బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా బాధ పెట్టాయి. ప్యాన్ ఇండియా సినిమాలు వాయిదా పడటం సహజమే కానీ ఇంకొన్ని గంటల్లో ప్రీమియర్లు మొదలవ్వాల్సి ఉండగా హఠాత్తుగా క్యాన్సిల్ కావడం ఊహించని ట్విస్టు. దీని వల్ల అభిమానుల మనసులు గాయపడటమే కాదు అంత కన్నా ఎక్కువ నష్టం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ ఓనర్లు భరిస్తున్నారు. ఎట్టకేలకు సానుకూల ఫలితం వచ్చే దిశగా చర్చలు ఫలప్రదమయ్యాననే సమాచారం నిన్న రాత్రే వచ్చింది కాని అసలైన ఛాలెంజ్, సవాళ్లు అఖండ 2కు ఇక ముందున్నాయి.
వాటిలో మొదటిది కొత్త రిలీజ్ డేట్. డిసెంబర్ 12 మంచి ఆప్షనే కానీ అప్పటికంతా లీగల్ ఫార్మాలిటీస్ పూర్తి కావాలి. మంగళవారం లేదా బుధవారానికి అవ్వొచ్చని అంటున్నారు. కానీ నిర్ధారణగా చెప్పడం లేదు. డిసెంబర్ 19 లేదా 25 చూద్దామంటే అవతార్ ఫైర్ అండ్ యాష్ ఉన్న నేపథ్యంలో ఓవర్సీస్ లో మంచి రిలీజ్ దక్కడం చాలా కష్టం. సంక్రాంతి గురించి ఆలోచించడం కూడా రిస్కే. ఎందుకంటే ఆల్రెడీ ఏడు సినిమాలు అఫీషియల్ గా పండగను లాక్ చేసుకున్నాయి. కనీసం రెండు తప్పుకుంటే తప్ప అఖండ 2కి సరైన స్పేస్ దొరకదు. అది కూడా అంత ఈజీ కాదు. ఈ క్యాలికులేషన్స్ మధ్య సమయం గడిచిపోతోంది.
వీటికి తోడు ఆల్రెడీ జరిగిన థియేటర్, బిజినెస్ అగ్రిమెంట్లను మళ్ళీ రివైజ్ చేసుకోవాల్సి ఉంటుంది. రేట్లు పెంచడం తగ్గించడం లాంటివి జరగొచ్చు. ఇప్పుడీ పోస్ట్ పోన్ ప్రభావం ఓపెనింగ్స్ మీద ఎంత ఉంటుందనే దాని మీద ఎగ్జిబిటర్లలు రకరకాల విశ్లేషణల్లో ఉన్నారు. బయటికి కనిపించకపోయినా బాలయ్యతో సహా టీమ్ మొత్తం ఇదే ఇష్యూ మీద పోరాడుతున్న మాట వాస్తవం. చివరికి ఈ మలుపులు ఏ మజిలీకి చేరుకుంటాయో అంతు చిక్కడం లేదు. ఫ్యాన్స్ అయితే ఏ క్షణమైనా శుభవార్త వింటామనే నమ్మకంతో ఉన్నారు. అదేదో ఓ మూడు నాలుగు రోజుల్లో అఫీషియల్ అనౌన్స్ మెంట్ రూపంలో ఇస్తే అంతా సెట్.
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…
విజువల్ ఎఫెక్ట్స్ మీద ఆధారపడి సినిమాలు తీయడం చాలా రిస్క్. కొన్నిసార్లు ఇవి తీసుకునే సమయం హీరోల కెరీర్ల మీద…
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో తెరకెక్కుతున్న NBK111 ప్రాజెక్టులో స్టార్ క్యాస్ట్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసేలా ఉంది.…
విజయవాడలో యువకుడి అదృశ్యం కేసు రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తిస్తోంది. రాజకీయ, కులం రంగు పులుముకున్న ఈ వ్యవహారం…
విజయవాడలో కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ అనే యువకుడు లాకప్ డెత్ కు గురయ్యాడని ఆరోపణలు రావడం రాజకీయ దుమారం రేపిన…
పెద్ది విడుదలకు ముందు జాన్వీ కపూర్ ప్రమోషన్ల పరంగా ఎంత చేయాలో అంతా చేసింది. ఇండియా మొత్తం టీమ్ తో…