Movie News

హనుమాన్ హీరో… సీక్వెల్లో లేనట్లేనా?

బాల నటుడిగా మంచి పేరు సంపాదించిన వాళ్లందరూ హీరోలు నిలదొక్కుకుంటారనేమీ లేదు. కానీ తేజ సజ్జ మాత్రం హీరోగా మంచి స్థాయినే అందుకున్నాడు. పెద్దవాడయ్యాక ‘ఓ బేబీ’లో సైడ్ క్యారెక్టర్‌ చేసిన అతను.. ఆ తర్వాత ‘జాంబిరెడ్డి’తో ఓ మోస్తరు ఫలితాన్నందుకున్నాడు. కానీ ‘హనుమాన్’ సినిమా తేజ కెరీర్‌ను మార్చేసింది. ఆ సినిమా పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ అయి రూ.300 కోట్ల వసూళ్లు సాధించి ఆశ్చర్యపరిచింది. 

దీని తర్వాత ‘మిరాయ్’తో మరో బ్లాక్ బస్టర్ కొట్టాడు తేజ. ఇప్పుడు తేజ నటించిన చివరి మూడు చిత్రాలకూ సీక్వెల్స్ రాబోతున్నాయి. ఐతే జాంబి రెడ్డి-2, మిరాయ్-2 చిత్రాల్లో తేజనే హీరోగా నటించబోతున్నాడన్నది స్పష్టం. ఈ సినిమాల కోసం ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నట్లు తేజ తాజాగా కన్ఫమ్ చేశాడు. కొత్తగా ఇంకే సినిమా ఒప్పుకోలేదని కూడా అతను చెప్పాడు. కానీ ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ గురించి మాత్రం అతనేమీ మాట్లాడలేదు. ఇంతకుముందు కూడా ‘జై హనుమాన్’ గురించి అడిగితే.. అందులో తాను నటిస్తానా లేదా అన్నది తెలియదన్నాడు. 

‘జై హనుమాన్’ హనుమంతుడి పాత్ర మీదే నడుస్తుందని.. ఆ పాత్రను రిషబ్ శెట్టి చేయబోతున్నాడని ముందే క్లారిటీ వచ్చింది. అయినా సరే ‘హనుమాన్’ సీక్వెల్ కాబట్టి ఇందులో తేజ సజ్జ లేకుంటే ఎలా అనే ప్రశ్నలు తలెత్తాయి. కానీ తేజ మాత్రం ఆ సినిమాలో తాను నటిస్తానని చెప్పట్లేదు. అలా అని దర్శకుడు ప్రశాంత్ వర్మతో అతడికి ఏమైనా చెడిందా అంటే అదేమీ లేదు. ‘జాంబిరెడ్డి-2’కు ప్రశాంతే కథ అందించాడు. 

మరి ‘జై హనుమాన్’లో తేజ పాత్రను పూర్తిగా పక్కన పెట్టేయడానికి కారణమేంటో తెలియట్లేదు మరి. ప్రస్తుతానికి ఏమీ అనుకోకపోయినా.. సినిమా తెరకెక్కే వ్యవహారం మారొచ్చని.. అందులో తేజ కొన్ని నిమిషాలైనా కనిపించే అవకాశం ఉందని ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ‘కాంతార’ నుంచి ఇటీవలే ఖాళీ అయిన రిషబ్.. జనవరి నుంచి ‘జై హనుమాన్‌’లో నటిస్తాడని.. ఆరు నెలలు ఈ సినిమాకు డేట్లు ఇచ్చాడని ఇండస్ట్రీ వర్గాల సమాచారం.

This post was last modified on December 27, 2025 11:05 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

2 hours ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

3 hours ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

4 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

4 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

5 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

6 hours ago