గిరిజ ఓక్.. ఇటీవల సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. 37 ఏళ్ల ఈ మరాఠీ నటి గురించి కొన్ని వారాల ముందు వరకు జనానికి పెద్దగా తెలియదు. ఆమిర్ ఖాన్ మూవీ ‘తారే జమీన్ పర్’ సహా పలు చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు వచ్చిన పాపులారిటీ అంతంతమాత్రమే. కానీ నటిగా ఎన్నో సినిమాలు, సీరియళ్లు చేసినా రాని గుర్తింపు.. ఇటీవల ఒక ఇంటర్వ్యూ వల్ల వచ్చింది.
ఆ ఇంటర్వ్యూలో తన లుక్, తన హావభావాలు.. ఆమె చెప్పిన మాటలకు నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఆమెకు ఫ్యాన్స్ అయిపోయారు. ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ఫొటోలు, వీడియో క్లిప్స్ మాత్రమే కాదు.. గతంలో ఆమె నటించిన అనేక సినిమాల వీడియోలు కూడా కూడా వైరల్ అయ్యాయి. గిరిజకు కొన్ని రోజుల్లోనే తిరుగులేని ఫాలోయింగ్ తెచ్చిపెట్టాయి. ఐతే ఈ పాపులారిటీ వల్ల ఆమె కొన్ని సమస్యలు కూడా ఎదుర్కొంటోందట. నీ రేటెంత అంటూ నీచమైన మెసేజ్లు పెడుతున్నారని ఆమె వాపోయింది.
తనకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరిగాక ఎంతోమంది పాజిటివ్ కామెంట్లు పెట్టారని.. దాంతో పాటు కొన్ని దారుణమైన మెసేజ్లూ వస్తున్నాయని గిరిజ ఓక్ చెప్పింది. ‘‘నీతో గంట సేపు గడపాలంటే ఎంత తీసుకుంటావు’.. ‘‘నీ రేటు ఎంత’’ అంటూ చాలామంది తనకు మెసేజ్లు పెడుతున్నారని.. ఇలాంటి వాటికి లెక్కే లేదని గిరిజ ఆవేదన వ్యక్తం చేసింది.
వీళ్లందరికీ నిజ జీవితంలో తాను ఎదురు పడితే తన వైపు కూడా చూడకపోవచ్చని.. ఒక వేళ చూసినా గౌరవంతోనే మాట్లాడతారు తప్ప ఇలాంటి నీచపు కామెంట్లు చేయరని ఆమె అభిప్రాయపడింది. కానీ ఆన్ లైన్లో మాత్రం నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తారని గిరిజ వాపోయింది. ఇక తన ఇంటర్వ్యూ వల్ల మంచి పాపులారిటీ వచ్చినా.. అదేమీ అవకాశాలు తెచ్చిపెట్టడం లేదని గిరిజ చెప్పింది. కొత్తగా తనకు సినిమా ఆఫర్లేమీ రాలేదని.. తన జీవితంలో పెద్ద మార్పేమీ లేదని ఆమె తేల్చేసింది.
This post was last modified on November 26, 2025 4:52 pm
ఇటీవలే విడుదలైన విశ్వనాథ్ అండ్ సన్స్ లో మమిత బైజు పోషించిన పాత్ర ఆ సినిమా విజయంలో ఎంత కీలక…
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకృతి చికిత్స కోసం శుక్రవారం కేరళం బయలుదేరి వెళ్లనున్నారు. 20 రోజుల పాటు కేరళంలోనే…
ఇవాళ విడుదలైన ఇరుముడికి సర్వత్రా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి. అన్ని సెంటర్ల…
దక్షిణాది లెజండరీ నటీనటులు ఇటీవలి కాలంలో కన్ను మూయడం సినీ ప్రియులను బాధిస్తోంది. భాగ్యరాజ్ గారి హఠాన్మరణం ఇంకా మర్చిపోక…
ప్రచార హోరులో తానే సింగిల్ సింహం అని, కృష్ణుడిని, అర్జునుడిని అంటూ గొప్పలు చెప్పుకోవడం రాజకీయాల్లో సాధారణమే. కానీ, ప్రజాసమస్యలపై…
వివేకా హత్య కేసు విచారణ ఏళ్ల తరబడి కొనసాగుతున్న వైనంపై వివేకా తనయురాలు సునీత అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి…