Movie News

చిరు-ఓదెల ముహూర్తం కుదిరింది కానీ…

మెగాస్టార్ చిరంజీవి లైనప్‌లో అభిమానులకు అత్యంత ఆసక్తి రేకెత్తిస్తున్న చిత్రం.. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ఆయన నటించబోయేదే. మన శంకర వరప్రసాద్, విశ్వంభర చిత్రాలను మించి దాని మీద అంచనాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ‘దసరా’తో సెన్సేషన్ క్రియేట్ చేసి, ‘ది ప్యారడైజ్’తో మరోసారి బాక్సాఫీస్ షేక్ చేసేలా కనిపిస్తున్న శ్రీకాంత్ దర్శకత్వంలో చిరు నటిస్తే ఎలా ఉంటుందో అనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది.

శ్రీకాంత్‌ను వెలుగులోకి తెచ్చిన నాని.. చిరుతో అతడి సినిమాను సెట్ చేయడమే కాక, స్వయంగా నిర్మించడానికి ముందుకు రావడంతో ఈ ప్రాజెక్టుకు మరింత క్రేజ్ వచ్చింది. ఈ సినిమా గురించి తాజాగా నిర్మాత సుధాకర్ చెరుకూరి అప్‌డేట్ ఇచ్చారు. నాని, శ్రీకాంత్ కలయికలో వరుసగా రెండో చిత్రాన్ని నిర్మిస్తున్న సుధాకర్.. చిరు సినిమాను కూడా నానితో కలిసి ప్రొడ్యూస్ చేయబోతున్నాడు.

చిరు, శ్రీకాంత్ సినిమా వచ్చే ఏడాది మధ్యలో సెట్స్ మీదికి వెళ్తుందని సుధాకర్ చెరుకూరి వెల్లడించారు. శ్రీకాంత్ ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ సినిమాలో బిజీగా ఉంటూనే.. చిరు సినిమా స్క్రిప్టు వర్క్ చేస్తున్నట్లు సుధాకర్ తెలిపారు. ‘ది ప్యారడైజ్’ నుంచి పూర్తిగా ఫ్రీ అయ్యాక చిరు సినిమా మీద మరింత ఫోకస్ పెడతాడని.. తర్వాత 2026 జులైలో షూట్ మొదలు కావచ్చని ఆయన సంకేతాలు ఇచ్చారు.

ఐతే మరోవైపు బాబీ సినిమా కూడా సరిగ్గా అదే సమయానికి మొదలు పెడతారన్నది ఇండస్టీ టాక్. వర ప్రసాద్ గారు రిలీజ్ అయిన వెంటనే బాబీ తో మొదలు పెడతారా లేక రెండు ఒకేసారి మొదలుపెడతారా అన్నది తెలియాలంటే మరికొన్ని ఆగాల్సిందే.

This post was last modified on December 21, 2025 12:54 pm

Share

Recent Posts

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

2 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

3 hours ago

కాకాని ఆగమంటున్న విశ్వంభర ?

ఖైదీ నెంబర్ 150 నుంచి కంబ్యాక్ అయ్యాక ఎప్పుడూ చూడని ఒక విచిత్రమైన పరిస్థితిని చిరంజీవి ఎదురుకుంటున్నట్టు మెగా వర్గాల…

3 hours ago

ఎపిక్ మీద నెగిటివిటీ ఎందుకంటే

నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…

4 hours ago

5జీ రావడం లేదని టెక్నీషియన్‌ను కట్టేశారా?

ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…

5 hours ago

కాళీమాత గుడిలో చేపల కూర తిన్న బీజేపీ సీఎం

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…

5 hours ago