‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ చిత్రంతో టాలీవుడ్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది పంజాబీ భామ మెహ్రీన్ పిర్జాదా. ఆ తర్వాత ఆమెకు మంచి మంచి అవకాశాలు వచ్చాయి. మహానుభావుడు, ఎఫ్-2 లాంటి హిట్లూ పడ్డాయి. కానీ ఒక దశ దాటాక వరుస ఫ్లాపులు రావడంతో ఆమె జోరు తగ్గిపోయింది. తెలుగులో దాదాపుగా సినిమాలు ఆగిపోయాయి.
ఐతే కెరీర్ నెమ్మదిస్తున్న సమయంలోనే హర్యానాకు చెందిన రాజకీయ నాయకుడు భవ్యా బిష్ణోయ్తో నిశ్చితార్థం చేసుకుంది మెహ్రీన్. కానీ ఏవో కారణాలతో నిశ్చితార్థం రద్దయింది. అప్పట్నుంచి సింగిల్గానే ఉంటోంది మెహ్రీన్. ఐతే ఇటీవల ఆమె సైలెంట్గా పెళ్లి చేసుకుందంటూ మీడియాలో, సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. కానీ ఆ వార్తలు నిజం కాదంటూ మెహ్రీన్ మండిపడుతూ వివరణ ఇచ్చింది.
తనకు అసలు పరిచయమే లేని వ్యక్తితో పెళ్లి జరిగిందని వార్తలు రాయడంపై ఆమె మండిపడ్డారు. గత రెండేళ్లుగా ఇలాంటి ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయని.. అయినా మౌనంగా ఉన్నానని.. కానీ ఇప్పుడు స్పందించక తప్పడం లేదని అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా వేదికగా ఒక ప్రకటన విడుదల చేసింది.
‘‘ఓ వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నట్లు వార్త రాశారు. అతడితో నాకు కనీసం పరిచయం కూడా లేదు. నేను ఎవరినీ వివాహం చేసుకోలేదు. భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ విషయాన్ని నేనే స్వయంగా ప్రపంచానికి తెలియజేస్తాను. దయచేసి నన్ను నమ్మండి’’ మెహ్రీన్ పేర్కొంది. తెలుగులో మెహ్రీన్ నటించిన చివరి పేరున్న సినిమా అంటే ‘ఎఫ్-3’నే. ఆ తర్వాత ‘స్పార్క్’ అనే చిన్న సినిమాలో నటించింది. తర్వాత ఆమె తెలుగులో సినిమా చేయలేదు. ప్రస్తుతం మెహ్రీన్ కన్నడలో ఒక సినిమా చేస్తోంది.
This post was last modified on December 16, 2025 4:10 pm
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…
ఒక పెద్ద సినిమాలో రాముడి పాత్రను పోషించడం ఏ నటుడికైనా అరుదైన అవకాశమే. దాన్ని లైఫ్ టైం ఛాన్స్లాగే ఫీలవుతారు ఎవ్వరైనా. ‘ఆదిపురుష్’ ఫలితం…
వైసీపీ అధినేత, తన బ్రదర్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల మరోసారి విమర్శలు గుప్పించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్…