ఇవాళ కీర్తి సురేష్ కొత్త సినిమా రివాల్వర్ రీటా విడుదలయ్యిందనే సంగతి సామాన్య ప్రేక్షకుల్లో చాలా మందికి తెలియదు. తమిళ డబ్బింగ్ అయినప్పటికీ రాధికా శరత్ కుమార్, సునీల్, జాన్ విజయ్ లాంటి మనకు పరిచయం ఉన్న ఆర్టిస్టులు కనిపించారు కాబట్టి ఎంతో కొంత ఓపెనింగ్స్ వస్తాయని నిర్మాతలు ఆశలు పెట్టుకున్నారు. కీర్తి సురేష్ హైదరాబాద్ వచ్చి ప్రమోషన్లు, ఇంటర్వ్యూలు చేసింది. సందర్భం లేకుండా చిరంజీవి గురించి ఒక జర్నలిస్టు అడిగిన ప్రశ్న పుణ్యమాని కాస్త టాపిక్ లో నిలిచింది. ఇవేవి పని చేయలేదు. హైదరాబాద్ లో కొన్ని షోలు రన్ కాగా చాలా సెంటర్లలో కనీస ఆక్యుపెన్సీలు లేవని ట్రేడ్ రిపోర్ట్.
అసలు రీటా రివాల్వర్ లో ఏముందంటే ఇదో డార్క్ కామెడీ థ్రిల్లర్. కొత్తగా ఏముండదు. గతంలో కోకో కోకిల, కీడా కోలా లాంటి ఎన్నో సినిమాలు వద్దన్నా గుర్తకు వస్తాయి. కథగా చెప్పాలంటే సింపుల్ లైన్. ఓ తల్లి కూతూరు అనుకోకుండా ఇంటికి వచ్చి బెదిరించిన డాన్ ని పొరపాటున చంపేస్తారు. శవాన్ని మాయం చేసే ఉద్దేశంతో పడే తంటాలు, ఆ గ్యాంగ్ స్టర్ కొడుకు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు, పోలీసుల వ్యూహాలు ఇలా చాలా మసాలాలే దట్టించారు. అయితే బిర్యానీకి కావలసిన అసలైన ముడిపదార్థం బియ్యం, మాంసం లేకుండా వంట చేయడంతో ప్లేటు వదిలేసే పారిపోయేలా చేశాడు దర్శకుడు జెకె చంద్రు.
కొత్తదనం ఏ మాత్రం కనిపించకుండా విసుగొచ్చేలా స్క్రీన్ ప్లే ఎలా రాయాలో రివాల్వర్ రీటా మంచి ఉదాహరణగా నిలుస్తుంది. మహానటిలో ఎంతో గొప్పగా నటించిన కీర్తి సురేష్ ని ఇలాంటి పేలవమైన పాత్రలో చూడటం విషాదం. తను టైటిల్ రోల్స్ చేసిన సినిమాలు దాదాపు అన్నీ డిజాస్టర్లే. మిస్ ఇండియా, పెంగ్విన్, గుడ్ లక్ సఖి వగైరాలు కనీసం వచ్చినట్టు కూడా జనాలకు తెలియనంతగా ఫ్లాపయ్యాయి. ఒక దశలో మహేష్ బాబు, విక్రమ్, విశాల్ లాంటి హీరోలకు జోడిగా నటించిన కీర్తి సురేష్ బాలీవుడ్ లో బేబీ జాన్ తో అదృష్టం పరీక్షించుకుంది కానీ అక్కడా ఫెయిల్యూర్ తప్పలేదు.
This post was last modified on November 28, 2025 7:50 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…