వారణాసి సినిమా గ్లోబ్ ట్రోటర్ ఈవెంట్ సందర్భంగా హనుమంతుడిపై దర్శకుడు రాజమౌళి చేసిన వ్యాఖ్యలపై హిందూ సంఘాలు, బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. రాజమౌళి తమ మనోభావాలు దెబ్బతీశారంటూ కొందరు ఆయనపై కేసు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంపై టాలీవుడ్ నటుడు శివాజీ తీవ్రంగా స్పందించారు. హనుమంతుడిపై రాజమౌళి చేసిన వ్యాఖ్యల వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని, ఆయనపై కేసు కూడా పెట్టారని శివాజీ అన్నారు. అయితే, తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి గురించి మాత్రం ఎందుకు నోరు మెదపడం లేదని శివాజీ ప్రశ్నించారు.
తమ స్వలాభం కోసం లడ్డూ కల్తీ వంటి విషయాలపై వారు మాట్లాడరని శివాజీ మండిపడ్డారు. ఇది ప్రజల సమస్య కాదని, వారి మనోభావాలు దెబ్బతినవని ఎద్దేవా చేశారు. తిరుమల వెంకన్న స్వామికి ఐదేళ్ల పాటు అన్యాయం జరిగిందని, కానీ, దానిపై మాట్లాడాలంటే సోకాల్డ్ మనుషులకు భయమని విమర్శించారు. మనమంతా కుళ్లిపోయిన వ్యవస్థలోనే బ్రతుకుతున్నామని, ఈ విషయం జెన్ జెడ్ పిల్లలు గ్రహించాలని అన్నారు. ఆ తరం వాళ్లయినా సమాజంలో మార్పు తేవాలన్న ఉద్దేశ్యంతోనే తాను ఈ రోజు ఈ విషయాలపై మాట్లాడుతున్నానని శివాజీ అన్నారు.
హనుమంతుడిపై రాజమౌళి చేసిన కామెంట్లను శివాజీ సమర్థించలేదు. ఆ కామెంట్ల వల్ల కొందరి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పారు. అయితే, తాను వారిని తప్పుబట్టడం లేదని క్లారిటీనిచ్చారు. కానీ, రాజమౌళిపై కేసు పెట్టి, ఆయనపై విమర్శలు చేస్తున్న వ్యక్తులు…తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడిన విషయంపై ఏమీ మాట్లాడకపోవడంపైనే తాను అసంతృప్తి వ్యక్తం చేస్తున్నానని చెప్పారు.
This post was last modified on November 26, 2025 7:40 pm
వైసీపీ నాయకుడు, మాజీ మంత్రి.. తరచుగా కూటమి సర్కారు సహా.. పవన్ కల్యాణ్పై విమర్శలు గుప్పించే అంబటి రాంబాబు.. తాజాగా…
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి శనివారం సాయంత్రం సామాజిక మాధ్యమాల్లో ఒక్కసారిగా పెద్ద చర్చ మొదలైంది. ఉన్నట్లుండి…
తెలుగులో హారర్ థ్రిల్లర్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ‘మసూద’…
మరో కొత్త రికార్డు బద్దలైపోయింది. మొన్నటి ఏడాది రిలీజైన పుష్ప 2 ది రైజ్ వసూళ్లను ఇప్పుడప్పుడే ఎవరూ క్రాస్…
దేశంలో సుదీర్ఘకాలంగా ఎలాంటి పెంపునకు గురి కాకుండా ఉండిపోయిన లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన తెర మీదకు రాగా... కాంగ్రెస్…
కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏపీపై వరాల జల్లు కురిపించింది. శనివారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో సుదీర్ఘ…