ఇండస్ట్రీలో ఎవ్వరైనా సరే.. ఎప్పటికీ హవా సాగించలేరు. ఏదో ఒక సమయంలో జోరు తగ్గుతుంది. మారుతున్న కాలానికి తగ్గట్లు అప్డేట్ కాకపోవడం వల్లో, కాలం కలిసి రాకో అవకాశాలు తగ్గుతాయి. ఆదరణ కోల్పోతారు. కానీ తాము నిష్క్రమించాల్సిన సమయం వచ్చినపుడు దాన్ని అంగీకరించడానికి మనసు ఒప్పదు. అపజయాలు ఎదురైనా, అవకాశాలు తగ్గినా ప్రయాణం ఆపడానికి ఇష్టపడరు. ఎంతో మంది లెజెండ్స్ ఈ విషయాన్ని గ్రహించలేక ఎదురు దెబ్బలు తిన్నవాళ్లే.
చాలా కొద్ది మంది మాత్రమే ఇక చాలు అని.. తమ టైం ముగియడానికి ముందే నిష్క్రమిస్తారు. తెలుగులో లెజెండరీ ఫైట్ మాస్టర్లుగా గుర్తింపు తెచ్చుకున్న రామ్ లక్ష్మణ్ మాత్రం.. ఎప్పుడైనా సరే తమ ప్రయాణాన్ని ఆపేయడానికి సిద్ధం అంటున్నారు. తమ పని నచ్చలేదని, తాము అప్డేట్ కాలేదని అనిపిస్తే.. నేరుగా తమకు ఆ విషయం చెప్పొచ్చని.. తాము తమ వర్క్ ఆపేస్తామని ఒక ఇంటర్వ్యూలో ఈ కవల సోదరులు స్పష్టంగా చెప్పారు.
ఇండస్ట్రీలో తమ ప్రయాణంలో 40 ఏళ్లు పూర్తయ్యాయని.. ఇప్పుడు తామిద్దరం దైవచింతనతో ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తున్నామని రామ్, లక్ష్మణ్ తెలిపారు. తమ కెరీర్లో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నామని.. జయాల కంటే అపజయాలు ఎక్కువగానే ఎదుర్కొన్నామని ఈ ఫైట్ మాస్టర్స్ చెప్పారు. ఐతే ఓటమి ఎదురైందని ఎప్పుడూ బాధ పడలేదని.. ధైర్యంగా అడుగు ముందుకు వేశామని అన్నారు.
ఇక వర్తమానం, భవిష్యత్ గురించి మాట్లాడుతూ.. తామిద్దరం ఎంతో సాధించామని.. తమకు ఉన్నదాంతో చాలా హ్యాపీగా బతికేస్తామని.. ఇప్పుడు తమకు పని ఇవ్వకపోయినా బాధ పడమని రామ్, లక్ష్మణ్ తెలిపారు. ఇప్పుడు సినిమా ఎంతో మారుతోందని.. అప్డేట్ అవుతోందని.. అందుకు తగ్గట్లుగా తాము మారట్లేదని అనిపించినా.. తమ పని నచ్చకపోయినా.. ఏ మొహమాటం లేకుండా తమకు చెప్పొచ్చని.. అయ్యో మాస్టర్స్ ఏమనుకుంటారో అని తమకు అవకాశాలు ఇవ్వాల్సిన పని లేదని వాళ్లిద్దరూ స్పష్టం చేశారు.
సినిమా కంటే తాము ఎక్కువ కాదని.. సినిమాకు ఇక తాము ఉపయోగపడం అంటే.. దాన్ని అంగీకరించి పని మానేసి ఉన్నదాంతో హ్యాపీగా ఉంటామని.. ఎవరో తమ గురించి ఏదో అనడానికి ముందే.. అన్నింటికీ తాము ప్రిపేరై ఉన్నామని రామ్, లక్ష్మణ్ చెప్పారు.
This post was last modified on November 27, 2025 9:15 pm
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…