అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్ వచ్చే ఏడాది జనవరి 1కి వెళ్లిపోగా ఈషాని డిసెంబర్ 25కి షిఫ్ట్ చేశారు. కానీ మోగ్లీ వెనుకడుగు వేయలేదు. యుఎస్ లో పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేసుకోవడం, ఆ మేరకు థియేటర్ స్క్రీనింగ్ తో సహా మొత్తం షెడ్యూల్ అయిపోవడం వల్ల తగ్గకూడదనే ఉద్దేశంతో ఇండియాలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 13 ప్రేక్షకులకు ముందుకు తెస్తున్నారు. అయితే ఈ పరిణామానికి ముందే మోగ్లీ దర్శకుడు సందీప్ రాజ్ ట్విట్టర్ వేదికలో తన బాధను, అసంతృప్తిని వ్యక్తం చేయడం జనాలను కదిలించింది.
నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతిథిగా వచ్చిన దర్శకుడు మారుతీ ఈ ప్రస్తావన తెచ్చారు. చేతిలో సోషల్ మీడియా ఉంది కదాని ట్వీట్లు వేస్తే ఎలా, బాలయ్యతో పాటు రావడం ఒక వరంగా భావించాలని, ఇప్పుడీ క్లాష్ వల్లే మోగ్లీ గురించి ఇంకా ఎక్కువ శాతం ఆడియన్స్ కి తెలిసి వచ్చిందని హితబోధ చేశారు. గతంలో శంకర్ దాదా ఎంబిబిఎస్ తో పోటీపడి దాంతో పాటు ఆనంద్ విజయం సాధించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మారుతీ చెప్పింది ముమ్మాటికీ రైటే. అయితే దర్శకులైనా, సాధారణ జనాలైనా వాళ్ళ ఉద్దేశాలు త్వరగా రీచ్ అయ్యేది సోషల్ మీడియా ద్వారానే.
దాన్ని వాడకుండా భావాలను వ్యక్తపరచడం కష్టమైపోయింది. ముఖ్యంగా యూత్ ని టార్గెట్ చేసుకున్న మోగ్లీ లాంటి సినిమాలకు ఈ ప్లాట్ ఫార్మ్ కీలకం. అందుకే సందీప్ రాజ్ అక్కడ స్పందించాల్సి వచ్చింది. అంత మాత్రాన ఇదేదో ఆయన్ను సమర్దిస్తున్నట్టు కాదు కానీ, ఒకవేళ తన ఆవేదన అలా వ్యక్తపరచక పోయి ఉంటే ఇండస్ట్రీ నుంచి హీరోలు, నిర్మాతలు తనకు ఎంత సపోర్ట్ ఉన్నారో తెలిసేది కాదుగా. అయినా ట్యాగ్ చేస్తే చాలు సమాధానం ఇస్తూ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే మారుతీ సలహా అయితే బాగుంది. కానీ ప్రతి భావోద్వేగం నియంత్రణలో ఉండేది కాదు కాబట్టి సందీప్ రాజ్ ఆ ఫ్లోలో, ఆయన కోణంలో చేసింది రైటే.
This post was last modified on December 11, 2025 11:59 am
ఒకపక్క టాక్సిక్ పుణ్యమాని తెలుగు, కన్నడ మూవీ లవర్స్ సోషల్ మీడియా వేదికగా ఒకరిమీద మరొకరు కామెంట్లు, ట్రోల్స్ చేసుకోవడం…
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేని, రెండు మూడు చిన్న సినిమాల అనుభవం ఉన్న హీరోను పెట్టి.. ఒక డెబ్యూ డైరెక్టర్ రూ.3-4…
అక్టోబర్ 2 నుంచి ఆదర్శ కుటుంబం ఏకె ఫార్టీ సెవెన్ తప్పుకున్నాక మళ్ళీ కొత్త డేట్ ప్రకటించలేదు. ఒకవేళ జైలర్…
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…