వ్యక్తిగత జీవితంలో కొన్నేళ్ల పాటు ఒడుదొడుకులు ఎదుర్కొంది సమంత. నాగచైతన్య నుంచి నాలుగేళ్ల ముందు విడిపోయిన ఆమె.. మళ్లీ వ్యక్తిగత జీవితంలో స్థిరపడితే చూడాలని ఆశిస్తున్న తన అభిమానుల కోరిక తీరింది. ‘ఫ్యామిలీ మ్యాన్’ దర్శక ద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరుతో ఆమె పెళ్లి తమిళనాడులోని ఈషా ఫౌండేషన్లో సోమవారం జరిగింది.
సమంత బహు భాషల్లో కథానాయికగా నటించినప్పటికీ.. ఆమె ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే. తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉన్నది తెలుగులోనే. తెలుగు వారికి అంతగా చేరువైన సామ్.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నది కూడా తెలుగు వ్యక్తినే అని చాలామందికి తెలియకపోవచ్చు. ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు కానీ.. రాజ్ది డిఫరెంట్ స్టోరీ. అతను రచ్చ గెలిచాడు కానీ.. ఇంకా ఇంటి వైపు చూడలేదు. అతను అచ్చమైన తెలుగువాడే. కానీ ఇక్కడ సినిమాలు డైరెక్ట్ చేయలేదు.
రాజ్ అసలు పేరు రాజేష్. అతను పుట్టింది పెరిగింది తిరుపతిలో. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ఇంటర్మీడియట్ పుట్టపర్తిలో చదివిన రాజ్.. మళ్లీ ఇంజినీరింగ్ కోసం తిరుపతి వచ్చేశాడు. ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. అక్కడే చిత్తూరుకు చెందిన కృష్ణ దాసరకొత్తపల్లి (డీకే) పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి యుఎస్ వెళ్లి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేశారు. ఆ సమయంలోనే వారికి సినిమాల పట్ల ఆసక్తి కలిగింది.
ఉద్యోగం చేస్తూనే ఫిలిం కోర్సులు చేశారు. తర్వాత షార్ట్ ఫిలిం తీశారు. ఆపై ‘ఫ్లేవర్స్’ అనే ఇంగ్లిష్ మూవీతో దర్శకులుగా మారారు. 2009లో వీరి తొలి హిందీ చిత్రం ‘99’ రిలీజైంది. అప్పట్నుంచి బాలీవుడ్లోనే స్థిరపడిపోయారు. వీళ్లు తీసిన సినిమాల కంటే.. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎక్కువ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సిరీస్ రెండో సీజన్లో సమంత విలన్ పాత్ర చేసింది. అప్పుడు రాజ్తో మొదలైన పరిచయమే.. తర్వాత ప్రేమగా మారి ఇద్దరినీ పెళ్లివైపు నడిపించింది.
This post was last modified on December 2, 2025 2:11 pm
రేపు విడుదల కాబోతున్న టాక్సిక్ మీద అభిమానుల అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఆశ్చర్యకరంగా హిందీ వెర్షన్ అమ్మకాలు…
మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అరెస్టుతో లిక్కర్ కుంభకోణం మళ్ళీ తెరపైకి వచ్చింది. వైసీపీ ప్రభుత్వంలో నాశిరకం మద్యం వ్యాపారాన్ని…
``కాంగ్రెస్ పార్టీలో నేనైనా ఆమె అయినా ఒక్కటే. పార్టీ క్రమశిక్షణ విషయంలో అందరూ సమానమే. ఎవరు ఏం చేశారన్నది పార్టీ…
ఒక పార్టీలో ఇబ్బందులు రావొచ్చు.. నాయకులు అసంతృప్తి వ్యక్తం చేయొచ్చు. కానీ.. అడుగు పెట్టిన ప్రతిపార్టీలోనూ ఇబ్బందులు వస్తే.. ప్రతిపార్టీపైనా…
‘ఎల్లమ్మ’ గురించి ఇప్పటివరకు ఎక్కువగా మాట్లాడుకున్నది వేణు యెల్దండి కథ, గ్రామీణ నేపథ్యం, డీఎస్పీ లుక్ గురించే. ‘బలగం’ తర్వాత…
వారం రోజుల క్రితం తిరుపతిలో వెంకటేశ్వర స్వామి సాక్షిగా రాజకీయ పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి…