కూలీలో నాగార్జున విలన్ గా నటిస్తారని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రకటించినప్పుడు అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. చాలా వయొలెంట్ గా ఉంటుందని, రక్షకుడులో ఆయన స్వాగ్ కి ఫ్యాన్ అయ్యాక అప్పటి నుంచే ఇలాంటి క్యారెక్టరైజేషన్ రాసుకున్నానని చాలా కబుర్లు చెప్పాడు. తీరా చూస్తే రెండు మూడు స్టయిలిష్ షాట్లు తప్ప సైమన్ గా నటించిన నాగార్జున పాత్ర పరమ రొటీన్ గా ఉంది. మర్డర్లు చేయించాడు కానీ అవి ఎలాంటి ఇంపాక్ట్ చూపించేలేకపోయాయి. నిజానికి ఇది వర్కౌట్ అయితే మరిన్ని ప్రయోగాలు చేసేందుకు నాగ్ సిద్ధపడ్డారు. కాకపోవడంతో తిరిగి సోలో హీరోగా తన పాత రూటుకు వచ్చేశారు.
ఇక్కడ దురంధర్ ప్రస్తావన ఎందుకు వచ్చిందో చూద్దాం. అక్షయ్ ఖన్నా పోషించిన రెహమాన్ డెకాయిట్ పాత్ర ఎంత అద్భుతంగా పేలిందో చూస్తున్నాం. హీరో రణ్వీర్ సింగ్ కన్నా ఎక్కువ పేరు తనకే వచ్చిందనేది అతిశయోక్తి కాదు. ఇంటెన్స్ పెర్ఫార్మన్స్ తో ఆయనని దర్శకుడు ఆదిత్య దార్ చూపించిన విధానం చప్పట్లు కొట్టించుకుంది. చివర్లో చనిపోయే ఎపిసోడ్ కూడా టెర్రిఫిక్ గా డిజైన్ చేశారు. హాస్పిటల్ బెడ్ మీద రక్తమోడుతున్నా సిగరెట్ తాగుతూ రణ్వీర్ వైపు క్రూరంగా చూసే ఒక్క షాట్ చాలు తన గురించి చెప్పడానికి. ఇలాంటిదే కనక కూలిలో నాగార్జునకు పెట్టి ఉంటే కంటెంట్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళేది.
అయితే రజనీకాంత్ ఎక్కడ సైడ్ ట్రాక్ అవుతారో లేదా నాగార్జున ఎక్కడ డామినేట్ చేస్తాడో అనే భయం వల్ల సైమన్ ని డౌన్ టోన్ చేసి ఉండొచ్చు కానీ ఒక స్టయిల్ విలన్ ని పరిచయం చేసే అవకాశాన్ని లోకేష్ కనగరాజ్ చేతులారా వృథా చేసుకున్నాడు. దురంధర్ చూశాక మూవీ లవర్స్ ఇదే ఫీలవుతున్నారు. లెజెండ్ తర్వాత జగపతిబాబు ఏ స్థాయికి వెళ్లారో అంతకన్నా పెద్ద రేంజ్ లో ఒక స్పెషల్ విలన్ స్టేటస్ నాగార్జునకి దక్కేదని భావిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కూలి ఫ్లాప్ కావడం నాగ్ ఫ్యాన్స్ కి సంతోషమే. ఇకపై నెగటివ్ రోల్స్ కి దూరంగా ఉండి కేవలం హీరోగా చేస్తారని ఫిక్స్ అయ్యారు. మరి నాగార్జున మనసులో ఏముందో.
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…
పిల్లలు సంపద అని సీఎం చంద్రబాబు మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పిన మాటకే కట్టుబడి ఉన్నానని తెలిపారు. దీనిని…
వియత్నాంలో విహార యాత్రకు వెళ్లిన భారతీయుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఊహించని ప్రమాదంలో చిక్కుకుని 15 మంది భారతీయులు మృతి…
తన సినిమాకు పని చేసిన టెక్నీషియన్ను ఒక నిర్మాత సైకోగా అభివర్ణించడం ఎప్పుడైనా చూశారా? సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ…
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…