స్వంత అభిమాని హత్య కేసులో అభియోగం ఎదురుకుంటున్న శాండల్ వుడ్ హీరో దర్శన్ ఎప్పుడు బయటికి వస్తాడో లేదా నేరం ఋజువై శిక్ష అనుభవిస్తాడో తెలియక అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బెంగళూరు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న దర్శన్ ఆ మధ్య కొన్ని వారాలు బెయిలు మీద బయటికి వచ్చాడు. గుట్టుచప్పుడు కాకుండా బ్యాలన్స్ ఉన్న డెవిల్ షూటింగ్, డబ్బింగ్ రెండూ పూర్తి చేశాడని ఇన్ సైడ్ టాక్. ఇప్పుడా సినిమానే డిసెంబర్ 11 అంటే రాబోయే గురువారం విడుదలవుతోంది. ఇటీవలే ట్రైలర్ లాంచ్ సైలెంట్ గా చేసేశారు. దర్శన్ ఫ్యాన్స్ ఈ నెలని హిట్ సెంటిమెంట్ గా భావిస్తారు.
సాక్ష్యాలు బలంగా ఉండటంతో దర్శన్ బయటికి రావడం అనుమానమేనని లాయర్లు చెబుతున్నారు. తన తరఫున వాదిస్తున్న న్యాయవాదులు మాత్రం శాయశక్తులా విడుదల చేయించేందుకు ట్రై చేస్తున్నారు. అయితే ఎలిబీలతో సహా అన్నీ దర్శన్ కు వ్యతిరేకంగా ఉండటం ప్రతికూలంగా మారింది. రాజకీయంగా కూడా ఎలాంటి మద్దతు దక్కకపోవడంతో దర్శన్ ఒంటరి పోరాడం చేస్తున్నాడు. కావాలంటే నన్ను చంపేయండి అంటూ గత హియరింగ్ లో జడ్జ్ ముందు వాపోయినప్పటికీ ఆ సింపతి పెద్దగా పని చేయలేదు. ఆ విన్నపాన్ని బుట్టదాఖలు చేయడంతో రిమాండ్ యథావిధిగా కొనసాగుతోంది.
ఇంత పెద్ద నేరంలో చిక్కుకున్నాక డెవిల్ కి ఎలాంటి ఆదరణ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే స్వంత ఫ్యాన్స్ తప్ప ఇతర వర్గాల్లో తన పట్ల సానుభూతి లేదు. ఒక వ్యక్తిని అంత దారుణంగా చావుకు గురి చేయడం ఎవరూ సమర్ధించలేకపోతున్నారు. కొందరు డెవిల్ కు వ్యతిరేకంగా థియేటర్ల వద్ద నిరసన ప్లాన్ చేసే అవకాశం ఉండటంతో పోలీసులు దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తున్నారట. డెవిల్ పెద్ద బడ్జెట్ తో రూపొందినప్పటికీ కన్నడలో మాత్రమే రిలీజవుతోంది. తెలుగుతో సహా ఇతర భాషల్లో డబ్బింగ్ చేయలేదు. హిట్టయినా ఫ్లాప్ అయినా దాన్ని ఆస్వాదించేందుకు దర్శన్ అయితే బయట ఉండడు.
This post was last modified on December 7, 2025 8:21 pm
ఒకప్పుడు అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోగా సుమంత్ కు మంచి ఫాలోయింగ్ ఉండేది. సత్యం, గౌరీ, గోదావరి లాంటి…
సౌత్ ఇండియన్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడైన దేవిశ్రీ ప్రసాద్ వయసు ప్రస్తుతం 46 ఏళ్లు. కానీ ఇంతలోనే అతను 27 ఏళ్ల…
ఎట్టకేలకు ప్రశాంత్ కిషోర్ ఎన్నికల్లో గెలిచాడు. జులై 30 వ తేదీన బీహార్ ఉప ఎన్నికల్లో బంకీపూర్ నుంచి ఎన్నికల…
ఒకపెద్ద సినీ కుటుంబం నుంచి పరిచయం అయ్యే కొత్త హీరో మాస్ ఇమేజ్ కోసమే తపన పడతాడు. కానీ వరుణ్ తేజ్ మాత్రం…
భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఓ సంచలన తీర్పును వెలువరించింది. మారుతున్నకాలానికి అనుగుణంగా మనిషి జీవనయానంలోనూ మార్పులు చోటుచేసుకుంటూ వస్తోంటే... ఆ…
అదేంటో స్పైడర్ మ్యాన్ జ్వరం మనోళ్లకు ఓ రేంజ్ లో పట్టేసింది. భాషతో సంబంధం లేకుండా ముంబై నుంచి మచిలీపట్నం…