ఒక బాలీవుడ్ మూవీ మూడో వారంలోనూ సూపర్ స్ట్రాంగ్ గా ఉండటం చూసి ఎన్ని నెలలయ్యిందో గుర్తు చేసుకోవడం కష్టం. అది కూడా రిలీజ్ కు ముందు నెగటివ్ వైబ్రేషన్స్ మోసుకుని, ఉద్దేశపూర్వకంగా కొందరు క్రిటిక్స్ నెగటివ్ చేయాలని చూసినా తట్టుకుని ఫైనల్ గా ఇండస్ట్రీ హిట్ వైపు పరుగులు పెడుతోంది. ప్రస్తుతం పుష్ప 2 హిందీ వెర్షన్ పేరుమీదున్న ఎనిమిది వందల కోట్ల పై చిలుకు నెంబర్ ని టార్గెట్ చేసిన దురంధర్ చాలా వేగంగానే అందుకునేలా ఉన్నాడు. ప్యాన్ ఇండియా లేకుండా కేవలం సింగల్ లాంగ్వేజ్ లో వచ్చి రికార్డులు బద్దలు కొట్టిన మూవీగా దురంధర్ సాధించబోయే మైలురాళ్ళు ఇంకా చాలానే ఉన్నాయి.
ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ అవతార్ ఫైర్ అండ్ యాష్ వచ్చిన తర్వాత దురంధర్ స్పీడ్ తగ్గుతుందేమోనని ట్రేడ్ వర్గాలు అనుమానించాయి. కానీ ఆ సూచనలు లేవు. దర్శకుడు జేమ్స్ క్యామరూన్ ఈసారి పూర్తి స్థాయి అంచనాలు అందుకోలేదని పబ్లిక్ టాక్ చూస్తే అర్థమైపోతుంది. రివ్యూలు కూడా అధిక శాతం పెదవి విరిచాయి. విజువల్ ఎఫెక్ట్స్ ఎంత అద్భుతంగా ఉన్నా అదే కథను తిప్పి తిప్పి మూడున్నర గంటలు చూపించారనే కంప్లైంట్ ఎక్కువగా వినిపిస్తోంది. వీకెండ్ వరకు బాగానే ఉన్నా తర్వాత నెమ్మదించడం ఖాయమని డిస్ట్రిబ్యూటర్లకు అర్థమైపోయింది. దీంతో దురంధర్ షోలు మళ్ళీ పెరుగుతున్నాయి.
విచిత్రం ఏమిటంటే దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలో దురంధర్ ఇంకా కొనసాగుతోంది. పబ్లిక్ డిమాండ్ ఉండటంతో ఇంకా రన్ ఇచ్చేందుకు థియేటర్ యజమాన్యాలు ముందుకొస్తున్నాయి. పైగా నార్త్ లో అఖండ తాండవం 2 నిరాశపరిచే దిశగా వెళ్తుండటంతో దాని కౌంట్ తగ్గిపోయి దురంధర్ నెంబర్ పెరుగుతోంది. సోషల్ మీడియాలో సెలబ్రిటీల మద్దతు దురంధర్ కు పెరుగుతోంది. సందీప్ రెడ్డి వంగా, రామ్ గోపాల్ వర్మ, అల్లు అర్జున్ తదితరులు దర్శకుడు ఆదిత్య ధార్ తో పాటు టీమ్ మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.చూస్తుంటే వెయ్యి కోట్లు దాటనిదే దురంధర్ శాంతించేలా లేడు.
This post was last modified on December 20, 2025 12:04 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…