సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ఈ విషయంలో మహిళలు బాగా ఓపెన్ అవుతున్నారు. సోషల్ మీడియా ఊపందుకోవడం.. ‘మీ టూ’ ఉద్యమం ధైర్యాన్నివ్వడంతో తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి బయటపెడుతున్నారు. ఐతే పేరున్న హీరోయిన్లు ఇలాంటి వాటి గురించి చెబితే.. మీడియాలో హెడ్ లైన్స్గా మారిపోతాయి. కానీ అంతగా ఫేమస్ కాని మహిళా ఆర్టిస్టులకు ఎదురయ్యే వేధింపుల గురించి పెద్దగా చర్చ జరగదు.
తెలుగులో ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ రోల్స్ చేసిన మిర్చి మాధవి.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తనకు ఎదురైన లైంగిక వేధింపుల అనుభవం గురించి వెల్లడించింది. ఒక సినిమా టీం తనను సంప్రదించి.. ఐదుగురికి ఒకేసారి కమిట్మెంట్ ఇవ్వాలని అడిగినట్లు ఆమె చెప్పింది.
‘100 పర్సంట్ లవ్’ సహా పలు చిత్రాల్లో నటించిన మిర్చి మాధవికి చాలా ఏళ్ల ముందు ఒక సినిమాలో అవకాశం వచ్చిందట. ఆ సినిమా నుంచి ఒక వ్యక్తి ఫోన్ చేసి.. ‘100 పర్సంట్ లవ్’లో తన నటన చూసి సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్లు చెప్పారట. ఐతే ఈ ఛాన్స్ ఇవ్వాలంటే కమిట్మెంట్ ఇవ్వాలని.. తాము ఐదుగురు ఉంటామని ఓపెన్గా చెప్పాడట ఆ వ్యక్తి.
ఐతే ఇలాంటి వ్యక్తులతో గొడవ పడి లాభం లేదని.. తాను వాళ్లకు సింపుల్గా నో చెప్పి ఊరుకున్నట్లు మిర్చి మాధవి వెల్లడించింది. ఇలాంటి కమిట్మెంట్ ఇవ్వడం ద్వారా డబ్బులు సంపాదించాలి అంటే.. సినిమాలు వదిలేసి అదే పని చేసుకుంటూ ఉండేదాన్నని.. నటన మీద ఇష్టంతో సినిమాల్లో కొనసాగుతున్నానని ఆ వ్యక్తికి చెప్పి తన పని తాను చేసుకున్నట్లు మిర్చి మాధవి వెల్లడించింది. తర్వాత ఎప్పుడూ తనకు అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని ఆమె తెలిపింది
This post was last modified on December 5, 2025 2:15 pm
భారత దేశ రాజకీయాల్లో ఎన్నో పార్టీలు పుడుతున్నాయి. ఆ వెంటనే కనుమరుగు అవుతున్నాయి. ఎక్కడో ఒకటి అరా పార్టీలు కొనసాగుతున్నా... అవన్నీ దాదాపుగా…
టాలీవుడ్లో క్యారెక్టర్ రోల్స్ తో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి సురేఖా వాణి. వందల సంఖ్యలో సినిమాలు చేసిన ఆమెకు…
ఈ వారం టాలీవుడ్లో ఒక ఆసక్తికర అరంగేట్రం జరిగింది. ఇండస్ట్రీలో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన ఘట్టమనేని ఫ్యామిలీ నుంచి…
వైసీపీలో జగన్ అంటే ప్రాణం పెట్టేవారే ఉన్నారని, ఆయన గీసిన గీత దాటబోరని చెప్పే వారు కనిపిస్తారు. అయితే.. తాజాగా…
కథానాయికగా మలయాళంలో పరిచయం అయి.. తెలుగులో మంచి ఫాలోయింగ్, అవకాశాలు అందుకున్న అమ్మాయి అనుపమ పరమేశ్వరన్. ఆమె కెరీర్లో ఎక్కువ…
వైసీపీ నాయకుడు వాసుపల్లి గణేష్ ఎయిర్ పోర్టుకి పెళ్లికి లింక్ పెట్టి మాట్లాడ్డం సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. ఊరందరిదీ…