రాజు వెడ్స్ రాంబాయి.. టాలీవుడ్లో ఈ సినిమా కొత్త సంచలనం. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాను అందించిన ఈటీవీ విన్ వాళ్లే దర్శకుడు వేణు ఉడుగులతో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ‘లిటిల్ హార్ట్స్’ను రిలీజ్ చేసిన బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని కూడా తమ బేనర్ల నుంచి విడుదల చేశారు. కొత్త హీరో హీరోయిన్లు, కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమా అయినా.. ఇది ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లతో బ్లాక్ బస్టర్ అయింది.
ఇప్పటికే వసూళ్లు రూ.10 కోట్లను చేరుతున్నాయి. ఈ సినిమా స్థాయికి అది పెద్ద నంబరే. ‘రాజు వెడ్స్ రాంబాయి’లో భాగమైన అందరికీ మంచి మంచి అవకాశాలే వస్తాయనడంలో సందేహం లేదు. ఈ సినిమా సక్సెస్ మీట్కు ముఖ్య అతిథిగా హాజరైన స్టార్ డైరెక్టర్ బాబీ.. తన వంతుగా ఇద్దరికి ఛాన్స్లు కూడా ఇచ్చేశాడు. ఆ ఇద్దరే.. దర్శకుడు సాయిలు, గేయ రచయిత మిట్టపల్లి సురేందర్.
‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు సాయిలు స్పీచ్ విని తాను కదిలిపోయినట్లు బాబీ చెప్పాడు. సాయిలు మాటలు విని తనకు వణుకు పుట్టిందని.. నిజాయితీగా ఉండేవాళ్లు ఇలానే ఉంటారని అనిపించిందని బాబీ చెప్పాడు. ఈ సినిమా చూశాక తనకు కూడా నిర్మాతగా మారాలనిపించిందని తెలిపాడు. ఇక స్టేజ్ మీదే సాయిలును పిలిచి.. చిరంజీవి హీరోగా తాను తీయబోయే సినిమాలో నువ్వొక పాత్ర చేయాలి అని బాబీ అడగ్గా.. అంతకంటే భాగ్యమా అన్నట్లు సరే అన్నాడు సాయిలు.
మరోవైపు మిట్టపల్లి సురేందర్ రాసిన ‘రాంబాయి నీ మీద నాకు..’ పాటను కొనియాడిన బాబీ.. చిరు చిత్రంలో అతడికి ఒక పాట రాసే అవకాశం ఇస్తానని మాట ఇచ్చాడు. దీంతో అతనూ అమితానందానికి గురయ్యాడు. మొత్తానికి ఓ చిన్న సినిమాతో తమ ప్రతిభను చాటిన సాయిలు, మిట్టపల్లి సురేందర్.. ఏకంగా చిరు సినిమాలోనే అవకాశాలు అందుకోబోతున్నారన్నమాట.
This post was last modified on November 26, 2025 5:47 pm
నాగచైతన్యను ఇప్పటివరకు క్లాస్ లుక్లో, లవర్ బాయ్గా చూసి అలవాటు పడ్డ కళ్లకు ఈ ఫొటో ఒక్కసారిగా షాక్ ఇస్తోంది.…
సరిగ్గా వారం రోజుల్లో ఉస్తాద్ భగత్ సింగ్ వచ్చేస్తాడు. థియేటర్ యజమానులు ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నారు. కేవలం…
ఇప్పుడు తెలుగు సినిమా ఎంతో ఎదిగిపోయింది.. సరికొత్త సినిమాలు తీస్తోంది అని కాలర్ ఎగరేస్తున్నాం కానీ.. రెండు దశాబ్దాల ముందు…
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…