Movie News

చిరు-ఓదెల ముహూర్తం కుదిరింది కానీ…

మెగాస్టార్ చిరంజీవి లైనప్‌లో అభిమానులకు అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆయన నటించబోయేదే. మన శంకర వరప్రసాద్, విశ్వంభర చిత్రాలను మించి దాని మీద అంచనాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ‘దసరా’తో సెన్సేషన్ క్రియేట్ చేసి, ‘ది ప్యారడైజ్’తో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేసేలా కనిపిస్తున్న శ్రీకాంత్ దర్శకత్వంలో చిరు నటిస్తే ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది.

శ్రీకాంత్‌ను వెలుగులోకి తెచ్చిన నాని.. చిరుతో అతడి సినిమాను సెట్ చేయడమే కాక, స్వయంగా నిర్మించడానికి ముందుకు రావడంతో ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ వచ్చింది. ఈ సినిమా గురించి తాజాగా నిర్మాత సుధాకర్ చెరుకూరి అప్‌డేట్ ఇచ్చారు. నాని, శ్రీకాంత్ కలయికలో వరుసగా రెండో చిత్రాన్ని నిర్మిస్తున్న సుధాకర్.. చిరు సినిమాను కూడా నానితో కలిసి ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.

చిరు, శ్రీకాంత్ సినిమా వచ్చే ఏడాది మధ్యలో సెట్స్ మీదికి వెళ్తుందని సుధాకర్ చెరుకూరి వెల్లడించారు. శ్రీకాంత్ ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమాలో బిజీగా ఉంటూనే.. చిరు సినిమా స్క్రిప్టు వర్క్ చేస్తున్నట్లు సుధాకర్ తెలిపారు. ‘ది ప్యారడైజ్’ నుంచి పూర్తిగా ఫ్రీ అయ్యాక చిరు సినిమా మీద మరింత ఫోకస్ పెడతాడని.. తర్వాత 2026 జులైలో షూట్ మొదలు కావచ్చని ఆయన సంకేతాలు ఇచ్చారు.

ఐతే మరోవైపు బాబీ సినిమా కూడా సరిగ్గా అదే సమయానికి మొదలు పెడతారన్నది ఇండస్టీ టాక్. వర ప్రసాద్ గారు రిలీజ్ అయిన వెంటనే బాబీ తో మొదలు పెడతారా లేక రెండు ఒకేసారి మొదలుపెడతారా అన్నది తెలియాలంటే మరికొన్ని ఆగాల్సిందే.

Kumar

Recent Posts

అంచనాల ఒత్తిడిని ‘రామాయణ’ తట్టుకుంటుందా

ఎంతవరకు నిజమో చెప్పలేం కానీ నిర్మాత నమిత మల్హోత్రా చెబుతున్న దాని ప్రకారం రామాయణకు పెడుతున్న ఖర్చు నాలుగు వేల…

59 minutes ago

లవ్ స్టోరీ భయపడాల్సిన పని లేదు

ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…

2 hours ago

అయ్యగారి జోరు అదిరింది

పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…

3 hours ago

మ్యూజిక్ చిచ్చు పెట్టిన ‘గాడ్ ఆఫ్ వార్’

తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…

5 hours ago

ఎట్టకేలకు బూత్ స్థాయిపై జనసేన కన్ను

బూత్ స్థాయిలో బ‌లోపేతం అయ్యే దిశ‌గా జ‌న‌సేన క‌స‌ర‌త్తు షురూ చేసింది. ప్ర‌స్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయ‌కులు ఉన్న‌ప్ప‌టికీ..…

5 hours ago

రాజధాని భూముల రచ్చలో నిజమేంటి..?

ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…

7 hours ago