Movie News

మణిరత్నంతో సాయిపల్లవి – సేతుపతి సినిమా ?

పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే తీసుకొచ్చింది. ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత నాయకుడు కాంబినేషన్ రిపీట్ చేస్తే ఇలాంటి దారుణమైన సినిమా ఇచ్చారేమిటని మూవీ లవర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. ఏదో యావరేజ్ అనిపించుకున్నా ఓకే కానీ మరీ ట్రోలింగ్ లెవెల్ లో ఆ మూవీ పోయింది. దాని తర్వాత మణిరత్నం నుంచి ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. నవీన్ పోలిశెట్టి, శింబు పేర్లు తొలుత వినిపించాయి. కానీ అవి నిజం కాలేదు. తాజాగా ఒక క్రేజీ కాంబోని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.

విజయ్ సేతుపతి – సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో మణిరత్నం ఒక ప్రాజెక్టుని ప్లాన్ చేసినట్టు చెన్నై టాక్. నూతన సంవత్సర సందర్భంగా వచ్చే నెల ప్రకటించి అదే నెలలో షూటింగ్ కు వెళ్లేలా ప్లానింగ్ జరుగుతోందట. ప్రస్తుతం రామాయణ తప్ప ఇంకెవరికి కమిట్ మెంట్ ఇవ్వని సాయిపల్లవి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే కంటెంట్ ఏదో నమ్మొచ్చు అనేలా ఉంది. విజయ్ సేతుపతి ఆయనతో పని చేయడం మొదటిసారి కాదు. గతంలో చిక్క చివత వనం (తెలుగులో నవాబ్) చేశాడు. పెద్దగా రిజల్ట్ రాలేదు కానీ తమిళంలో ఘోరంగా అయితే పోలేదు. ఆ టైంలో సేతుపతికి ఇప్పుడున్నంత ఇమేజ్ లేదు.

కలయిక బాగుంది కానీ మణిరత్నం ఎలాంటి కథ రాసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. పొన్నియిన్ సెల్వన్ షూటింగ్ సమయంలో తన దగ్గర ఒక రొమాంటిక్ స్క్రిప్ట్ ఉందని, సఖి – ఓకే బంగారం తరహాలో ఫ్రెష్ గా ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు విజయ్ సేతుపతి – సాయిపల్లవి లాంటి పెర్ఫార్మర్లకు ఆ జానర్ సూట్ కాదు. సో ఏదో వేరే స్టోరీ అయ్యుంటుందనుకోవచ్చు. ప్రస్తుతానికి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. పూరి జగన్నాథ్ తో స్లమ్ డాగ్ (ప్రచారంలో ఉన్న టైటిల్) పూర్తి చేసిన విజయ్ సేతుపతి దాంతో పెద్ద బ్రేక్ దక్కుతుందనే నమ్మకంతో ఉన్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.

Kumar

Recent Posts

పట్టు వదలకుండా పరిగెత్తాలి పెద్ది

పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…

17 minutes ago

పవన్ పేరు ఎందుకు మారింది?

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…

6 hours ago

ఏపీ పాఠ‌శాల‌ల్లో చాగంటి పాఠ్యాంశాలు..!

ఏపీ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ప్ర‌ముఖ ప్ర‌వ‌చ క‌ర్త చాగంటి కోటేశ్వ‌ర‌రావు ప్ర‌సంగాల‌ను పాఠ్యాంశాలుగా ప్ర‌వేశ పెడుతున్నట్టు ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించి…

7 hours ago

జ‌న‌’సేన’ జాగ్ర‌త్త ప‌డాలా?

ఏపీలో కూటమిగా ఏర్పడిన టిడిపి, జనసేన, బిజెపిలు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయింది. ఈ క్రమంలో కూటమికి నేతృత్వం…

8 hours ago

మీనాక్షి ఇష్యూ కాంగ్రెస్ ను ‘హర్ట్’ చేసింది!

ఓ రాజకీయ పార్టీ తనను వేధించిన విషయంపై అలుపెరగని పోరాటం చేసి తీరుతుంది. అలా చేయకుంటే… అది రాజకీయ పార్టీ…

10 hours ago

మోదీ రికార్డును బద్దలుకొట్టడం కష్టమే!

భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. దేశానికి అత్యధిక కాలం…

10 hours ago