Movie News

బాలయ్యతో వస్తే మోగ్లికే మంచిది

అఖండ 2 వాయిదా వ్యవహారం డిసెంబర్ 12 విడుదల కావాల్సిన వేరే సినిమాల మీద ప్రభావం చూపించింది. సైక్ సిద్దార్థ్ వచ్చే ఏడాది జనవరి 1కి వెళ్లిపోగా ఈషాని డిసెంబర్ 25కి షిఫ్ట్ చేశారు. కానీ మోగ్లీ వెనుకడుగు వేయలేదు. యుఎస్ లో పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేసుకోవడం, ఆ మేరకు థియేటర్ స్క్రీనింగ్ తో సహా మొత్తం షెడ్యూల్ అయిపోవడం వల్ల తగ్గకూడదనే ఉద్దేశంతో ఇండియాలో మాత్రం ఒక రోజు ఆలస్యంగా డిసెంబర్ 13 ప్రేక్షకులకు ముందుకు తెస్తున్నారు. అయితే ఈ పరిణామానికి ముందే మోగ్లీ దర్శకుడు సందీప్ రాజ్ ట్విట్టర్ వేదికలో తన బాధను, అసంతృప్తిని వ్యక్తం చేయడం జనాలను కదిలించింది.

నిన్న జరిగిన మోగ్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అతిథిగా వచ్చిన దర్శకుడు మారుతీ ఈ ప్రస్తావన తెచ్చారు. చేతిలో సోషల్ మీడియా ఉంది కదాని ట్వీట్లు వేస్తే ఎలా, బాలయ్యతో పాటు రావడం ఒక వరంగా భావించాలని, ఇప్పుడీ క్లాష్ వల్లే మోగ్లీ గురించి ఇంకా ఎక్కువ శాతం ఆడియన్స్ కి తెలిసి వచ్చిందని హితబోధ చేశారు. గతంలో శంకర్ దాదా ఎంబిబిఎస్ తో పోటీపడి దాంతో పాటు ఆనంద్ విజయం సాధించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మారుతీ చెప్పింది ముమ్మాటికీ రైటే. అయితే దర్శకులైనా, సాధారణ జనాలైనా వాళ్ళ ఉద్దేశాలు త్వరగా రీచ్ అయ్యేది సోషల్ మీడియా ద్వారానే.

దాన్ని వాడకుండా భావాలను వ్యక్తపరచడం కష్టమైపోయింది. ముఖ్యంగా యూత్ ని టార్గెట్ చేసుకున్న మోగ్లీ లాంటి సినిమాలకు ఈ ప్లాట్ ఫార్మ్ కీలకం. అందుకే సందీప్ రాజ్ అక్కడ స్పందించాల్సి వచ్చింది. అంత మాత్రాన ఇదేదో ఆయన్ను సమర్దిస్తున్నట్టు కాదు కానీ, ఒకవేళ తన ఆవేదన అలా వ్యక్తపరచక పోయి ఉంటే ఇండస్ట్రీ నుంచి హీరోలు, నిర్మాతలు తనకు ఎంత సపోర్ట్ ఉన్నారో తెలిసేది కాదుగా. అయినా ట్యాగ్ చేస్తే చాలు సమాధానం ఇస్తూ ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే మారుతీ సలహా అయితే బాగుంది. కానీ ప్రతి భావోద్వేగం నియంత్రణలో ఉండేది కాదు కాబట్టి సందీప్ రాజ్ ఆ ఫ్లోలో, ఆయన కోణంలో చేసింది రైటే.

This post was last modified on December 11, 2025 11:59 am

Share
Show comments
Published by
Kumar

Recent Posts

నెట్ ఫ్లిక్స్ ఒకవైపు… డాల్బీ సినిమా ఇంకోవైపు

టాలీవుడ్ కు సంబంధించి హైదరాబాద్ ఇవాళ రెండు కీలక ఘట్టాలకు సాక్ష్యంగా నిలబడుతోంది. నెట్ ఫ్లిక్స్ కార్యాలయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి…

3 minutes ago

కాలర్ లాంటి కంటెంట్ ఉంటే చాలు

మార్చి 19 విడుదల కాబోతున్న ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి 'మెడ ముట్టుకుంటే తొడ కొట్టినట్టే' పాట వచ్చినప్పుడు పాజిటివిటీ…

1 hour ago

‘అటవీశాఖ అధికారులను కిడ్నాప్ చెయ్యాలి’

అమరావతిలో జరిగిన కలెక్టర్ల సదస్సులో అటవీ శాఖ అధికారుల పనితీరుపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ…

2 hours ago

కష్టాల నాయకుడికి ‘ప్రైమ్’ షాకు ?

రాజకీయాలంటే అంతే. అడుగుపెట్టాక చాలా బురదను కడుక్కోవాల్సి ఉంటుంది. కొందరు తట్టుకుంటారు. కొందరు వదిలేస్తారు. చిరంజీవి ప్రజారాజ్యం విషయంలో ఎక్కడైతే…

2 hours ago

పవన్ ఫ్యాన్స్ బాధ అర్థం చేసుకున్నారు

అభిమానులందు పవన్ అభిమానులు వేరయా అంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఆయనకున్న లాయల్ ఫ్యాన్ బేస్ ఇండియా మొత్తంలో…

4 hours ago

అక్షయ్ కామెడీ… ఇప్పుడు పండుతుందా?

​బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో తనకి ఎన్నో…

4 hours ago