మూడేళ్లకు పైగా సమయాన్ని కేవలం ఒక్క సినిమా కోసమే వెచ్చించిన రోషన్ మేకకు ఛాంపియన్ రూపంలో ఫలితం వచ్చేసింది. యునానిమస్ గా సూపర్ హిట్టని వినిపించలేదు కానీ మంచి ప్రయత్నమనే ప్రశంసలు దక్కాయి.
మొదటి రోజు మంచి ఓపెనింగ్ దక్కగా వీకెండ్ కూడా కొంచెం ప్రామిసింగ్ గానే ఉంది. అయితే సోమవారం ఆక్యుపెన్సీలు ఎంత మొత్తంలో డౌన్ అవుతాయనే దాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. రిస్క్ లేకుండా తక్కువ బడ్జెట్స్ తో రూపొందిన శంబాల, ఈషా క్రిస్మస్ పోటీలో దూసుకుపోతుండగా దండోరా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద స్ట్రగులవుతోంది.
ఛాంపియన్ సంగతి పక్కనపెడితే రోషన్ మేక ఇకపై స్పీడ్ పెంచాల్సిన టైం వచ్చేసింది. ఇలా ఒక్కో సినిమాకు రెండు మూడు సంవత్సరాలు తీసుకోవడం ఎంత మాత్రం సేఫ్ కాదు. ఎందుకంటే శ్రీకాంత్ వారసుడిగా తనకు గుర్తింపు, గౌరవం ఉన్నప్పటికీ మార్కెట్ తో సంబంధం లేకుండా నెత్తిన బెట్టుకునే ఫ్యాన్ ఫాలోయింగ్ తండ్రికి ఇప్పుడు లేదు.
శ్రీకాంత్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిపోయాక ప్రత్యేకంగా అభిమానులు అంటూ పెద్దగా లేరు. సో రోషన్ ఇప్పుడు స్వంతంగా తన ఫ్యాన్ బేస్ తానే తయారు చేసుకోవాలి. నటన, డాన్స్ పరంగా ఛాంపియన్ లో పాసు మార్కులు తెచ్చుకున్నా ఛాలెంజ్ అనిపించే రోల్స్ చేయాలి.
ప్రస్తుతం రోషన్ మేక దగ్గర రెండు ప్రతిపాదనలు ఉన్నాయి. మొదటిది సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో శైలేష్ కొలను దర్శకుడిగా ఒక రామ్ కామ్ ప్లానింగ్ లో ఉందట. ఫైనల్ నెరేషన్ ఓకే అయ్యాక ప్రకటన రావొచ్చు.
రెండోది గౌతమ్ మీనన్ డైరెక్షన్ లో ఏ మాయ చేసావే తరహాలో ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ అనుకున్నారట. కానీ ప్రొడ్యూసర్ ఎవరనేది బయటికి రాలేదు. అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తాజాగా రోషన్ ని కలిసి శుభాకాంక్షలు అందజేయడమే కాక ఒక సినిమాను కూడా లాక్ చేసుకోవడం చూస్తుంటే ఇదే ఆ గౌతం మీనన్ తో తీయబోయే మూవీ అని సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.
ఏది ఏమైనా రోషన్ మేక ఏడాదికి కనీసం రెండు రిలీజులు ఉండేలా చూసుకోవడం అవసరం. లేకపోతే కాంపిటీషన్ లో వెనుకబడే రిస్క్ ఉంది. అసలే మార్కెట్ లో బోలెడు హీరోలున్నారు.
This post was last modified on December 27, 2025 3:38 pm
దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ కు ఇటీవల ఎక్కడ లేని ప్రాచుర్యం లభించింది. నీట్ పేపర్ లీకేజి కి…
గతంలో బ్రహ్మానందం, బాబు మోహన్ లాంటి కమెడియన్స్ ఉన్నప్పుడు వాళ్ళ కోసమే విడిగా కామెడీ ఎపిసోడ్స్ రాసేవాళ్ళు. మెయిన్ రైటర్స్…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో పైవరుసలో ఉండే ఆర్టిస్టుల్లో మోహన్ బాబు ఒకరు.…
ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత్త ప్రస్థానం మొదలైపోయింది. నిన్నటిదాకా రాజకీయ వ్యూహకర్తగా, ఓ రాజకీయ పార్టీకి అధినేతగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ కీలక కేసు విషయంలో సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. వ్యక్తి చనిపోయిన తర్వాత.. కేసును…
టాలీవుడ్ విచిత్రాలు కొన్ని భలే అనిపిస్తాయి. కాకతాళీయమే అయినా అదేదో రాసిపెట్టి జరగడం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇటీవలే విడుదలైన శ్రీనివాస…