Movie News

రాధికా డబుల్ స్టాండర్డ్స్… నెటిజెన్ల పంచులు

కొందరు హీరోయిన్లు అసలేం మాట్లాడుతున్నారో ఆలోచించకుండా ఏదో ఒకటి అనేస్తారు. ఇప్పుడు రాధికా ఆప్టే అదే కోవలోకి వస్తోంది. బాలకృష్ణతో లెజెండ్, లయన్ లాంటి సినిమాల్లో నటించిన ఈ బాలీవుడ్ భామ కొత్త మూవీ సాలీ మొహబ్బత్ ఇటీవలే ఓటిటి స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సందర్భంగా ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దురంధర్ ని ఉద్దేశించి ఇన్ డైరెక్ట్ గా చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. హింసని ఎంటర్ టైన్మెంట్ పేరుతో అమ్ముతున్న చోట నేను బిడ్డను పెంచలేనని, ఇలా చెప్పాల్సి వచ్చినందుకు తనకు ఎలాంటి భయం లేదని పేర్కొంది. ఫ్యాన్స్ అది దురంధర్ గురించే అంటున్నారు.

కానీ రాధికా ఆప్టే మిస్సవుతున్న లాజిక్ ఒకటుంది. ఆమె ప్రధాన పాత్ర పోషించి రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన రక్త చరిత్రలో ఎంత వయొలెన్స్ ఉందో చూసిన చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. బోల్డ్ సిరీస్ లో నటించినప్పుడు, కథ డిమాండ్ పేరుతో స్కిన్ షో చేసినప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం విచిత్రం. అంటే ఫామ్ లో ఉన్నప్పుడు ఒకలా ఇప్పుడు అవకాశాలు తగ్గిపోయాక మరోలా మాట్లాడ్డం గురించి నెటిజెన్లు గట్టిగానే ప్రశ్నిస్తున్నారు. లస్ట్ స్టోరీస్ లాంటి వాటిలో నటించినప్పుడు లేని పెంపక బాధ్యత ఇప్పుడు హఠాత్తుగా ఎలా పుట్టుకొచ్చిందోనని సెటైర్లు వేస్తున్నారు.

ఎలా చూసినా దురంధర్ సక్సెస్ ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్న వైనం స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు అమీర్ ఖాన్ ఇలాంటి కామెంట్స్ చేసి దేశవ్యాప్తంగా వ్యతిరేకత తెచ్చుకున్నాడు. తర్వాత డ్యామేజ్ రిపేర్ చేశారు. కానీ ఇప్పుడు రాధికా ఆప్టే అన్నవి ఆ కోణంలోకి రాకపోయినా మరీ ఇండియాలో వినోదం దిగజారిందనే తరహాలో మాట్లాడ్డం విడ్డూరం. మరి అమెరికాలో వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్ లు అత్యున్నత మానవతా విలువలతో ఉంటాయేమో అది కూడా చెబితే బాగుంటుందని పంచులు పడుతున్నాయి. ఏదైతేనేం అందరూ మర్చిపోయిన రాధికా ఆప్టే మళ్ళీ లైంలైట్ లోకి వచ్చేసింది.

Kumar

Recent Posts

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

27 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

9 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

10 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

11 hours ago