భావ ప్రకటన స్వేచ్ఛ అందరికీ ఉంటుంది కానీ దానికి సహేతుకమైన కారణం ఆమోదం దక్కుతుంది. సోషల్ మీడియా కాలంలో దీని పట్ల ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా ఖచ్చితంగా రివర్స్ అవుతుంది. హృతిక్ రోషన్ దానికి ఉదాహరణగా నిలుస్తున్నాడు. ఇటీవలే విడుదలైన దురంధర్ బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే. సినిమా చూసిన హృతిక్ తన ఇన్స్ టా స్టేటస్ లో టీమ్ మీద పొగడ్తలు కురిపిస్తూనే దురంధర్ లో చూపించిన రాజకీయాల గురించి మాట్లాడనని, ఫిలిం మేకర్స్ బాధ్యతల గురించి చర్చించేందుకు ఇది సందర్భం కాదని పేర్కొన్నాడు. నిజానికివి చాలా పెద్ద మాటలు.
ఎందుకంటే దురంధర్ లో చూపించింది మన దేశ రాజకీయాలు కాదు. పాకిస్థాన్ మాఫియా గుప్పిట్లో ఉన్న అక్కడి పాలిటిక్స్ గురించి. అది తప్పో ఒప్పో తేల్చాల్సింది చరిత్రకారులు. దర్శకుడు ఆదిత్య ధార్ చాలా పరిశోధన చేసి స్క్రిప్ట్ రాసుకున్నాడు. డిటైలింగ్ అంత పర్ఫెక్ట్ గా ఉండటం వల్లే థాయ్ లాండ్ లో వేసిన లయారి సెట్ నిజంగానే పాక్ లో తీశారా అనేంత సహజంగా ఉంది. ఫ్లైట్ హైజాక్, ముంబై దాడులు, పార్లమెంట్ అటాక్ ఇలా అన్ని అంశాలను చాలా బాలన్స్ గా చూపించాడు ధార్. అలాంటప్పుడు హృతిక్ వాడిన బాధ్యత, రాజకీయాలు లాంటి పదాలు నెటిజెన్ల ఆగ్రహానికి గురవ్వడం సహజం.
డ్యామేజ్ గుర్తించిన హృతిక్ రోషన్ తాజాగా పెట్టిన ట్విట్టర్ పోస్టులో మ్యాటర్ మార్చేసి నటీనటులకు సాంకేతిక నిపుణులకు శుభాకాంక్షలు చెప్పాడు. దురంధర్ మీద ఆన్ లైన్ జనాలు రెండుగా విడిపోయిన మాట వాస్తవం. అయితే వార్ లాగా ఎలివేషన్లు లేకుండా నిజాయితీగా పాక్ మాఫియాని నగ్నంగా చూపించడం హృతిక్ ని నచ్చలేదేమోనని కొందరు సెటైర్లు వేశారు. అయినా యునానిమస్ టాక్ తెచ్చుకున్నాక కొన్ని బాలీవుడ్ హ్యాండిల్స్ ఎంత నెగటివ్ గా ప్రచారం చేస్తున్నా దాని ప్రభావం దురంధర్ వసూళ్ల మీద పడటం లేదు అంతేమరి కంటెంట్ బాగున్నప్పుడు ఆడియన్స్ ఇవన్నీ పట్టించుకోరు.
పవన్ కళ్యాణ్ భుజాల లోపల కలిగిన గాయం ఊహించిన దానికంటే తీవ్రంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్…
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వేధింపులకు గురిచేసి.. కస్టడీలో టార్చర్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐపీఎస్ సునీల్ కుమార్…
రాజకీయాలంటే చాలా మంది చెడిపోయాయని అనుకుంటారు. కానీ, రాజకీయాలు అంతగా ఏమీ చెడిపోలేదు. ఒక పార్టీ కారణంగానే ఈ పేరు…
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అనౌన్స్ మెంట్ ఇవాళ వచ్చేసింది. నిజానికి…
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను ఎంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తారో తెలిసిందే. ప్రతిసారీ అవార్డులు ప్రకటించినపుడు గ్రహీతల అర్ఙతల…
జనసేన పార్టీ అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మరోసారి ఆసుపత్రిలో చేరారు. 40 రోజుల కిందట ఆయన…