ఇటీవలే ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ రాజా సాబ్ కు అనుకున్నంత పెద్ద నెంబర్ నాన్ థియేటర్ రైట్స్ నుంచి రాలేదని, కానీ మార్కెట్ అలా ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే మేం అమ్మకం చేశామని చెప్పుకొచ్చారు. అంతే ఈ పాయింట్ యాంటీ ఫ్యాన్స్ దొరకబుచ్చుకున్నారు. ప్రభాస్ రేంజ్ తగ్గిపోయిందని, డిమాండ్ లేదని ఇలా రకరకాలుగా అర్థాలు తీసి కొందరు ఏకంగా ట్రోలింగ్ కూడా చేశారు. ఇదంతా గమనించిన విశ్వప్రసాద్ సోషల్ మీడియా వేదికగా కుండబద్దలు కొట్టారు. బయట జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో క్లారిటీ ఇచ్చారు.
అంతర్గతంగా తమ వ్యాపారాలకు సంబంధించి ఏవైతే నెంబర్లు ఉన్నాయో అవి బయటికి చెప్పడం సాధ్యం కాదని, పోస్ట్ రిలీజ్ అయిన తర్వాత వాటిని మేమే అధికారికంగా ప్రకటిస్తాం తప్పించి, థియేటర్ అనుభూతి దక్కించుకోవాల్సిన అభిమానులు ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టొద్దని కోరారు. మార్కెట్ ఎంత ఎగుడుదిగుడుగా ఉన్నా వర్తమానంలో బెస్ట్ డీల్ రాజా సాబ్ కే వచ్చిందని నొక్కి చెప్పారు. పోలికలు అనవసరం అంటూ కొట్టి పారేశారు. ఆయన చెప్పింది నిజమే. రాజా సాబ్ కు ప్రధానంగా పని చేస్తోంది ప్రభాస్ ఇమేజే అనేది ఎవరూ కాదనలేని నిజం. అందుకే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అంత భారీ బడ్జెట్ పెట్టింది.
హారర్ జానర్ కావడం, దర్శకుడు మారుతీ ట్రాక్ రికార్డు లాంటి ఒకటి రెండు కారణాలు ప్రభావం చూపించి ఉండవచ్చేమో కానీ పాజిటివ్ టాక్ వస్తే రాజా సాబ్ ని బాక్సాఫీస్ దగ్గర కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎంత పోటీ ఉన్నా సరే జనాలను డార్లింగ్ లాగేస్తాడు. టీమ్ ధీమా కూడా అదే. రెండు టీజర్లు, రెండు పాటలు ఆల్రెడీ వచ్చేశాయి. డిసెంబర్ 27 ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. వేదిక ఇవాళో రేపో ఫైనల్ అవుతుంది. కొత్త ట్రైలర్ లాంచ్ చేస్తారు. మరో రెండు పాటలు రిలీజ్ కు ముందే వచ్చేస్తాయి. పెద్ద బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలో దిగుతున్న రాజా సాబ్ కు అవతల అరడజను సినిమాలు కాంపిటీషన్ ఇస్తున్నాయి.
This post was last modified on December 21, 2025 12:45 pm
బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల తర్వాత సూర్య సినిమాలు వరసగా రాబోతున్నాయి. వాటిలో మొదటిది వీరభద్రుడు. తమిళంలో కరుప్పుగా రూపొందిన…
సొంత పార్టీ నాయకుడు తప్పు చేస్తే ఒకవిధంగా.. ప్రత్యర్థి పార్టీ నేతలు తప్పులు చేస్తే మరో విధంగా మారి పోయిన…
మే 1 విడుదల కాబోతున్న గాయపడ్డ సింహం మీద టీమ్ కన్నా ఎక్కువగా బయ్యర్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి. ఎందుకంటే…
వెనకటికి పాత కథ ఒకటుంది. ఒక రొట్టె కోసం రెండు పిల్లులు పోట్లాడుకుంటే తీర్పు చెప్పడానికి వచ్చిన కోతి దాన్ని…
చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేసే సాయిపల్లవి కాంబోల కన్నా ఎక్కువగా కంటెంట్ కి ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ తెలిసిన…
గుంటూరు పశ్చిమ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే గళ్లా మాధవి తీసుకున్న వినూత్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. బీకాం చదువుకున్న ఓ…