మెగాస్టార్ చిరంజీవి లైనప్లో అభిమానులకు అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆయన నటించబోయేదే. మన శంకర వరప్రసాద్, విశ్వంభర చిత్రాలను మించి దాని మీద అంచనాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ‘దసరా’తో సెన్సేషన్ క్రియేట్ చేసి, ‘ది ప్యారడైజ్’తో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేసేలా కనిపిస్తున్న శ్రీకాంత్ దర్శకత్వంలో చిరు నటిస్తే ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది.
శ్రీకాంత్ను వెలుగులోకి తెచ్చిన నాని.. చిరుతో అతడి సినిమాను సెట్ చేయడమే కాక, స్వయంగా నిర్మించడానికి ముందుకు రావడంతో ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ వచ్చింది. ఈ సినిమా గురించి తాజాగా నిర్మాత సుధాకర్ చెరుకూరి అప్డేట్ ఇచ్చారు. నాని, శ్రీకాంత్ కలయికలో వరుసగా రెండో చిత్రాన్ని నిర్మిస్తున్న సుధాకర్.. చిరు సినిమాను కూడా నానితో కలిసి ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.
చిరు, శ్రీకాంత్ సినిమా వచ్చే ఏడాది మధ్యలో సెట్స్ మీదికి వెళ్తుందని సుధాకర్ చెరుకూరి వెల్లడించారు. శ్రీకాంత్ ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమాలో బిజీగా ఉంటూనే.. చిరు సినిమా స్క్రిప్టు వర్క్ చేస్తున్నట్లు సుధాకర్ తెలిపారు. ‘ది ప్యారడైజ్’ నుంచి పూర్తిగా ఫ్రీ అయ్యాక చిరు సినిమా మీద మరింత ఫోకస్ పెడతాడని.. తర్వాత 2026 జులైలో షూట్ మొదలు కావచ్చని ఆయన సంకేతాలు ఇచ్చారు.
ఐతే మరోవైపు బాబీ సినిమా కూడా సరిగ్గా అదే సమయానికి మొదలు పెడతారన్నది ఇండస్టీ టాక్. వర ప్రసాద్ గారు రిలీజ్ అయిన వెంటనే బాబీ తో మొదలు పెడతారా లేక రెండు ఒకేసారి మొదలుపెడతారా అన్నది తెలియాలంటే మరికొన్ని ఆగాల్సిందే.
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…
రాజకీయ చతురతలో మరోసారి టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు చాణక్యం వెలుగు చూసింది. ఇంకేముంది.. సర్కారును ఇరుకున పెట్టేసి.. కుల,…