పొన్నియిన్ సెల్వన్ తర్వాత మణిరత్నం కంబ్యాక్ అయ్యారని అభిమానులు భావించారు కానీ థగ్ లైఫ్ దెబ్బ మళ్ళీ కథను మొదటికే తీసుకొచ్చింది. ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత నాయకుడు కాంబినేషన్ రిపీట్ చేస్తే ఇలాంటి దారుణమైన సినిమా ఇచ్చారేమిటని మూవీ లవర్స్ అందరూ ఆశ్చర్యపోయారు. ఏదో యావరేజ్ అనిపించుకున్నా ఓకే కానీ మరీ ట్రోలింగ్ లెవెల్ లో ఆ మూవీ పోయింది. దాని తర్వాత మణిరత్నం నుంచి ఎలాంటి అనౌన్స్ మెంట్ రాలేదు. నవీన్ పోలిశెట్టి, శింబు పేర్లు తొలుత వినిపించాయి. కానీ అవి నిజం కాలేదు. తాజాగా ఒక క్రేజీ కాంబోని తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.
విజయ్ సేతుపతి – సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో మణిరత్నం ఒక ప్రాజెక్టుని ప్లాన్ చేసినట్టు చెన్నై టాక్. నూతన సంవత్సర సందర్భంగా వచ్చే నెల ప్రకటించి అదే నెలలో షూటింగ్ కు వెళ్లేలా ప్లానింగ్ జరుగుతోందట. ప్రస్తుతం రామాయణ తప్ప ఇంకెవరికి కమిట్ మెంట్ ఇవ్వని సాయిపల్లవి దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంటే కంటెంట్ ఏదో నమ్మొచ్చు అనేలా ఉంది. విజయ్ సేతుపతి ఆయనతో పని చేయడం మొదటిసారి కాదు. గతంలో చిక్క చివత వనం (తెలుగులో నవాబ్) చేశాడు. పెద్దగా రిజల్ట్ రాలేదు కానీ తమిళంలో ఘోరంగా అయితే పోలేదు. ఆ టైంలో సేతుపతికి ఇప్పుడున్నంత ఇమేజ్ లేదు.
కలయిక బాగుంది కానీ మణిరత్నం ఎలాంటి కథ రాసుకున్నారనేది ఆసక్తికరంగా మారింది. పొన్నియిన్ సెల్వన్ షూటింగ్ సమయంలో తన దగ్గర ఒక రొమాంటిక్ స్క్రిప్ట్ ఉందని, సఖి – ఓకే బంగారం తరహాలో ఫ్రెష్ గా ఉంటుందని అన్నారు. కానీ ఇప్పుడు విజయ్ సేతుపతి – సాయిపల్లవి లాంటి పెర్ఫార్మర్లకు ఆ జానర్ సూట్ కాదు. సో ఏదో వేరే స్టోరీ అయ్యుంటుందనుకోవచ్చు. ప్రస్తుతానికి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే లేదు. పూరి జగన్నాథ్ తో స్లమ్ డాగ్ (ప్రచారంలో ఉన్న టైటిల్) పూర్తి చేసిన విజయ్ సేతుపతి దాంతో పెద్ద బ్రేక్ దక్కుతుందనే నమ్మకంతో ఉన్నాడు. వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చ్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.
This post was last modified on December 7, 2025 2:13 pm
తిరుమలపై మరో దుష్ప్రచారం జరగడంపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కారణం ఎవరు? ఎక్కడ నుంచి జరిగింది?…
ప్రధాన ప్రతిపక్ష హోదా కోరుకుంటున్న మాజీ సీఎం.. వైసీపీ అధినేత జగన్.. దానికి తగిన విధంగా పనిచే స్తున్నారా? అనేది…
తనపై వైసీపీ నాయకులు సహా.. ఆ పార్టీ అధినేత జగన్ చేస్తున్న విమర్శలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. క్రికెట్…
నటీనటుల నుంచి అద్భుతమైన పెర్ఫామెన్స్ రాబట్టుకోవడంలో ఇండియాలో మణిరత్నంను మించిన దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. మొదట్నుంచి ఆయన సినిమాలను గమనిస్తే…
దురంధర్ తర్వాత బాలీవుడ్ లో స్పై సినిమాలను చూసే దృక్పథం మారిపోయింది. నమ్మశక్యం కాని ఫైట్లు, ఫిజిక్స్ ని ఛాలెంజ్…
సహజంగా భర్త ఎంత సంపాయిస్తున్నాడో.. ఏం చేస్తున్నాడో.. తెలుసుకునేందుకు భార్యలు ఆసక్తి చూపుతారు. ఈ విషయం తెలుసుకునేందుకు వారు ఉత్సాహం…