ఇటీవలే గోవాలో జరిగిన వేడుకలో రణ్వీర్ సింగ్ హీరో రిషబ్ శెట్టిని ఉద్దేశించి మాట్లాడుతూ కాంతార ఎక్స్ ప్రెషన్ ని రిక్రియేషన్ చేయడంతో పాటు గ్రామ దేవత పాత్రను దెయ్యం అన్నట్టుగా చెప్పడం కర్ణాటకలో తీవ్ర వివాదం రేపింది. ఏ మాత్రం అవగాహన లేకుండా అతను చేసిన చర్యని అందరూ తీవ్రంగా దుయ్యబట్టారు. కన్నడనాట ఏకంగా రణ్వీర్ సింగ్ కొత్త సినిమా దురంధర్ ని ఆడనివ్వమంటూ కొందరు నిరసన వ్యక్తం చేయడంతో రణ్వీర్ సింగ్ ఎట్టకేలకు దిగొచ్చి సారీ చెప్పాడు. ఇన్స్ టా స్టేటస్ లో రిషబ్ పెర్ఫార్మన్స్ ని మెచ్చుకుంటూనే చివరికి మనోభావాలు దెబ్బ తిని ఉంటే క్షమించండని అన్నాడు.
మాములుగానే ఎక్స్ ట్రీమ్ బిహేవియర్ (మితిమీరిన ప్రవర్తన)తో కనిపించే రణ్వీర్ సింగ్ తరచుగా ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటాడు. కాకపోతే ఈసారి మోతాదు మించిపోయింది. కాంతార సినిమా చూసి కూడా రిషబ్ వేసిన పాత్ర దేవుడో దెయ్యమో తెలియకుండా అంతగా ఎగతాళి చేయడం ఖండించాల్సిన విషయమే. ఒకప్పుడు పద్మావత్, బాజీరావు మస్తానీ లాంటి ఐకానిక్ మూవీస్ చేసిన రణ్వీర్ నుంచి ఇలాంటి చర్య ఎవరూ ఊహించలేదు. ట్విట్టర్ లో వైరల్ అయిన వీడియోలో రిషబ్ శెట్టి ఇదంతా నవ్వుతూ ఎంజాయ్ చేసినట్టు చూపించారు కానీ నిజానికి అతను వద్దని సంజ్ఞ చేసిన మరో క్లిప్ తాజాగా బయటికి వచ్చింది.
ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. రణ్వీర్ దురంధర్ ఈ శుక్రవారం విడుదల కానుంది. మూడున్నర గంటల నిడివితో యానిమల్ ని మించిన లెన్త్ పెట్టుకున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవని ట్రేడ్ టాక్. ధనుష్ తేరే ఇష్క్ మే కన్నా తక్కువ నెంబర్లు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దక్షిణాదిలో అఖండ 2 తాండవం పోటీ వల్ల ప్రభావం పడేలా ఉంది. రణ్వీర్ సింగ్ మాత్రం దురంధర్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు.
పదిహేనేళ్ల కుర్రాడే కదా అని స్లెడ్జింగ్ చేస్తే రిజల్ట్ ఎంత దారుణంగా ఉంటుందో శ్రీలంక బౌలర్లకు ప్రాక్టికల్ గా అర్థమైంది.…
2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…
ఈ రోజుల్లో చిన్న, మిడ్ రేంజ్ సినిమాలకు రిలీజ్రోజు ఇచ్చిన థియేటర్లను జనంతో నింపడమే కష్టమైపోతోంది. జనం థియేటర్లకు రావడం…
ఏపీలో కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్రభుత్వం ఏం చేయాలన్నా.. మరో…
ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. పశ్చిమబెంగాల్లో శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన దేశవ్యాప్తంగా అన్నదాతలకు పీఎం-కిసాన్ నిధులను…