ఊహించని విధంగా తక్కువ అంచనాలతో రిలీజై సూపర్ హిట్ అందుకున్న రాజు వెడ్స్ రాంబాయి చూసేందుకు లిమిటెడ్ బడ్జెట్ లా కనిపిస్తున్నా దాని వెనుక పడిన కష్టం, తపన, శ్రమ చాలా పెద్దవి. విరాట పర్వం ఫ్లాప్ అయ్యాక దర్శకుడు వేణు ఊడుగులకు మళ్ళీ డైరెక్షన్ చేసేందుకు టైం పట్టింది. ఈలోగా సమయం వృథా కాకుండా కొత్త టాలెంట్ ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నిర్మాతగా మారేందుకు సిద్ధపడ్డారు. అప్పుడు కలిసిన వ్యక్తే సాయిలు కంపాటి. సురేష్ బొబ్బిలి పరిచయంలో ఖమ్మం నుంచి హైదరాబాద్ వచ్చిన సాయిలు తొలి ఫోన్ కాల్ నుంచే తన అమాయకత్వాన్ని చూపించడం వేణుని కట్టి పడేసింది.
చేతిలో ఎంతో కంటెంట్ ఉన్నా ఆత్మనూన్యతా భావం, భయంతో తొలినాళ్ళలో తాను అనుభవించిన గతాన్ని వేణు ఊడుగుల గుర్తు చేసుకున్నారు. రాజు వెడ్స్ రాంబాయి వెనుక ఈటీవీ విన్, బన్నీ వాస్, వంశీ నందిపాటి లాంటి పెద్ద చేతులు ఉండొచ్చు. కానీ అవి కలవడానికి పునాది వేసింది వేణు ఊడుగుల. కోట్లకు కోట్లు ఖర్చు పెట్టించకుండా పూర్తిగా కథలో నిజాయితీని నమ్మడం వల్ల ఈ రోజు గొప్ప ఫలితం అందుకున్నారు. పెట్టుబడి మీద లాభం రాబట్టుకోవడం అంటే ఏంటో చూపించారు. డైరెక్టర్ గా కన్నా ఒక ప్రొడ్యూసర్ గా వేణు ఊడుగుల చూపిస్తున్న ఆనందం ఎందరో స్ఫూర్తిగా తీసుకోవాలి.
ప్యాన్ ఇండియా ఫీవర్ పట్టుకున్నాక హీరోలు, దర్శకులు ప్రతి సినిమాకు రెండేళ్లు తీసుకోవడం సాధారణమైపోయింది. దీని వల్ల నిర్మాతలకు బడ్జెట్ భారం కావడంతో పాటు బొమ్మ ఏ మాత్రం అటుఇటు అయినా నిండా మునిగిపోతున్నారు. అలా కాకుండా మట్టి వాసన నుంచి వచ్చే రాజు వెడ్స్ రాంబాయి లాంటి కథలను, సాయిలు లాంటి ప్రతిభలను వెలికి తీస్తే అద్భుతాలు చేయొచ్చు. గొప్ప సినిమా, క్లాసిక్ అవ్వొచ్చు అవ్వకపోవచ్చు. కానీ ప్రొడ్యూసర్ కు ఓ నాలుగు రూపాయలు మిగిలేలా చేసినవాడే విజేత. వేణు ఊడుగుల, సాయిలు కంపాటి అలియాస్ బోస్ ఇప్పుడీ విజయానందాన్ని మనసారా ఆస్వాదిస్తున్నారు.
This post was last modified on November 26, 2025 10:49 am
ఏంటో జెన్ జీ ఆడియన్స్ మహా విచిత్రంగా ఉన్నారు. కొన్ని కొత్త సినిమాలను అస్సలు పట్టించుకోరు. కొన్ని రీ రిలీజులకేమో…
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…