2020 సినీ పరిశ్రమకు ఓ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. ఇలాంటి నష్టాల్ని, విషాదాల్ని ఇంతకుముందు ఎన్నడూ చూడలేని ఈ ఇండస్ట్రీ. 8-9 నెలల పాటు థియేటర్లు మూతపడి ఉండటం అన్నది ఎవ్వరూ ఊహించని విషయం. సంక్రాంతికి పెద్ద సినిమాల సందడి చూశాక థియేటర్లు వెలవెలబోయాయి. తర్వాత థియేటర్లలో సినిమాను రిలీజ్ చేయడం గురించి ఆలోచనే లేకపోయింది.
ఇప్పుడు మళ్లీ థియేటర్లు తెరుచుకున్నా సరే 50 శాతం ఆక్యుపెన్సీతో సినిమాలు రిలీజ్ చేయడానికి నిర్మాతలు ఎంతమాత్రం సుముఖంగా లేరు. ఐతే ఇలాంటి పరిస్థితుల్లోనూ 2020లో ఒక తెలుగు హీరో మూడు సినిమాలు రిలీజ్ చేసిన ఘనత అందుకోబోతుండటం విశేషం. ఈ మూడు సినిమాలూ కరోనా మొదలయ్యాకే ప్రేక్షకుల ముందుకు రానుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఇంతకీ ఆ హీరో ఎవరు అంటారా.. సత్యదేవ్.
కరోనా ధాటికి థియేటర్లు మూతపడి, ఓటీటీల జోరు మొదలైన సమయంలో ముందుగా ఆ ఫ్లాట్ ఫామ్ ద్వారా సినిమా రిలీజ్ చేసిన తెలుగు హీరో సత్యదేవే. అతడి సినిమా ‘47 డేస్’ నాలుగు నెలల కిందటే విడుదలైంది. జీ5లో విడుదలైన ఆ సినిమాకు ఆశించిన స్పందన అయితే రాలేదు. కానీ ఆ తర్వాత నెట్ ఫ్లిక్స్ ద్వారా రిలీజైన సత్యదేవ్ సినిమా ‘ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య’ మాత్రం మంచి ఫలితమే అందుకుంది. ఆ సినిమాకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించింది.
సత్యదేవ్కు సోలో హీరోగా దీన్ని తొలి హిట్గా కూడా చెప్పొచ్చు. ఇప్పుడు సత్యదేవ్ 2020లోనే మరో సినిమాను వదిలేస్తున్నాడు. అతను హీరోగా, ప్రియదర్శి ఓ కీలక పాత్రలో నటించిన సినిమా ‘గువ్వా గోరింక’ ఈ నెల 17న అమేజాన్ ప్రైమ్ ద్వారా రిలీజవుతోంది. మీడియం ఏదన్నది పక్కన పెడితే ఈ కరోనా టైంలో ఐదు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రిలీజ్ చేసిన ఘనత సత్యదేవ్కే చెందుతుంది. ఈ ఏడాది మరే హీరో నుంచీ ఇన్ని సినిమాలు రాలేదు.
నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపిచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ మూవీ NBK 111 షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
వరస డిజాస్టర్లతో మార్కెట్ నే రిస్కులో పెట్టుకున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఈసారి కొరియన్ కనకరాజుగా వస్తున్నాడు. ఆగస్ట్…
‘చెన్నై లవ్ స్టోరీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న అమ్మాయి.. శ్రీ గౌరీప్రియ. ఈ అచ్చ తెలుగు…
మలయాళ లెజెండరీ డైరెక్టర్ ఫాజిల్ కొడుకు ఫాహద్ నటుడిగా పరిచయం అయినపుడు అతణ్ని అంత సీరియస్గా తీసుకోలేదు మలయాళ ప్రేక్షకులు.…
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ చివరి దశకు చేరుకున్న వేళ మాజీ మంత్రి ఓటే గల్లంతు…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వీరాభిమాని నిరంజన్ మరణం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగానే మారిపోయింది. పవన్…