ప్రతి ఏడాది చివరికి వచ్చేసరికి ఆ సంవత్సరంలో ఎక్కువ ఆదరణ సంపాదించుకున్న, వార్తల్లో ఉన్న, సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిన వ్యక్తుల జాబితాలు వస్తుంటాయి. అందులో ఎక్కువగా సినీ హీరోలు, హీరోయిన్లే టాప్లో కనిపిస్తుంటారు. అందులో విలన్ పాత్రలు పోషించే నటుల పేర్లు కనిపించడం అరుదు. ఐతే 2020లో మాత్రం కథ మారిపోయింది.
వివిధ భాషల్లో సూపర్ స్టార్లయిన హీరోలందరినీ వెనక్కి నెట్టేసి ఓ విలన్ టాప్లో కనిపిస్తున్నాడు. ఆ నటుడు సోనూ సూద్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా-లాక్డౌన్ టైంలో అసాధారణ రీతిలో సేవా కార్యక్రమాలు చేసి జనాల దృష్టిలో దేవుడైపోయాడు సోనూ. కరోనా ప్రభావం తగ్గి, లాక్ డౌన్ ఎత్తేశాక కూడా సోనూ సేవ ఆగిపోలేదు.
ఈ నేపథ్యంలోనే అతను ఆసియా స్థాయిలో 2020లో అత్యధిక ఆదరణ సంపాదించుకున్న సెలబ్రెటీగా నిలిచాడు. యూకే బేస్డ్ మీడియా సంస్థ ఈస్టర్న్ ఐ 2020 సంవత్సరానికి వరల్డ్ వైడ్ మోస్ట్ పాపులర్ సెలబ్రెటీల జాబితాను రిలీజ్ చేసింది. ఇందులో ఆసియా స్థాయిలో సోనూనే అగ్రస్థానంలో నిలిచాడు. హాలీవుడ్ స్థాయికి ఎదిగిన ప్రియాంక చోప్రా, బాహుబలితో బాలీవుడ్ సూపర్ స్టార్లను వెనక్కి నెట్టేసిన ప్రభాస్ ఈ జాబితాలో టాప్-10లో చోటు దక్కించుకున్నారు.
ప్రియాంకకు ఆరో స్థానం దక్కగా, ప్రభాస్ ఏడో స్థానంలో నిలిచాడు. ఖాన్ త్రయంలో ఎవ్వరూ టాప్-10లో లేరు. సోనూ ఇండియా వరకు తిరుగులేని పాపులారిటీ సంపాదించాడు కానీ.. ఆసియా స్థాయిలో నంబర్ వన్గా నిలవడం చిన్న విషయం కాదు. తాజాగా సేవా కార్యక్రమాలకు సోనూ దగ్గర నిధులు నిండుకుంటే తన ఆస్తులు తనఖా పెట్టి మరీ డబ్బులు తీసుకుని ఉపయోగిస్తున్న వైనం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసింఏద.
This post was last modified on December 10, 2020 9:52 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…