2020 సినీ పరిశ్రమకు ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇలాంటి నష్టాల్ని, విషాదాల్ని ఇంతకుముందు ఎన్నడూ చూడలేని ఈ ఇండస్ట్రీ. 8-9 నెలల పాటు థియేటర్లు మూతపడి ఉండటం అన్నది ఎవ్వరూ ఊహించని విషయం. సంక్రాంతికి పెద్ద సినిమాల సందడి చూశాక థియేటర్లు వెలవెలబోయాయి. తర్వాత థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడం గురించి ఆలోచనే లేకపోయింది.
ఇప్పుడు మళ్లీ థియేటర్లు తెరుచుకున్నా సరే 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఎంతమాత్రం సుముఖంగా లేరు. ఐతే ఇలాంటి పరిస్థితుల్లోనూ 2020లో ఒక తెలుగు హీరో మూడు సినిమాలు రిలీజ్ చేసిన ఘనత అందుకోబోతుండటం విశేషం. ఈ మూడు సినిమాలూ కరోనా మొదలయ్యాకే ప్రేక్షకుల ముందుకు రానుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటారా.. సత్యదేవ్.
కరోనా ధాటికి థియేటర్లు మూతపడి, ఓటీటీల జోరు మొదలైన సమయంలో ముందుగా ఆ ఫ్లాట్ ఫామ్ ద్వారా సినిమా రిలీజ్ చేసిన తెలుగు హీరో సత్యదేవే. అతడి సినిమా ‘47 డేస్’ నాలుగు నెలల కిందటే విడుదలైంది. జీ5లో విడుదలైన ఆ సినిమాకు ఆశించిన స్పందన అయితే రాలేదు. కానీ ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజైన సత్యదేవ్ సినిమా ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ మాత్రం మంచి ఫలితమే అందుకుంది. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించింది.
సత్యదేవ్కు సోలో హీరోగా దీన్ని తొలి హిట్గా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు సత్యదేవ్ 2020లోనే మరో సినిమాను వదిలేస్తున్నాడు. అతను హీరోగా, ప్రియదర్శి ఓ కీలక పాత్రలో నటించిన సినిమా ‘గువ్వా గోరింక’ ఈ నెల 17న అమేజాన్ ప్రైమ్ ద్వారా రిలీజవుతోంది. మీడియం ఏదన్నది పక్కన పెడితే ఈ కరోనా టైంలో ఐదు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజ్ చేసిన ఘనత సత్యదేవ్కే చెందుతుంది. ఈ ఏడాది మరే హీరో నుంచీ ఇన్ని సినిమాలు రాలేదు.
This post was last modified on December 7, 2020 5:56 pm
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…