ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల గుండెల్లో పిడుగు పడేలా రాత్రి ప్రీమియర్లు క్యాన్సిల్ కావడం యావత్ ఎగ్జిబిటర్లను తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. 14 రీల్స్ కు సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఇంకా కొలిక్కి రాని కారణంగా సమయానికి షోలు వేయలేకపోతున్నారని ఇన్ సైడ్ టాక్. ప్రొడక్షన్ హౌస్ నుంచి రద్దు గురించి మాత్రమే నోట్ వచ్చింది కానీ ఇంకెలాంటి వివరాలు లేవు. ఏపీలో ఇప్పటికే అమ్మేసిన లక్షలాది టికెట్లకు రీ ఫండ్ ప్రాసెస్ మొదలైపోయింది. నేరుగా కొన్నవాళ్ళకు డబ్బులు ఇవ్వనున్నారు.
ఇది హఠాత్ పరిణామం. బాలకృష్ణ లాంటి అగ్ర హీరో నటించిన సినిమాకు ఎదురవ్వాల్సిన స్థితి కాదు. ఒక ప్రణాళికతో ఇంత కష్టపడి ప్రమోషన్లు చేసుకుంటూ వచ్చి, నార్త్ లోనూ పబ్లిసిటీ చేశాక ఇలా చివరి నిమిషంలో ఆటలు లేవంటే దాని తాలూకు నష్టం మాములుగా ఉండదు. అసలే ప్రీమియర్ల కోసం ప్రత్యేక అనుమతులు తీసుకుని 600 రూపాయల చొప్పున ఏపీలో అమ్మారు. ఇప్పుడా రెవిన్యూ అంతా పోయినట్టే. ఒకవేళ రేపు ఉదయం నుంచి మొదలుపెట్టినా సాధారణంగా అనుమతించిన రేట్లకే పెట్టాలి కాబట్టి ఓవరాల్ ఓపెనింగ్ లో తీవ్ర కోత పడనుంది.
ఇక తర్వాతి అడుగు రేపు ఉదయం షెడ్యూల్ చేసిన 7 గంటల నుంచి మొదలవ్వాల్సిన ఆటలు. ఇది కూడా ఫైనాన్సియల్ క్లియరెన్స్ మీద ఆధారపడి ఉంటుందని అంతర్గత వర్గాలు అంటున్నాయి. నిర్మాతల వైపు సాంకేతిక కారణాలు చెబుతున్నా నిజానిజాలు ఏంటనేది కొద్దిరోజులు ఆగితే క్లారిటీ వస్తుంది. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ కి ఇలా జరగకుండా ఉండాల్సిందని ఇండస్ట్రీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు. ఎన్నో వారాల తర్వాత ఏపీ తెలంగాణ థియేటర్లు హౌస్ ఫుల్స్స్ తో కళకళలాడతాయని ఎదురు చూస్తున్న తరుణంలో ఇలా జరగడం ముమ్మాటికీ విచారించాల్సిన విషయం.
This post was last modified on December 4, 2025 7:06 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…