ఏడాది చివర్లో వచ్చిన క్రిస్మస్ ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ కు ఊహించని ఫలితాలు ఇచ్చింది. పోటీ గట్టిగానే ఉన్నప్పటికీ ప్రేక్షకుల తీర్పు అనూహ్యం. వచ్చిన అరడజను సినిమాల్లో సాలిడ్ బ్రేక్ ఈవెన్ దాటేసి లాభాల్లోకి వేగంగా ప్రవేశించిన సినిమాలు రెండు. అవి శంబాల, ఈషా. వీటిలో ఉన్న కామన్ పాయింట్ హారర్. దెయ్యాల నేపథ్యంలో సాగుతాయి.
ఆది సాయికుమార్ మూవీలో దేవుళ్ళ ప్రస్తావన ఉన్నప్పటికీ ఒక పావు గంట మినహాయించి మొత్తం ఊరి జనాన్ని చంపేసే భూతం గోలే ఉంటుంది. అయినా సరే జనాలకు కనెక్ట్ అయ్యింది. సోమవారం డ్రాప్ ఎలా ఉంటుందనేది పక్కనపెడితే చక్కగా సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోయింది.
ఇక ఈషాకు నెగటివ్ రివ్యూలు ఎక్కువగా వచ్చాయి. కంటెంట్, ప్రొడక్షన్ క్వాలిటీ మీద క్రిటిక్స్ కాస్త గట్టిగానే తలంటారు. అయినా సరే ప్రేక్షకులు ఓసారి చూద్దామనుకున్నారు. బడ్జెట్, బిజినెస్ రెండూ తక్కువే కాబట్టి ఈజీగా గెటాన్ అయ్యే ఛాన్స్ కొట్టేసింది.
రేపటి నుంచి అద్భుతాలు జరగకపోవచ్చు కానీ కాగల కార్యం శుక్రవారం నుంచి ఆదివారం మధ్యలో జరిగిపోయింది. అనూహ్యంగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఛాంపియన్ ఎదురీదాల్సి రావడం ఊహించని పరిణామం. ప్రయత్నంలో నిజాయితీ ఉన్నప్పటికీ యునానిమస్ గా ఆడియన్స్ ని మెప్పించడంలో దర్శకుడు పడిన తడబాటు రిజల్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తోంది.
అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. జనవరి 1 రూపంలో క్రిస్మస్ బంచ్ మూవీస్ కి ఇంకో ఛాన్స్ అయితే ఉంటుంది. విచిత్రంగా పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న దండోరా ఈ హారర్ కాంపిటీషన్ లో నిలవలేకపోయింది. సోలోగా వచ్చి ఉంటే బాగా ఆడేదనే కామెంట్స్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న నేపథ్యంలో నిర్మాతలు రాంగ్ టైమింగ్ లో రిలీజ్ చేశారనేది అంత సులభంగా కొట్టి పారేయలేని విషయం.
సంక్రాంతి దగ్గర పడుతున్న తరుణంలో మెల్లగా ఆడియన్స్ మనసులు, పర్సులు అటువైపు షిఫ్ట్ అయిపోతాయి. సో ఆలోగా వీలైనంత రాబట్టుకోవడమే క్రిస్మస్, న్యూ ఇయర్ సినిమాల తక్షణ కర్తవ్యం.
This post was last modified on December 28, 2025 10:08 pm
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…