మొన్న దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు శివాజీ అన్న మాటల దుమారం ఇప్పట్లో ఆగేలా లేదు. మహిళల వస్త్రధారణ గురించి చాలా ఘాటు భాషలో ఆయన చేసిన కామెంట్స్ ఏకంగా మహిళా కమీషన్ రియాక్టయ్యి నోటీసులు ఇచ్చేదాకా వెళ్ళింది.
ఇండస్ట్రీలో ఉన్న లేడీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ మూకుమ్మడిగా మా అసోసియేషన్ కు లేఖ రాశారు. ఇక్కడితో ఆగలేదు. పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో శివాజీ ధోరణిని తప్పుబడుతూ ట్వీట్లు పెట్టారు. ఇదంతా నిన్నటి దాకా స్టోరీ. ఇవాళ ప్రెస్ మీట్ లో శివాజీ మాట్లాడుతూ తను వాడిన పదాల గురించి తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మరోసారి క్షమాపణ కోరారు.
ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ ఒకవేళ లులు మాల్ ఘటనలో నిధి అగర్వాల్ దుస్తుల్లో ఏదైనా జారి ఉంటే ఆ వీడియో జీవితాంతం ఉండిపోయేదని అనడం ద్వారా మరో చిన్నపాటి ఫైర్ రగిలించారు. నిజానికి ఆ సంఘటనలో నిధి బాధితురాలు. ఊహించని విధంగా ఫ్యాన్స్ తోసుకురావడంతో ఆమె చాలా ఇబ్బంది పడింది.
తనను ఉద్దేశిస్తూ ఒకవేళ బట్టల్లో ఏదైనా తొలగిపోయి ఉంటే అని మళ్ళీ గుర్తు చేయడం మరోసారి అభ్యంతరానికి దారి తీసేలా ఉంది. దీని గురించి ఇన్స్ టాలో నిధి అగర్వాల్ ఇన్ డైరెక్ట్ గా స్పందిస్తూ బాధితులనే నిందించడం మోసపూరితం అని అర్థం వచ్చేలా స్టేటస్ పెట్టడం గమనార్హం.
ఇది అంత ఈజీగా ఆగేలా కనిపించడం లేదు. అనసూయని ఉద్దేశించి శివాజీ మీ ఋణం తీర్చుకుంటానని చెప్పడం, పదాలు ముమ్మాటికీ తప్పే, భార్య దగ్గర బాధ పడ్డానని చెబుతూనే తన అసలు ఉద్దేశాన్ని విడమరిచి మళ్ళీ వివరించడం కొత్త వాదనలు తీసుకొచ్చేలా ఉంది.
పోలీసులు అడిగినా సరే లులు మాల్ సంఘటన మీద కేసు పెట్టడం ఇష్టం లేని నిధి అగర్వాల్ అక్కడితో దాన్ని సద్దుమణిగేలా చేద్దామనుకుంది. కానీ ఇప్పుడు వివరణ రూపంలో శివాజీ ఇచ్చిన సంజాయిషీ మరోసారి హాట్ టాపిక్ అవుతోంది. దండోరా ప్రమోషన్ల సంగతేమో కానీ ఇది మాత్రం ఎక్స్ తదితర మాధ్యమాల్లో కొత్త చర్చలు పుట్టిస్తూనే ఉంది.
This post was last modified on December 24, 2025 7:06 pm
చాలాకాలంగా కాంగ్రెస్ పార్టీపై, సీఎం రేవంత్ రెడ్డిపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేస్తున్న సంగతి…
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
తెంపరి తనానికి చొక్కా.. ఫ్యాంటు తొడిగితే.. అది అమెరికా అధ్యక్షుడు ట్రంపేనన్న కామెంట్లు తరచుగా వినిపిస్తాయి. ఎప్పుడు ఎలాంటి నిర్ణయంతో…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…