ఇతర భాషల్లో స్టార్ హీరోలు టాలీవుడ్ సినిమాల్లో విలన్లుగా నటించడం కొత్త కాదు. కన్నడలో కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే టైగర్ ప్రభాకర్, దేవరాజ్ లాంటి వాళ్ళు చిరంజీవి, బాలకృష్ణ తదితరుల చిత్రాల్లో ప్రతినాయకులుగా కనిపించేవారు. ఈగలో సుదీప్ చేయడానికి కారణం రాజమౌళినే అయినా ఫైనల్ గా హీరో చేతిలో చనిపోయే క్యారెక్టర్ లోనే చూశాం. మమ్ముట్టి టాలీవుడ్ ఫస్ట్ మూవీ స్వాతికిరణంలో చేసింది నెగటివ్ షేడ్ ఉన్న పాత్రే. తర్వాత ఈ ట్రెండ్ కి కొంత బ్రేక్ వచ్చింది. బాలీవుడ్ నుంచి ముఖేష్ ఋషి, అశుతోష్ రానా, షియాజీ షిండే లాంటి ఫ్రెష్ విలన్లు దిగుమతి కావడంతో మల్లువుడ్, శాండల్ వుడ్ తారలు బ్రేక్ తీసుకున్నారు.
ఇప్పుడు మళ్ళీ ఆనాటి ట్రెండ్ రిపీట్ అయ్యేలా ఉంది. మహేష్ బాబు వారణాసిలో పృథ్విరాజ్ సుకుమారన్ ఫుల్ లెన్త్ విలన్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. కుంభగా ఆయన వయొలెంట్ విశ్వరూపం చూడొచ్చని ఇన్ సైడ్ టాక్ ఉంది. తన కోసం ఏకంగా ఒక పాటే జక్కన్న పెట్టాడంటే ఏ రేంజ్ డిజైన్ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సలార్ లో ఆల్రెడీ ఎంట్రీ ఇచ్సిన పృథ్విరాజ్ అందులో చేసింది కంప్లీట్ విలన్ కాదు. ప్రభాస్ స్నేహితుడిగానే హైలైట్ అయ్యాడు. ఇప్పుడు వారణాసిలో అలా కాదు. తెలుగు తెరమీద ఇప్పటిదాకా చూడని ఫెరోషియస్ విలన్ గా రాజమౌళి చూపించబోతున్నాడని అంతర్గతంగా వినిపిస్తోంది.
జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ వరల్డ్ మూవీలో టోవినో థామస్ నటిస్తున్నాడు. నెగటివ్ రోల్ అని టీమ్ అధికారికంగా చెప్పలేదు కానీ ప్రశాంత్ నీల్ మాత్రం తనని మోస్ట్ బిగ్గెస్ట్ బ్యాడీగా చూపించబోతున్నారట. ఇటీవలే టోవినోని అడిగి సినిమా గురించి చెప్పమంటే దాటేశాడు తప్ప బయట పడలేదు. అంత గుట్టుగా డీటెయిల్స్ బయటికి రానివ్వకుండా ఆర్టిస్టులు జాగ్రత్త పడుతున్నారు. ఈ విలన్లుగా ఓకే కానీ మోహన్ లాల్, దుల్కర్ సల్మాన్ లాగా మన సినిమాల్లో పాజిటివ్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తే ఇంకా బాగుంటుంది. ప్యాన్ ఇండియా పదం పుట్టుకొచ్చాక నటీనటులకు భాషా హద్దులు చెరిగిపోయాయి.
మా ఇంటి బంగారం కథ ముందుగా సాయిపల్లవి దగ్గరికి వెళ్లిన సంగతి సమంత స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పాక బయటికి వచ్చింది.…
స్టార్ అన్న గుర్తింపు తెచ్చుకోలేకపోయి ఉండొచ్చు కానీ.. తమిళ, తెలుగు భాషల్లో సీనియర్ నటుడు ఆనంద్కు మంచి గుర్తింపే ఉంది.…
ముంబైలో ఇటీవల జరిగిన ఇంటర్నేషనల్ యోగా డే వేడుకల్లో హీరోయిన్ శ్రీలీలకు అవమానం జరిగిందని సోషల్ మీడియాలో ఒక వీడియో…
తప్పు చేసింది కేంద్ర ప్రభుత్వం. తన తప్పును ఏమాత్రం పట్టించుకోని కేంద్రం… విద్యార్థులు చేసిన చిన్నపాటి తప్పులకూ పెద్ద శిక్షలేసింది.…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ 'మై వాపస్ ఆవుంగా'కు తొలి రోజు రివ్యూలు ఏమంత ఆశాజనకంగా లేవు. పబ్లిక్ టాక్…
సాయిధరమ్ తేజ్ హీరోగా రెండేళ్ల ముందు మొదలైన సినిమా.. సంబరాల యేటిగట్టు. తన మార్కెట్ స్థాయికి మించి పెద్ద బడ్జెట్లో…