వ్యక్తిగత జీవితంలో కొన్నేళ్ల పాటు ఒడుదొడుకులు ఎదుర్కొంది సమంత. నాగచైతన్య నుంచి నాలుగేళ్ల ముందు విడిపోయిన ఆమె.. మళ్లీ వ్యక్తిగత జీవితంలో స్థిరపడితే చూడాలని ఆశిస్తున్న తన అభిమానుల కోరిక తీరింది. ‘ఫ్యామిలీ మ్యాన్’ దర్శక ద్వయంలో ఒకరైన రాజ్ నిడిమోరుతో ఆమె పెళ్లి తమిళనాడులోని ఈషా ఫౌండేషన్లో సోమవారం జరిగింది.
సమంత బహు భాషల్లో కథానాయికగా నటించినప్పటికీ.. ఆమె ఎక్కువ సినిమాలు చేసింది తెలుగులోనే. తనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువగా ఉన్నది తెలుగులోనే. తెలుగు వారికి అంతగా చేరువైన సామ్.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నది కూడా తెలుగు వ్యక్తినే అని చాలామందికి తెలియకపోవచ్చు. ఇంట గెలిచి రచ్చ గెలవమంటారు కానీ.. రాజ్ది డిఫరెంట్ స్టోరీ. అతను రచ్చ గెలిచాడు కానీ.. ఇంకా ఇంటి వైపు చూడలేదు. అతను అచ్చమైన తెలుగువాడే. కానీ ఇక్కడ సినిమాలు డైరెక్ట్ చేయలేదు.
రాజ్ అసలు పేరు రాజేష్. అతను పుట్టింది పెరిగింది తిరుపతిలో. తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులే. ఇంటర్మీడియట్ పుట్టపర్తిలో చదివిన రాజ్.. మళ్లీ ఇంజినీరింగ్ కోసం తిరుపతి వచ్చేశాడు. ఎస్వీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశాడు. అక్కడే చిత్తూరుకు చెందిన కృష్ణ దాసరకొత్తపల్లి (డీకే) పరిచయం అయ్యాడు. ఇద్దరూ కలిసి యుఎస్ వెళ్లి అక్కడ సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పని చేశారు. ఆ సమయంలోనే వారికి సినిమాల పట్ల ఆసక్తి కలిగింది.
ఉద్యోగం చేస్తూనే ఫిలిం కోర్సులు చేశారు. తర్వాత షార్ట్ ఫిలిం తీశారు. ఆపై ‘ఫ్లేవర్స్’ అనే ఇంగ్లిష్ మూవీతో దర్శకులుగా మారారు. 2009లో వీరి తొలి హిందీ చిత్రం ‘99’ రిలీజైంది. అప్పట్నుంచి బాలీవుడ్లోనే స్థిరపడిపోయారు. వీళ్లు తీసిన సినిమాల కంటే.. ‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎక్కువ గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సిరీస్ రెండో సీజన్లో సమంత విలన్ పాత్ర చేసింది. అప్పుడు రాజ్తో మొదలైన పరిచయమే.. తర్వాత ప్రేమగా మారి ఇద్దరినీ పెళ్లివైపు నడిపించింది.
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…
శాకుంతలం విడుదలై డిజాస్టరైనప్పుడు దాని ఫలితానికి బాధ్యుడు దర్శకుడు గుణశేఖర్ అయినప్పటికీ టైటిల్ రోల్ పోషించిన సమంత కూడా విమర్శలను…