హీరోయిన్ సమంత కొన్నేళ్ల క్రితం నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఒంటరి జీవితాన్నే గడుపుతోంది. మధ్యలో అనారోగ్యం వల్ల కొంత ఇబ్బంది పడినా, దాన్ని ధీటుగా ఎదురుకుని సిటాడెల్ లాంటి వెబ్ సిరీస్ లో నటించింది. తాజాగా నందిని రెడ్డి దర్శకత్వంలో స్వంత ప్రొడక్షన్ లో మా ఇంటి బంగారం నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా దర్శకుడు రాజ్ నిడిమోరుతో ప్రేమాయణం జరుగుతున్న తీరు గురించి పలు సందర్భాల్లో ఫోటోలతో సాక్ష్యాలు దొరికినా తమ బంధం గురించి ఈ ఇద్దరూ ఎక్కడ బయట పడలేదు. ఫ్యామిలీ మ్యాన్ సృష్టికర్తల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో సామ్ ఫారిన్ ట్రిప్పులకు వెళ్లొచ్చిన దాఖలాలున్నాయి.
తాజాగా అందిన అప్డేట్ ప్రకారం సమంతకు పెళ్లయిపోయింది. తాను ఎంతో ఇష్టపడిన రాజ్ నిడిమోరుతోనే మూడు ముళ్ళు వేయించుకున్నట్టు సమాచారం. కోయంబత్తూర్ లో ఉన్న ఈషా యోగా సెంటర్ ప్రాంగణంలో ఉన్న లింగ భైరవి ఆలయంలో ఈ ఇద్దరూ ఒక్కటైనట్టుగా తెలిసింది. రాజ్ మొదటి భార్య శ్యామాలి ఈ వేడుక గురించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా వార్త వైరల్ అయిపోయింది. జంట నుంచి ఫోటోలు ఏ క్షణమైనా వచ్చేలా ఉన్నాయి. చైతు సైతం కొన్ని నెలల క్రితమే శోభితను జీవిత భాగస్వామిగా చేసుకున్న తర్వాత సామ్ కూడా అదే బాటలో నడవడం గమనార్హం.
ఏదైతేనేం సమంత ఒక ఇంటిదానిగా మారిపోవడంతో ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. కాకపోతే రాజ్ నిడిమోరు తన పర్సనల్ లైఫ్ కు సంబంధించిన లీగల్ ఫార్మాలిటీస్ ఎంత మేరకు పూర్తి చేసుకున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఇద్దరి ఫోటోలు విదేశాలకు వెళ్ళినప్పుడు చాలా సార్లు ఆన్ లైన్ లో దర్శనమిచ్చాయి. అయితే రాజ్ తో తన బంధం గురించి సామ్ ఏనాడూ నేరుగా బయట పడలేదు. ఇప్పుడు ఒకేసారి మిసెస్ రాజ్ గా మారిపోయాక ప్రపంచానికి చెప్పినట్టు అయ్యింది. ఫ్యామిలీ మ్యాన్ తీసిన రాజ్ ఇప్పుడు సరికొత్త ఫ్యామిలీ మ్యాన్ గా మారిపోయాడంటూ నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.
This post was last modified on December 1, 2025 12:51 pm
నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…
దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న పరిణామాలను గమనిస్తే.. ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్కు యువత పెద్ద ఎత్తున…
సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…
త్వరలోనే ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు తెరదీయనున్నారు. సెప్టెంబరు-అక్టోబరు మధ్య మునిసిపాలిటీ… నవంబరు-డిసెంబరు మధ్య కార్పోరేషన్లు, జనవరిలో పంచాయతీ ఎన్నికలు…
శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…
ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…