హీరోల మీద అభిమానం ఉండటంలో తప్పేమీ లేదు. కానీ అది పరిమితులను పాటిస్తూ ఎవరికీ మానసిక క్షోభ కలిగించనంత వరకు ఎంతైనా చూపించుకోవచ్చు. కానీ హద్దులు దాటితే దాని వల్ల కలిగే పరిణామాలకు ఎందరో బాధ పడాల్సి వస్తుంది. ఇటీవలే విడుదలైన ఒక రీ రిలీజ్ పాత సినిమా సెలబ్రేషన్స్ లో భాగంగా ఒక ఫ్యాన్ తల మీద మందు బాటిల్ పగలగొట్టుకుని దాన్నుంచి కారిన రక్తంతో సదరు స్టార్ బ్యానర్ కు తిలకం దిద్దాడు. దీనికి కిందున్న వాళ్ళు జేజేలు పలికారు. ఇలాంటి పిచ్చి చర్యలు లేలేత మనసుల మీద ప్రభావం చూపించి చిన్న పిల్లలు కూడా వీటి పట్ల ఆకర్షితులైతే దానికి బాధ్యత వహించేది ఎవరు.
ఇప్పుడే కాదు గతంలో ఎన్నోసార్లు ఇలాంటి సంఘటనలు లెక్కలేనన్ని చోటు చేసుకున్నాయి. బ్యానర్లు కడుతూ కరెంట్ షాక్ కొట్టి చనిపోయిన వాళ్ళు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్లొస్తూ యాక్సిడెంట్ల బారిన పడి కాలం చేసిన వాళ్ళు ఎందరో. నష్టపరిహారంగా కొంత డబ్బు అంది ఉండొచ్చు. కానీ పోయిన ప్రాణాలు తేలేదుగా. ఆ తల్లితండ్రులు జీవితాంతం అనుభవించే నరకాన్ని ఎవరు తీరుస్తారు. పైన చెప్పినట్టు ఒకవేళ ఆ బాటిల్ వల్ల ఏదైనా గాయం కలిగి ఆ యువకుడికి జరగరానిది జరిగితే షూటింగులు ఆపేసి నివాళి చెప్పరుగా. అలాంటప్పుడు ముందు వెనుకా ఆలోచించాల్సింది ఎవరు. ఖచ్చితంగా అభిమానులే.
టాలీవుడ్ స్టార్ హీరోలు ఎవరైనా ఈ విషయంలో ఎప్పటికప్పుడు ఫ్యాన్స్ ని హెచ్చరిస్తూనే ఉంటారు. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా ప్రతి ఒక్కరు అభిమానుల భద్రత గురించి తాపత్రయపడే వాళ్లే. ప్రాణం కాదు తమ ఫ్యాన్స్ కి గాయం కూడా కాకూడదని కోరుకునే మనసు వీళ్లది. అలాంటిది ఇంత నిర్లక్ష్యంగా ప్రాణాలు పణంగా పెట్టి ఫ్యానిజం చూపించుకోవాల్సిన అవసరం ఏముంది. అయినా ఇలా చెప్పినంత మాత్రాన అందరూ మారిపోతారని కాదు. కనీసం ఒక్కరైనా అవును కదాని ఆలోచిస్తే ఎన్నో ప్రమాదాలు జరగవు. ఎన్నో ప్రాణాలు మిగులుతాయి.
This post was last modified on December 1, 2025 10:22 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…