భారతదేశం గర్వించదగ్గ గొప్ప సంగీత విద్వాంసుల్లో ఎంఎస్ సుబ్బులక్ష్మి గారి స్థానం ఎవరూ భర్తీ చేయనిది, అందుకోలేనిది. దక్షిణాదిలోనే కాదు ఏ రాష్ట్రంలో అయినా వెంకటేశ్వర సుప్రభాతం వినిపిస్తోందంటే ఖచ్చితంగా అది ఆవిడ గొంతు నుంచి జాలువారిన మధురామృతమే. అలాంటి మహనీయురాలి బయోపిక్ తెరకెక్కడం చాలా అవసరం. గీతా ఆర్ట్స్ సంస్థ ప్రస్తుతం ఈ పనిలో ఉన్నట్టు సమాచారం. టైటిల్ పాత్రను సాయిపల్లవితో పోషింపజేసేందుకు ట్రై చేస్తున్నారట. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించబోయే ఈ ఎమోషనల్ అండ్ మ్యూజికల్ బయోపిక్ కి సంగీతం ఎవరు అందిస్తారనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
ఇప్పటి జనరేషన్ సుబ్బులక్ష్మి గారి గురించి తెలుసుకోవాలి. 1916 మదురైలో జన్మించి కేవలం పదకొండేళ్ల వయసులోనే తల్లి ప్రోత్సాహంతో 1927 తిరుచిరాపల్లి రాక్ ఫోర్డ్ గుడిలో కార్యక్రమం ఇచ్చారు. పదిహేడేళ్ల ఈడులో ప్రతిష్టాత్మక మదరాసు మ్యూజిక్ అకాడమీలో ప్రోగ్రాం చేయడం ఆవిడ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పింది. 1938లో తమిళ మూవీ సేవా సదనంతో ఇండస్ట్రీలోకి ప్రవేశించారు. 1945లో చేసిన మీరా మూవీ సుబ్బులక్ష్మి గారికి గొప్ప గుర్తింపు తెచ్చింది. భర్త సదాశివం గారి ప్రోత్సాహం చాలా ఉండేది. అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకుండా దేశవిదేశాల్లో కచేరీలు చేశారు.
సుబ్బులక్ష్మిగారిని ప్రభుత్వాలు ఎంతో గొప్పగా గౌరవించుకున్నాయి. భారతరత్న, పద్మభూషణ్, పద్మవిభూషణ్, రామ్ మెగసాసే, సంగీత కళానిధి లాంటి ఎన్నో పురస్కారాలు ఆవిడను అలంకరించాయి. 2004లో కన్నుమూసిన సుబ్బులక్ష్మి గారి లైఫ్ లో బయటి ప్రపంచానికి తెలియని బోలెడంత డ్రామా, కష్టం, కన్నీళ్లు ఉన్నాయి. అవన్నీ సినిమాలో చూపించవచ్చు. కింగ్డమ్ ఊహించని షాక్ ఇవ్వడంతో గౌతమ్ తిన్ననూరి కసిమీద ఉన్నారు. సుబ్బులక్ష్మి కనక సరిగ్గా కనెక్ట్ అయితే మహానటి లాగా బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేయొచ్చు. కథను 1916లో మొదలుపెట్టాలి కాబట్టి బడ్జెట్ భారీగానే అవసరం అయ్యేలా ఉంది.
This post was last modified on December 15, 2025 6:33 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…