గత వారం రావాల్సిన అఖండ-2.. నిర్మాతలకు, ఈరోస్ సంస్థకు మధ్య ఉన్న పాత ఫైనాన్స్ వివాదం కోర్టుకు చేరడంతో అనూహ్యంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. ఆ వివాదాన్ని పరిష్కరించుకుని ఈ నెల 12న సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంది నిర్మాణ సంస్థ. కొంచెం హడావుడి అయినా సరే.. చకచకా విడుదలకు ఏర్పాట్లు చేశారు. గురువారం సెకండ్ షో నుంచే సినిమాకు ప్రిమియర్స్ పడిపోతున్నాయి. వాయిదా వల్ల ఆర్థికంగా ఇటు నిర్మాతలు.. అటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు కొంత నష్టపోయిన మాట వాస్తవం.
కానీ దాన్ని కవర్ చేయగల సత్తా సినిమాకు ఉందని అందరూ ధీమాగా ఉన్నారు. అర్ధంతరంగా రిలీజ్ ఆగిపోయిన దగ్గర్నుంచి ‘అఖండ-2’ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అయింది. సినిమాకు హైప్ ఏమాత్రం తగ్గకపోగా.. ఇంకా పెరిగింది అంటే అతిశయోక్తి కాదు. కొత్త డేట్ అనౌన్స్ చేశాక ప్రిమియర్స్కు మధ్య రెండు రోజుల సమయమే మిగిలింది. అయినా బుకింగ్స్ విషయంలో పెద్దగా ఇబ్బంది లేనట్లే కనిపిస్తోంది.
మామూలుగా ఓవర్సీస్ ప్రిమియర్స్కు కొన్ని వారాల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెడతారు. టికెట్ల అమ్మకాలు నెమ్మదిగా సాగుతాయి. కానీ రెండు రోజుల గ్యాప్లో టికెట్ల అమ్మకాలు మొదులపెట్టినా సరే.. యమ స్పీడుగా జరుగుతున్నాయి. తక్కువ గ్యాప్ ఉండడం వల్ల ప్రిమియర్స్కు ఏమాత్రం స్పందన వస్తుందో అన్న అనుమానాలు పటాపంచలైపోయాయి. యుఎస్ షోలు చాలా వరకు ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో కూడా బుకింగ్స్కు ఢోకా లేనట్లే కనిపిస్తోంది.
ఏపీలో ఆల్రెడీ జోరుగా బుకిింగ్స్ జరుగుతున్నాయి. నైజాం బుకింగ్స్ మొదలుపెట్టాల్సి ఉంది. వాటికీ మంచి స్పందనే వస్తుందని ఆశిస్తున్నారు. మొత్తంగా పరిస్థితి ఆశాజనకంగా కనిపిస్తోంది. టీం కొత్తగా పబ్లిసిటీ మీద ఖర్చు పెట్టాల్సిన అవసరమేమీ కనిపించడం. కొత్తగా ఈవెంట్లు, ఇంటర్వ్యూలేమీ ప్లాన్ చేయలేదు. కానీ రిలీజ్ ముంగిట ఒక కొత్త ట్రైలర్ మాత్రం వదలాలని చూస్తున్నట్లు సమాచారం. ఈ రోజు రాత్రికి లేదా రేపు ఉదయం ఆ ట్రైలర్ రావచ్చని అంటున్నారు. పవర్ ఫుల్ డైలాగులతో ఈ రిలీజ్ ట్రైలర్ వదలాలని చూస్తున్నాడట దర్శకుడు బోయపాటి.
This post was last modified on December 10, 2025 2:55 pm
టాలీవుడ్ థియేటర్ల దగ్గర ఇరుముడి సందడి ఓ రేంజ్ లో ఉంది. సెకండ్ షోలు సైతం టికెట్ ముక్క దొరకనంతగా…
కడప ఎంపీ, వైసీపీ అధినేత జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి గృహాల్లో ఈడీ సోదాలతో మాజీ మంత్రి వైఎస్…
తెలుగు సినిమా పుట్టిన తర్వాత ఎందరో లెజెండ్స్ ప్రేక్షకుల హృదయాల మీద చెరిగిపోని సంతకం చేశారు. చిత్తూరు నాగయ్య నుంచి…
అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ఇలా తీసింది మూడు సినిమాలే అయినా ప్యాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ…
ఈ సంవత్సరం మన శంకరవరప్రసాద్ గారుతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి వచ్చే…
ఒక్కోసారి మనం తీసుకునే నిర్ణయాలు పక్కవాళ్ళకు మేలు చేస్తాయి. ఇండస్ట్రీలో కూడా ఇది సర్వ సాధారణం. కాకపోతే ఈ ప్రయోజనం…