నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ చిత్రీకరణ వేగంగానే జరుగుతుందని తెలుస్తోంది. అనుకున్న ప్రకారమే మార్చి 26న తమ చిత్రాన్ని విడుదల చేయడానికి చూస్తోంది చిత్ర బృందం. ఐతే ఇప్పటిదాకా ఈ సినిమాలో హీరోయిన్ ఎవరన్నది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. విలన్ పాత్ర చేస్తున్న మోహన్ బాబు గురించి అధికారిక ప్రకటన చేశారు. ఆయన ఫస్ట్ లుక్ కూడా లాంచ్ చేశారు.
ఇటీవలే సంపూర్ణేష్ బాబు చేస్తున్న బిరియాని పాత్రకు సంబంధించిన లుక్ కూడా లాంచ్ చేశారు. కానీ హీరోయిన్ గురించి మాత్రం ఏ ప్రకటనా లేదు. ఇందులో ‘డ్రాగన్’ భామ కాయదు లోహర్ కథానాయికగా నటించబోతున్నట్లు గతంలో వార్తలు వచ్చాయి. అది నిజమా కాదా అన్న స్పష్టత లేదు. కానీ కాయుదు తాజాగా ఒక సోషల్ మీడియా పోస్టుతో ఈ విషయాన్ని చెప్పకనే చెప్పింది.
‘ది ప్యారడైజ్’ గ్లింప్స్ను తన ఇన్స్టా పేజీలో షేర్ చేసిన కాయదు.. లవ్ ఎమోజీలు పెట్టింది. సడెన్గా ఈ వీడియో పెట్టడాన్ని బట్టి ఆమె ఈ చిత్రంలో నటిస్తోందని స్పష్టమైంది. కాయదు ఇటీవలే ‘ది ప్యారడైజ్’ సెట్స్లోకి అడుగు పెట్టిందని.. ఆమె మీద కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారని సమాచారం. త్వరలోనే ఆమె ఫస్ట్ లుక్ను లాంచ్ చేస్తారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఇన్స్టాలో ఆ సినిమా గ్లింప్స్ను షేర్ చేసినట్లు కనిపిస్తోంది.
ఈ చిత్రంలో అన్ని పాత్రల లుక్స్ రా అండ్ రస్టిగ్గా ఉన్నాయి. మరి అల్ట్రా గ్లామరస్గా కనిపించే కాయదుతో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఎలాంటి పాత్ర చేయిస్తున్నాడో.. తన లుక్ ఎలా ఉంటుందో అన్నది ఆసక్తికరం. కచ్చితంగా ఏదో ఒక సర్ప్రైజ్ ఉంటుందనే అంచనా వేస్తున్నారు నెటిజన్లు. నాని, శ్రీకాంత్ కాంబినేషన్లో ‘దసరా’ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన సుధాకర్ చెరుకూరినే ఈ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
This post was last modified on December 24, 2025 5:15 pm
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…