ఏడాది చివరి వారంలో టాలీవుడ్ బాక్సాఫీస్ చిన్న, మీడియం రేంజ్ సినిమాలతో సందడిగా కనిపిస్తోంది. మాములుగా ఈ డేట్ లో ఒకటి రెండు పెద్ద మూవీస్ తప్ప తీవ్రమైన పోటీ ఉండేది కాదు. కానీ ఈసారి సీన్ వేరే ఉంది. విశేషమంటే అరడజను రిలీజులున్నా పాజిటివ్ వైబ్స్ కనిపించడం.
ఆది సాయికుమార్ ‘శంభాల’కు ప్రీమియర్ల స్ట్రాటజీ వర్కౌట్ అయినట్టే ఉంది. ఎర్లీ రిపోర్ట్స్ సానుకూలంగా ఉన్నాయి. సాధారణంగా ఉండే హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ వన్ టైం వాచ్ అనే మాట అధిక శాతం వినిపిస్తోంది. రెగ్యులర్ షోలకు వెళ్లే కామన్ ఆడియన్స్ కూడా ఇదే మాట అన్నారంటే డైలాగు కింగ్ వారసుడికి హిట్ దక్కినట్టే.
ఇక ‘దండోరా’ విషయానికి వస్తే సీరియస్ ఇష్యూని చాలా ఇంటెన్స్ డ్రామాతో రూపొందించిన విధానం ట్రైలర్ లోనే చూపించారు. సెన్సార్ సమస్య వల్ల అనుకున్న టైంకి రెండు రోజుల ముందే ప్రీమియర్లు వేయలేకపోయినా సద్దుమణిగిన తర్వాత వేసిన షోల నుంచి టాక్ బాగుండటం దర్శక నిర్మాతలను సంతోషంలో ముంచెత్తుతోంది.
ఇక సీరియస్ హారర్ ‘ఈషా’ సంగతి చూస్తే ఖచ్చితంగా భయపెడదామని నిర్మాతలు బన్నీ వాస్, వంశి నందిపాటి అన్న మాటలు నిజమే అనిపించేలా సోషల్ మీడియా రియాక్షన్లు కనిపిస్తున్నాయి. కాకపోతే సాధారణ ప్రేక్షకుల నుంచి ఆ టాక్ వస్తే ఈజీగా పికప్ అయ్యే ఛాన్స్ ఉంది.
‘పతంగ్’కు త్రివిక్రమ్ శ్రీనివాస్ మద్దతు దక్కడం ఏ మేరకు ఉపయోగపడుతుందో టాక్ ని బట్టి చూడాలి. సురేష్ డిస్ట్రిబ్యూషన్ చేస్తుండటంతో కంటెంట్ లో ఏదో ఒక విషయం ఉండే ఉంటుంది. ‘బ్యాడ్ గర్ల్స్’ మీద పెద్ద బజ్ లేదు కానీ దర్శకుడు మున్నా బృందం సడన్ సర్ప్రైజ్ ఇస్తామని ధీమాగా ఉంది.
ఇవన్నీ ఒక ఎత్తయితే పెద్ద బడ్జెట్ తో రూపొందిన రోషన్ మేక ‘ఛాంపియన్’ మీద మంచి అంచనాలున్నాయి. పీరియాడిక్ డ్రామా కావడంతో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. టాక్ బాగుంటే పూర్తి డామినేషన్ తీసుకొచ్చు. మోహన్ లాల్ డబ్బింగ్ మూవీ ‘వృషభ’ ఇంత కాంపిటీషన్ లో కనీస బజ్ లేక పోరాడుతోంది.
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…