ఇటీవలే ఒక న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిర్మాత టిజి విశ్వప్రసాద్ మాట్లాడుతూ రాజా సాబ్ కు అనుకున్నంత పెద్ద నెంబర్ నాన్ థియేటర్ రైట్స్ నుంచి రాలేదని, కానీ మార్కెట్ అలా ఉంది కాబట్టి దానికి అనుగుణంగానే మేం అమ్మకం చేశామని చెప్పుకొచ్చారు. అంతే ఈ పాయింట్ యాంటీ ఫ్యాన్స్ దొరకబుచ్చుకున్నారు. ప్రభాస్ రేంజ్ తగ్గిపోయిందని, డిమాండ్ లేదని ఇలా రకరకాలుగా అర్థాలు తీసి కొందరు ఏకంగా ట్రోలింగ్ కూడా చేశారు. ఇదంతా గమనించిన విశ్వప్రసాద్ సోషల్ మీడియా వేదికగా కుండబద్దలు కొట్టారు. బయట జరుగుతున్న ప్రచారాలకు చెక్ పెట్టే ఉద్దేశంతో క్లారిటీ ఇచ్చారు.
అంతర్గతంగా తమ వ్యాపారాలకు సంబంధించి ఏవైతే నెంబర్లు ఉన్నాయో అవి బయటికి చెప్పడం సాధ్యం కాదని, పోస్ట్ రిలీజ్ అయిన తర్వాత వాటిని మేమే అధికారికంగా ప్రకటిస్తాం తప్పించి, థియేటర్ అనుభూతి దక్కించుకోవాల్సిన అభిమానులు ఇలాంటి విషయాల మీద దృష్టి పెట్టొద్దని కోరారు. మార్కెట్ ఎంత ఎగుడుదిగుడుగా ఉన్నా వర్తమానంలో బెస్ట్ డీల్ రాజా సాబ్ కే వచ్చిందని నొక్కి చెప్పారు. పోలికలు అనవసరం అంటూ కొట్టి పారేశారు. ఆయన చెప్పింది నిజమే. రాజా సాబ్ కు ప్రధానంగా పని చేస్తోంది ప్రభాస్ ఇమేజే అనేది ఎవరూ కాదనలేని నిజం. అందుకే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అంత భారీ బడ్జెట్ పెట్టింది.
హారర్ జానర్ కావడం, దర్శకుడు మారుతీ ట్రాక్ రికార్డు లాంటి ఒకటి రెండు కారణాలు ప్రభావం చూపించి ఉండవచ్చేమో కానీ పాజిటివ్ టాక్ వస్తే రాజా సాబ్ ని బాక్సాఫీస్ దగ్గర కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎంత పోటీ ఉన్నా సరే జనాలను డార్లింగ్ లాగేస్తాడు. టీమ్ ధీమా కూడా అదే. రెండు టీజర్లు, రెండు పాటలు ఆల్రెడీ వచ్చేశాయి. డిసెంబర్ 27 ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. వేదిక ఇవాళో రేపో ఫైనల్ అవుతుంది. కొత్త ట్రైలర్ లాంచ్ చేస్తారు. మరో రెండు పాటలు రిలీజ్ కు ముందే వచ్చేస్తాయి. పెద్ద బ్రేక్ ఈవెంట్ టార్గెట్ తో బరిలో దిగుతున్న రాజా సాబ్ కు అవతల అరడజను సినిమాలు కాంపిటీషన్ ఇస్తున్నాయి.
This post was last modified on December 21, 2025 12:45 pm
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…