రాజు వెడ్స్ రాంబాయి.. టాలీవుడ్లో ఈ సినిమా కొత్త సంచలనం. ‘లిటిల్ హార్ట్స్’ సినిమాను అందించిన ఈటీవీ విన్ వాళ్లే దర్శకుడు వేణు ఉడుగులతో కలిసి ఈ సినిమాను ప్రొడ్యూస్ చేశారు. ‘లిటిల్ హార్ట్స్’ను రిలీజ్ చేసిన బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని కూడా తమ బేనర్ల నుంచి విడుదల చేశారు. కొత్త హీరో హీరోయిన్లు, కొత్త దర్శకుడు కలిసి చేసిన సినిమా అయినా.. ఇది ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది. బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లతో బ్లాక్ బస్టర్ అయింది.
ఇప్పటికే వసూళ్లు రూ.10 కోట్లను చేరుతున్నాయి. ఈ సినిమా స్థాయికి అది పెద్ద నంబరే. ‘రాజు వెడ్స్ రాంబాయి’లో భాగమైన అందరికీ మంచి మంచి అవకాశాలే వస్తాయనడంలో సందేహం లేదు. ఈ సినిమా సక్సెస్ మీట్కు ముఖ్య అతిథిగా హాజరైన స్టార్ డైరెక్టర్ బాబీ.. తన వంతుగా ఇద్దరికి ఛాన్స్లు కూడా ఇచ్చేశాడు. ఆ ఇద్దరే.. దర్శకుడు సాయిలు, గేయ రచయిత మిట్టపల్లి సురేందర్.
‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు సాయిలు స్పీచ్ విని తాను కదిలిపోయినట్లు బాబీ చెప్పాడు. సాయిలు మాటలు విని తనకు వణుకు పుట్టిందని.. నిజాయితీగా ఉండేవాళ్లు ఇలానే ఉంటారని అనిపించిందని బాబీ చెప్పాడు. ఈ సినిమా చూశాక తనకు కూడా నిర్మాతగా మారాలనిపించిందని తెలిపాడు. ఇక స్టేజ్ మీదే సాయిలును పిలిచి.. చిరంజీవి హీరోగా తాను తీయబోయే సినిమాలో నువ్వొక పాత్ర చేయాలి అని బాబీ అడగ్గా.. అంతకంటే భాగ్యమా అన్నట్లు సరే అన్నాడు సాయిలు.
మరోవైపు మిట్టపల్లి సురేందర్ రాసిన ‘రాంబాయి నీ మీద నాకు..’ పాటను కొనియాడిన బాబీ.. చిరు చిత్రంలో అతడికి ఒక పాట రాసే అవకాశం ఇస్తానని మాట ఇచ్చాడు. దీంతో అతనూ అమితానందానికి గురయ్యాడు. మొత్తానికి ఓ చిన్న సినిమాతో తమ ప్రతిభను చాటిన సాయిలు, మిట్టపల్లి సురేందర్.. ఏకంగా చిరు సినిమాలోనే అవకాశాలు అందుకోబోతున్నారన్నమాట.
This post was last modified on November 26, 2025 5:47 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…