పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకప్పుడు టాలీవుడ్ టాప్ స్టార్లలో ఒకడు. మెగాస్టార్ చిరంజీవి బ్రేక్ తీసుకున్నాక నంబర్ వన్ స్థానం కోసం బలమైన పోటీదారుగా ఉన్నాడు. గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది లాంటి చిత్రాలతో రికార్డులు కూడా బద్దలు కొట్టాడు. కానీ ఆ తర్వాత ఆయన రాజకీయాల వైపు అడుగులు వేయడంతో సినిమాల మీద ఫోకస్ తగ్గిపోయింది. మిగతా హీరోలు పాన్ ఇండియా స్థాయికి ఎదిగిపోతుంటే.. నంబర్ గేమ్లో పవన్ కళ్యాణ్ వెనుకబడిపోయాడు.
అభిమానులు రికార్డుల గురించి మాట్లాడుకునే పరిస్థితి లేకపోయింది. రీఎంట్రీలో వరుసగా మూడు రీమేక్ సినిమాల్లో నటించి ఓ మోస్తరు ఫలితాలను అందుకున్న పవన్.. స్ట్రెయిట్ మూవీ ‘హరిహర వీరమల్లు’తో పెద్ద డిజాస్టర్ను ఖాతాలో వేసుకున్నాడు. ఐతే చివరగా ఆయన్నుంచి వచ్చిన ‘ఓజీ’ మాత్రం అభిమానులను మురిపించింది. భారీ వసూళ్లతో పవన్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్గా నిలిచింది.
అంతే కాదు.. ఓజీ ఈ ఏడాదికి టాలీవుడ్ నుంచి నంబర్ వన్ సినిమాగా నిలిచింది. ఈ ఏడాది భారీ చిత్రాల సందడి పెద్దగా లేదు. ‘ఓజీ’ రావడానికి ముందు విక్టరీ వెంకటేష్ సంక్రాంతి సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’దే హైయెస్ట్ గ్రాసర్ రికార్డు. ఆ చిత్రం రూ.300 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి ఈ ఏడాదికి నంబర్ వన్ సినిమాగా కొనసాగింది. ఐతే ‘ఓజీ’ వచ్చి ఆ వసూళ్లను దాటేసింది. ఫుల్ రన్లో ఆ చిత్రం రూ.320 కోట్లకు పైగానే కలెక్షన్లు రాబట్టింది.
ఆ తర్వాత దాన్ని అధిగమించగల సత్తా ఉన్న సినిమాగా ‘అఖండ-2’ను పరిగణించారు. కానీ ఈ చిత్రం అంచనాలను అందుకోలేకపోయింది. తెలుగులో ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన బాలయ్య చిత్రం.. ఇతర భాషల్లో ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. ఇంకా ఈ సినిమా థియేట్రికల్ రన్ పూర్తి కాలేదు. కానీ ఫుల్ రన్ కలెక్షన్లు రూ.120 కోట్లను అందుకుంటే ఎక్కువ అన్నట్లుంది. కాబట్టి ఈ ఏడాదికి పవనే టాలీవుడ్ నుంచి నంబర్ వన్ హీరో అన్నమాట.
This post was last modified on December 18, 2025 9:31 am
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…
అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…
తిరుమల శ్రీవారి ఆలయం అంటే దేవుడు లేడని భావించే నాస్తికులు కూడా పన్నెత్తు మాట అనని కలియుగ వైకుంఠం. ఎంతో…