నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన ‘అఖండ-2’కు మిక్స్డ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. కానీ సినిమాకు ఓపెనింగ్స్ పరంగా ఢోకా లేకపోయింది. ఈ చిత్రంలో యాక్షన్ ఘట్టాల విషయంలో ప్రేక్షకులు రెండు వర్గాలుగా విడిపోయారు. అభిమానులు, మాస్ ప్రేక్షకులు ఆ సీన్లను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కానీ మిగతా వాళ్లకు అవి మరీ అతిగా అనిపిస్తున్నాయి.
బోయపాటి సినిమాలంటే లాజిక్కులుండవని, యాక్షన్ ఘట్టాలు అతిగా ఉంటాయని ముందే ఆడియన్స్కు ఒక అంచనా ఉంది. కానీ ఇందులో అవి మరీ హద్దులు దాటిపోయాయని అంటోంది రెండో వర్గం. ఇంటర్వెల్ ఎపిసోడ్తో పాటు ద్వితీయార్ధంలో వచ్చే కొన్ని యాక్షన్ సీక్వెన్సుల్లో దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ మరీ ఇంత అతేంటి.. ఇందులో ఏమైనా లాజిక్ ఉందా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విమర్శలపై బోయపాటి శ్రీను ఒక ఇంటర్వ్యూలో స్పందించాడు.
“అఖండ అష్టసిద్ధి సాధించినవాడు. అష్ట దిగ్బంధనానికి వెళ్లిపోయి 12 సంవత్సరాల తర్వాత బయటికి వచ్చినవాడు. అతనొక సూపర్ హీరో. వాళ్లకు అస్సలు లాజిక్కా మ్యాజిక్కా అన్నది తీసేస్తే.. నానో ఆకారానికి వెళ్లగలరు. అలాగే విశ్వరూపం చూపించగలరు. కానీ మనం అక్కడి వరకు వెళ్లలేదు. ఇప్పుడు కరెక్ట్ కాదులే అని అవన్నీ చూపించలేదు. కేవలం ఆయుధంతో మాత్రమే గేమ్ ఆడాం. సూపర్ హీరోను బట్టి ఆ టైమింగ్ను బట్టి, ఆ సిచువేషన్ని బట్టి ఏ విధంగా అయినా మారతాడు. ఏది చేసినా సరే ఆయనకు లాజిక్ అనేది అవసరం లేదు. ఎందుకంటే అష్టసిద్ధి సాధకుడు అనే విషయం మొదటి రీల్లోనే చెప్పేశాం. దీనికి ఒక లాజిక్ కూడా ఉంది. కథను అలా మొదలుపెట్టాకే మిగతా విషయాలు చూపించాం. అఖండ అలాంటి శక్తి చూపించడంలో లాజిక్ లేకుండా ఏమీ లేదు” అని బోయపాటి వివరించాడు.
This post was last modified on December 13, 2025 6:40 pm
‘అఖండ 2.. తాండవం’ బాక్సాఫీస్ దగ్గర తాండవం ఆడుతూ దూసుకెళ్తోంది. సినిమాకు మిక్స్డ్ రివ్యూలు, టాక్ వచ్చినప్పటికీ.. తొలి రోజు…
టాలెంట్, రూపం రెండూ ఉన్న నటుడు ఆది పినిశెట్టి. మొదట హీరోగా పరిచయమైనా సరైనోడులో విలన్ గా మెప్పించాక ఒక్కసారిగా…
ఇప్పుడు పాడటం లేదు కానీ ఇరవై సంవత్సరాల క్రితం తెలుగు సంగీతంలో పాప్ మ్యూజిక్ అనే ఒరవడి తేవడంలో గాయని…
ఏపీలో మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కొనసాగుతోంది. దీనికి డెడ్లైన్ను మళ్లీ…
సంగీత దర్శకుడు తమన్ అఖండ 2 కోసం ఇచ్చిన సంగీతం మీద మిశ్రమ స్పందనే దక్కింది. ఆడియో శివ భక్తులకు…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక సమస్యగా ఉన్న రైతుల అంశాన్ని ప్రభుత్వం దాదాపు పరిష్కరించింది. ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని…