్.. గత అక్టోబరులో నిశ్చితార్థం చేసుకున్నాడు. హైదరాబాద్లో ఘనంగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఐతే ఎంగేజ్మెంట్ అయి మూడు నెలలు కావస్తున్నా ఇంకా పెళ్లి డేట్ అనౌన్స్ చేయలేదు.
మరి వివాహం ఎప్పుడా అని సినీ అభిమానుల్లోనే కాదు.. అల్లు కుటుంబంలోని పిల్లల్లోనూ క్యూరియాసిటీ నెలకొంది. ఈ నేపథ్యంలో అల్లు బాబీ, అల్లు అర్జున్ల పిల్లలు.. తమ బాబాయిని పెళ్లి డేట్ గురించి అడిగారు. బాబాయ్ పెళ్లి ఎప్పుడు అని 2026 మార్చి 6 అని అతను బదులివ్వడం.. సంగీత్ ఎప్పుడు అని అడిగితే, మనం సౌత్ ఇండియన్స్ మనకు అలాంటివి ఉండవు అని చెప్పడం.. ఇలా ఒక ఫన్నీ రీల్ చేసి పెళ్లి డేటును అనౌన్స్ చేసింది అల్లు కుటుంబం.
సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన మీమ్ వీడియో టెంప్లేట్లో ఈ రీల్ చేశారు. అది చూసి పెళ్లి డేటును ఇలా కూడా అనౌన్స్ చేస్తారా అని చర్చించుకుంటున్నారు నెటిజన్లు.
నయనికతో తన పరిచయం, ప్రేమ గురించి ఎంగేజ్మెంట్ తర్వాత శిరీష్ ఒక సోషల్ మీడియా పోస్టు పెట్టాడు.
వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల పెళ్లే.. నయనికతో తన ప్రేమకు పునాది అని అందులో శిరీష్ వెల్లడించాడు. వరుణ్, లావణ్యల పెళ్లి తర్వాత యంగ్ హీరో నితిన్, అతడి భార్య షాలిని కలిసి ఒక పార్టీ ఇచ్చారట. ఆ వేడుకకు షాలిని బెస్ట్ ఫ్రెండ్ అయిన నయనిక కూడా వచ్చిందట. తొలిసారి తనను అప్పుడే చూశాడట శిరీష్. నాటి పరిచయం తర్వాత తామిద్దరం ప్రేమలో పడ్డామని.. ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నామని శిరీష్ తెలిపాడు.
This post was last modified on December 29, 2025 1:09 pm
మాజీ సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ రిజర్వాయర్లో పలు పిల్లర్లు కుంగిన వైనం తెలంగాణ…
రాజకీయాలలో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం. కానీ, సందర్భం వచ్చినప్పుడు రాజకీయాలను పక్కనపెట్టి ప్రత్యర్థులను సైతం గౌరవించాల్సిన పరిస్థితులుంటాయి. పవన్…
జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ నుంచి ఇప్పటికే రెండు లిరికల్ సాంగ్స్, రెండు పొడవైన టీజర్లు వచ్చినప్పటికీ…
ఉత్తర ప్రదేశ్ లోని బదాయూ జిల్లాలో ఒక వింత ఘటన జరిగింది. సాధారణంగా ఎవరైనా చనిపోతే ఆ బాధలో ఉంటారు,…
రాయచోటి జిల్లా కేంద్రం మార్పు అంశం ఏపీ క్యాబినెట్ సమావేశంలో భావోద్వేగానికి దారితీసింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని…
సూర్య హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకీ అట్లూరి దర్శకత్వంలో నిర్మిస్తున్న ఎంటర్ టైనర్ దాదాపు పూర్తయిన…