వ్యక్తిగత జీవితంలో కొన్నేళ్ల పాటు ఒడుదొడుకులు ఎదుర్కొంది సమంత. నాగచైతన్య నుంచి నాలుగేళ్ల ముందు విడిపోయిన ఆమె.. మళ్లీ వ్యక్తిగత జీవితంలో స్థిరపడితే చూడాలని ఆశిస్తున్న తన అభిమానుల కోరిక తీరింది. ‘ఫ్యామిలీ మ్యాన్’ దర్శక ద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరుతో ఆమె పెళ్లి తమిళనాడులోని ఈషా ఫౌండేషన్లో సోమవారం జరిగింది.
సమంత బహు భాషల్లో కథానాయికగా నటించినప్పటికీ.. ఆమె ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే. తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉన్నది తెలుగులోనే. తెలుగు వారికి అంతగా చేరువైన సామ్.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నది కూడా తెలుగు వ్యక్తినే అని చాలామందికి తెలియకపోవచ్చు. ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు కానీ.. రాజ్ది డిఫరెంట్ స్టోరీ. అతను రచ్చ గెలిచాడు కానీ.. ఇంకా ఇంటి వైపు చూడలేదు. అతను అచ్చమైన తెలుగువాడే. కానీ ఇక్కడ సినిమాలు డైరెక్ట్ చేయలేదు.
రాజ్ అసలు పేరు రాజేష్. అతను పుట్టింది పెరిగింది తిరుపతిలో. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ఇంటర్మీడియట్ పుట్టపర్తిలో చదివిన రాజ్.. మళ్లీ ఇంజినీరింగ్ కోసం తిరుపతి వచ్చేశాడు. ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. అక్కడే చిత్తూరుకు చెందిన కృష్ణ దాసరకొత్తపల్లి (డీకే) పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి యుఎస్ వెళ్లి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేశారు. ఆ సమయంలోనే వారికి సినిమాల పట్ల ఆసక్తి కలిగింది.
ఉద్యోగం చేస్తూనే ఫిలిం కోర్సులు చేశారు. తర్వాత షార్ట్ ఫిలిం తీశారు. ఆపై ‘ఫ్లేవర్స్’ అనే ఇంగ్లిష్ మూవీతో దర్శకులుగా మారారు. 2009లో వీరి తొలి హిందీ చిత్రం ‘99’ రిలీజైంది. అప్పట్నుంచి బాలీవుడ్లోనే స్థిరపడిపోయారు. వీళ్లు తీసిన సినిమాల కంటే.. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎక్కువ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సిరీస్ రెండో సీజన్లో సమంత విలన్ పాత్ర చేసింది. అప్పుడు రాజ్తో మొదలైన పరిచయమే.. తర్వాత ప్రేమగా మారి ఇద్దరినీ పెళ్లివైపు నడిపించింది.
This post was last modified on December 2, 2025 2:11 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…