భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కానీ దానికి సహేతుకమైన కారణం ఆమోదం దక్కుతుంది. సోషల్ మీడియా కాలంలో దీని పట్ల ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. హృతిక్ రోషన్ దానికి ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఇటీవలే విడుదలైన దురంధర్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. సినిమా చూసిన హృతిక్ తన ఇన్స్ టా స్టేటస్ లో టీమ్ మీద పొగడ్తలు కురిపిస్తూనే దురంధర్ లో చూపించిన రాజకీయాల గురించి మాట్లాడనని, ఫిలిం మేకర్స్ బాధ్యతల గురించి చర్చించేందుకు ఇది సందర్భం కాదని పేర్కొన్నాడు. నిజానికివి చాలా పెద్ద మాటలు.
ఎందుకంటే దురంధర్ లో చూపించింది మన దేశ రాజకీయాలు కాదు. పాకిస్థాన్ మాఫియా గుప్పిట్లో ఉన్న అక్కడి పాలిటిక్స్ గురించి. అది తప్పో ఒప్పో తేల్చాల్సింది చరిత్రకారులు. దర్శకుడు ఆదిత్య ధార్ చాలా పరిశోధన చేసి స్క్రిప్ట్ రాసుకున్నాడు. డిటైలింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉండటం వల్లే థాయ్ లాండ్ లో వేసిన లయారి సెట్ నిజంగానే పాక్ లో తీశారా అనేంత సహజంగా ఉంది. ఫ్లైట్ హైజాక్, ముంబై దాడులు, పార్లమెంట్ అటాక్ ఇలా అన్ని అంశాలను చాలా బాలన్స్ గా చూపించాడు ధార్. అలాంటప్పుడు హృతిక్ వాడిన బాధ్యత, రాజకీయాలు లాంటి పదాలు నెటిజెన్ల ఆగ్రహానికి గురవ్వడం సహజం.
డ్యామేజ్ గుర్తించిన హృతిక్ రోషన్ తాజాగా పెట్టిన ట్విట్టర్ పోస్టులో మ్యాటర్ మార్చేసి నటీనటులకు సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు చెప్పాడు. దురంధర్ మీద ఆన్ లైన్ జనాలు రెండుగా విడిపోయిన మాట వాస్తవం. అయితే వార్ లాగా ఎలివేషన్లు లేకుండా నిజాయితీగా పాక్ మాఫియాని నగ్నంగా చూపించడం హృతిక్ ని నచ్చలేదేమోనని కొందరు సెటైర్లు వేశారు. అయినా యునానిమస్ టాక్ తెచ్చుకున్నాక కొన్ని బాలీవుడ్ హ్యాండిల్స్ ఎంత నెగటివ్ గా ప్రచారం చేస్తున్నా దాని ప్రభావం దురంధర్ వసూళ్ల మీద పడటం లేదు అంతేమరి కంటెంట్ బాగున్నప్పుడు ఆడియన్స్ ఇవన్నీ పట్టించుకోరు.
This post was last modified on December 11, 2025 10:18 am
బాలీవుడ్ లోనే కాదు భారతీయ సినీ చరిత్రలోనే అత్యంత ఖరీదయిన సినిమాగా తెరకెక్కుతున్న రామాయణ పార్ట్ 1 టీజర్ ఇవాళ…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే లక్ష్యంతో గత నెల 28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా భేటీ అయి.. దీనిపై…
అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే…
అటు తమిళం, ఇటు తెలుగు ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న భారీ చిత్రాల్లో ‘యుగానికి ఒక్కడు’ ఒకటి. కార్తికి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చిన…
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి మూడు అనే అంకె అంటే చాలా ఇష్టంగానే ఉన్నట్టుంది. కనీసం రాజధాని కూడా…
ప్రస్తుతం ఎవరు ఔనన్నా.. కాదన్నా.. దేశానికే కాదు.. దేశంలోని రాజకీయాలకు కూడా ప్రధాని మోడీ పెద్దదిక్కుగా మారారన్నది వాస్తవం. ఆయనను…