గత మూడు దశాబ్దాల్లో తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చిన ప్రతి దర్శకుడూ ఒక్క సినిమా అయినా చేయాలని ఆశపడ్డ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరసలో ఉంటాడనడంలో సందేహం లేదు. ఎంతోమంది దర్శకులకు సినిమా పిచ్చి ఎక్కించడంలో చిరు ప్రధాన పాత్ర పోషించి ఉంటాడనంలో సందేహం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. స్వయంకృషి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి దిగ్గజాలను మించి ఎదగడం అంటే ఆషామాషీ విషయం కాదు.
అందుకే ఆయన ఎందరికో స్ఫూర్తి. ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర దర్శకులుగా వెలుగొందుతున్న ప్రతి ఒక్కరూ చిరు పేరు చెబితే ఎక్కడ లేని ఎమోషన్ తెచ్చుకుంటారు. ఆయన గురించి గొప్పగా మాట్లాడతారు. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో ఒకడైన సందీప్ రెడ్డి వంగకు కూడా చిరు అంటే పిచ్చి అభిమానం అన్న సంగతి తెలిసిందే. చిరు ఫెరోషియస్ లుక్తో ఉన్న ఒక ఫొటోను తన ఆఫీసులో పెట్టుకుని అందరి దృష్టినీ ఆకర్షించాడు సందీప్.
అంతటి అభిమానం ఉన్న సందీప్.. చిరుతో ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఊహ మెగా అభిమానులను ఎంతో ఎగ్జైట్ చేస్తోంది. ప్రభాస్తో అతను చేయబోయే ‘స్పిరిట్’లో చిరు ప్రత్యేక పాత్ర చేస్తాడన్న ఒక రూమర్ కొన్ని రోజులు సోషల్ మీడియాను ఊపేసింది. కానీ ఆ వార్త నిజం కాదని తేల్చేశాడు సందీప్. ఐతే ‘స్పిరిట్’ సినిమాలో నటించకపోయినా.. ఆ సినిమా ముహూర్త వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై.. టీంను ఆశీర్వదించాడు చిరు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ వేడుక ఆదివారం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన చిరు.. క్లాప్ కొట్టి సినిమాను మొదలుపెట్టించారు.
ఈ వేడుకలో నిర్మాతలు భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగలతో పాటు హీరోయిన్ త్రిప్తి డిమ్రి కూడా హాజరైంది. చిరు కోసమేనేమో ఈ వేడుకను హైదరాబాద్లో చేసినట్లున్నారు. భూషణ్ కుమార్, త్రిప్తి సహా టీంలోని పలువురు ముంబయి నుంచి ఇక్కడికి వచ్చారు. ఐతే లుక్ రెవీల్ అవ్వకూడదనే ఉద్దేశంతో ప్రభాస్ ఫొటోస్ మాత్రం రిలీజ్ చెయ్యలేదు సందీప్. ముహూర్త వేడుకతోనే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా మొదలైపోవడం విశేషం. బ్యాగ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ రెడీ చేసి ప్రి ప్రొడక్షన్ పనులనూ పక్కాగా పూర్తి చేసిన సందీప్.. శరవేగంగా చిత్రీకరణ సాగించాలని చూస్తున్నాడు.
This post was last modified on November 24, 2025 11:19 am
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…