స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం ఋజువై శిక్ష అనుభవిస్తాడో తెలియక అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బెంగళూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న దర్శన్ ఆ మధ్య కొన్ని వారాలు బెయిలు మీద బయటికి వచ్చాడు. గుట్టుచప్పుడు కాకుండా బ్యాలన్స్ ఉన్న డెవిల్ షూటింగ్, డబ్బింగ్ రెండూ పూర్తి చేశాడని ఇన్ సైడ్ టాక్. ఇప్పుడా సినిమానే డిసెంబర్ 11 అంటే రాబోయే గురువారం విడుదలవుతోంది. ఇటీవలే ట్రైలర్ లాంచ్ సైలెంట్ గా చేసేశారు. దర్శన్ ఫ్యాన్స్ ఈ నెలని హిట్ సెంటిమెంట్ గా భావిస్తారు.
సాక్ష్యాలు బలంగా ఉండటంతో దర్శన్ బయటికి రావడం అనుమానమేనని లాయర్లు చెబుతున్నారు. తన తరఫున వాదిస్తున్న న్యాయవాదులు మాత్రం శాయశక్తులా విడుదల చేయించేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఎలిబీలతో సహా అన్నీ దర్శన్ కు వ్యతిరేకంగా ఉండటం ప్రతికూలంగా మారింది. రాజకీయంగా కూడా ఎలాంటి మద్దతు దక్కకపోవడంతో దర్శన్ ఒంటరి పోరాడం చేస్తున్నాడు. కావాలంటే నన్ను చంపేయండి అంటూ గత హియరింగ్ లో జడ్జ్ ముందు వాపోయినప్పటికీ ఆ సింపతి పెద్దగా పని చేయలేదు. ఆ విన్నపాన్ని బుట్టదాఖలు చేయడంతో రిమాండ్ యథావిధిగా కొనసాగుతోంది.
ఇంత పెద్ద నేరంలో చిక్కుకున్నాక డెవిల్ కి ఎలాంటి ఆదరణ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే స్వంత ఫ్యాన్స్ తప్ప ఇతర వర్గాల్లో తన పట్ల సానుభూతి లేదు. ఒక వ్యక్తిని అంత దారుణంగా చావుకు గురి చేయడం ఎవరూ సమర్ధించలేకపోతున్నారు. కొందరు డెవిల్ కు వ్యతిరేకంగా థియేటర్ల వద్ద నిరసన ప్లాన్ చేసే అవకాశం ఉండటంతో పోలీసులు దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారట. డెవిల్ పెద్ద బడ్జెట్ తో రూపొందినప్పటికీ కన్నడలో మాత్రమే రిలీజవుతోంది. తెలుగుతో సహా ఇతర భాషల్లో డబ్బింగ్ చేయలేదు. హిట్టయినా ఫ్లాప్ అయినా దాన్ని ఆస్వాదించేందుకు దర్శన్ అయితే బయట ఉండడు.
This post was last modified on December 7, 2025 8:21 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…