ఇటీవలే గోవాలో జరిగిన వేడుకలో రణ్వీర్ సింగ్ హీరో రిషబ్ శెట్టిని ఉద్దేశించి మాట్లాడుతూ కాంతార ఎక్స్ ప్రెషన్ ని రిక్రియేషన్ చేయడంతో పాటు గ్రామ దేవత పాత్రను దెయ్యం అన్నట్టుగా చెప్పడం కర్ణాటకలో తీవ్ర వివాదం రేపింది. ఏ మాత్రం అవగాహన లేకుండా అతను చేసిన చర్యని అందరూ తీవ్రంగా దుయ్యబట్టారు. కన్నడనాట ఏకంగా రణ్వీర్ సింగ్ కొత్త సినిమా దురంధర్ ని ఆడనివ్వమంటూ కొందరు నిరసన వ్యక్తం చేయడంతో రణ్వీర్ సింగ్ ఎట్టకేలకు దిగొచ్చి సారీ చెప్పాడు. ఇన్స్ టా స్టేటస్ లో రిషబ్ పెర్ఫార్మన్స్ ని మెచ్చుకుంటూనే చివరికి మనోభావాలు దెబ్బ తిని ఉంటే క్షమించండని అన్నాడు.
మాములుగానే ఎక్స్ ట్రీమ్ బిహేవియర్ (మితిమీరిన ప్రవర్తన)తో కనిపించే రణ్వీర్ సింగ్ తరచుగా ఇలాంటి వివాదాల్లో చిక్కుకుంటూనే ఉంటాడు. కాకపోతే ఈసారి మోతాదు మించిపోయింది. కాంతార సినిమా చూసి కూడా రిషబ్ వేసిన పాత్ర దేవుడో దెయ్యమో తెలియకుండా అంతగా ఎగతాళి చేయడం ఖండించాల్సిన విషయమే. ఒకప్పుడు పద్మావత్, బాజీరావు మస్తానీ లాంటి ఐకానిక్ మూవీస్ చేసిన రణ్వీర్ నుంచి ఇలాంటి చర్య ఎవరూ ఊహించలేదు. ట్విట్టర్ లో వైరల్ అయిన వీడియోలో రిషబ్ శెట్టి ఇదంతా నవ్వుతూ ఎంజాయ్ చేసినట్టు చూపించారు కానీ నిజానికి అతను వద్దని సంజ్ఞ చేసిన మరో క్లిప్ తాజాగా బయటికి వచ్చింది.
ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడకపోతే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఇంత కన్నా ఉదాహరణ అక్కర్లేదు. రణ్వీర్ దురంధర్ ఈ శుక్రవారం విడుదల కానుంది. మూడున్నర గంటల నిడివితో యానిమల్ ని మించిన లెన్త్ పెట్టుకున్న ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా బుకింగ్స్ ఆశించిన స్థాయిలో లేవని ట్రేడ్ టాక్. ధనుష్ తేరే ఇష్క్ మే కన్నా తక్కువ నెంబర్లు నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దక్షిణాదిలో అఖండ 2 తాండవం పోటీ వల్ల ప్రభావం పడేలా ఉంది. రణ్వీర్ సింగ్ మాత్రం దురంధర్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాడు.
This post was last modified on December 2, 2025 2:46 pm
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…
ఉస్తాద్ భగత్ సింగ్తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలకు టాటా చెప్పేస్తాడని గత ఏడాది ఓ ప్రచారం జరిగింది.…
ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ది బెస్ట్ థ్రిల్లర్లలో ఒకటనదగ్గ చిత్రం.. దృశ్యం. 2013లో విడుదలైన ఈ చిత్రం.. అప్పటి మలయాళ…
కూటమి నాయకులకు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కీలక రాజకీయ అస్త్రాన్ని ఇచ్చారు. ``రాష్ట్రానికి వైసీపీ హానికరం`` అంటూ..…