దురంధర్ అనుకున్నట్టే వెయ్యి కోట్ల మార్కును దాటేసింది. రిలీజ్ కు ముందు వరకు పెద్దగా ఆంచనాలు లేవు. ట్రైలర్ చూశాక ఇదేదో తేడాగా ఉందని నెగటివ్ కామెంట్స్ చేసినవాళ్లు ఎక్కువ. ఓపెనింగ్ రెండు రోజుల కలెక్షన్లు చూసి కార్పొరేట్ బుకింగ్స్ అని ఎద్దేవా చేసిన వాళ్ల సంఖ్య పెద్దదే.
అయినా సరే ఇవన్నీ దాటుకుని దురంధర్ థౌసండ్ క్రోర్ క్లబ్బులోకి గర్వంగా అడుగు పెట్టింది. ఫైనల్ రన్ కు దగ్గరవుతున్నప్పటికీ ఇప్పట్లో థియేటర్ల నుంచి తీసేసే అవసరం ఉండదని బయ్యర్లు అభిప్రాయపడుతున్నారు. తెలుగు రాష్ట్రాల మెయిన్ సెంటర్స్ లో మూడో వారం కూడా ఆడుతున్న టయర్ 2 హీరో సినిమా దురంధర్ ఒక్కటే.
ఇండియా నుంచే 790 కోట్ల దాకా కలెక్ట్ చేసిన దురంధర్ ఓవర్సీస్ లో మరో 217 కోట్లకు పైగా లాగేసింది. క్రిస్మస్ రోజు ఏకంగా 28 కోట్లకు పైగా వసూలు కావడం ఇంకో సంచలనం. ఇదంతా కేవలం హిందీలో మాత్రమే. యానిమల్, జవాన్ ని లక్ష్యంగా చేసుకుని వాటిని దాటేసిన దురంధర్ ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ గా పుష్ప 2ని పెట్టుకుంది.
దాన్ని ఛేదించడం ఈజీ కాదు. మూడున్నర గంటల సినిమా అది కూడా పెద్దలకు మాత్రమే సెన్సార్ సర్టిఫికెట్ తెచ్చుకుని ఇంత ఘనవిజయం సాధించడం ఎవరూ ఊహించనిది. దెబ్బకు దురంధర్ 2 డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. మార్చి 19 విడుదలకు ఇంకా టైం ఉన్నప్పటికీ హక్కుల కోసం బయ్యర్లు ఎగబడుతుంటారు.
లెక్కల సంగతి కాసేపు పక్కనపెడితే దురంధర్ నేర్పించే పాఠాలు ఎన్నో ఉన్నాయి. విపరీతమైన ప్రమోషన్లు, దేశమంతా తిరిగి హడావిడి చేసే పబ్లిసిటీ, మీడియాని ఊరూరా తిప్పుతూ చేసే ప్రచారం ఇవేవి లేకుండా కేవలం కంటెంట్ లో దమ్ముంటే జనం ఎంత బ్రహ్మరధం పడతారో ఈ స్పై థ్రిల్లర్ నిరూపించింది.
పాకిస్థాన్ లో బ్యాన్ చేసినా పైరసీలో చూడాలని మిలియన్ల సంఖ్యలో అక్కడి ప్రేక్షకులు డౌన్లోడ్ చేసుకోవడం దీని క్రేజ్ కు నిదర్శనం. ఇప్పట్లో దురంధర్ ని టచ్ చేసే మరో బ్లాక్ బస్టర్ అంత ఈజీగా హిందీలో రాకపోవచ్చని విశ్లేషకులు బల్లగుద్ది చెబుతున్నారు. రెస్పాన్స్ చూస్తుంటే అదే నిజమైనా ఆశ్చర్యం లేదు.
This post was last modified on December 26, 2025 2:33 pm
హాలీవుడ్ సినిమాల్లో కల్ట్ ఫాలోయింగ్ ఉన్న మూవీ అనకొండ. 1997లో విడుదలైన ఈ బ్లాక్ బస్టర్ ప్రపంచంలోనే అత్యంత భారీ,…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, ఉండి టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును వైసీపీ ప్రభుత్వం కస్టోడియల్ టార్చర్కు గురి చేసిన వైనం…
నిన్న విడుదలైన దండోరాకు ప్రశంసలైతే వచ్చాయి కానీ కలెక్షన్లు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఛాంపియన్, శంభాల, ఈషా ట్రెండింగ్…
మాజీ మంత్రి కేటీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి సంచలన విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. గుంటూరులో చదువుకున్న కేటీఆర్…
గిరిజనుల సంక్షేమం, ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే.…
తిరుపతిలోని సంస్కృతి యూనివర్సిటీలో భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్ ను ఏపీ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ఆర్ఎస్ఎస్ చీఫ్…