గత మూడు దశాబ్దాల్లో తెలుగు సినీ పరిశ్రమలోకి వచ్చిన ప్రతి దర్శకుడూ ఒక్క సినిమా అయినా చేయాలని ఆశపడ్డ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరసలో ఉంటాడనడంలో సందేహం లేదు. ఎంతోమంది దర్శకులకు సినిమా పిచ్చి ఎక్కించడంలో చిరు ప్రధాన పాత్ర పోషించి ఉంటాడనంలో సందేహం లేదు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. స్వయంకృషి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ లాంటి దిగ్గజాలను మించి ఎదగడం అంటే ఆషామాషీ విషయం కాదు.
అందుకే ఆయన ఎందరికో స్ఫూర్తి. ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్ర దర్శకులుగా వెలుగొందుతున్న ప్రతి ఒక్కరూ చిరు పేరు చెబితే ఎక్కడ లేని ఎమోషన్ తెచ్చుకుంటారు. ఆయన గురించి గొప్పగా మాట్లాడతారు. ప్రస్తుతం ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ దర్శకుల్లో ఒకడైన సందీప్ రెడ్డి వంగకు కూడా చిరు అంటే పిచ్చి అభిమానం అన్న సంగతి తెలిసిందే. చిరు ఫెరోషియస్ లుక్తో ఉన్న ఒక ఫొటోను తన ఆఫీసులో పెట్టుకుని అందరి దృష్టినీ ఆకర్షించాడు సందీప్.
అంతటి అభిమానం ఉన్న సందీప్.. చిరుతో ఒక సినిమా చేస్తే ఎలా ఉంటుందనే ఊహ మెగా అభిమానులను ఎంతో ఎగ్జైట్ చేస్తోంది. ప్రభాస్తో అతను చేయబోయే ‘స్పిరిట్’లో చిరు ప్రత్యేక పాత్ర చేస్తాడన్న ఒక రూమర్ కొన్ని రోజులు సోషల్ మీడియాను ఊపేసింది. కానీ ఆ వార్త నిజం కాదని తేల్చేశాడు సందీప్. ఐతే ‘స్పిరిట్’ సినిమాలో నటించకపోయినా.. ఆ సినిమా ముహూర్త వేడుకకు ముఖ్య అతిథిగా హాజరై.. టీంను ఆశీర్వదించాడు చిరు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ వేడుక ఆదివారం జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా వచ్చిన చిరు.. క్లాప్ కొట్టి సినిమాను మొదలుపెట్టించారు.
ఈ వేడుకలో నిర్మాతలు భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగలతో పాటు హీరోయిన్ త్రిప్తి డిమ్రి కూడా హాజరైంది. చిరు కోసమేనేమో ఈ వేడుకను హైదరాబాద్లో చేసినట్లున్నారు. భూషణ్ కుమార్, త్రిప్తి సహా టీంలోని పలువురు ముంబయి నుంచి ఇక్కడికి వచ్చారు. ఐతే లుక్ రెవీల్ అవ్వకూడదనే ఉద్దేశంతో ప్రభాస్ ఫొటోస్ మాత్రం రిలీజ్ చెయ్యలేదు సందీప్. ముహూర్త వేడుకతోనే ఈ సినిమా తొలి షెడ్యూల్ షూటింగ్ కూడా మొదలైపోవడం విశేషం. బ్యాగ్రౌండ్ స్కోర్, డైలాగ్స్ రెడీ చేసి ప్రి ప్రొడక్షన్ పనులనూ పక్కాగా పూర్తి చేసిన సందీప్.. శరవేగంగా చిత్రీకరణ సాగించాలని చూస్తున్నాడు.
This post was last modified on November 24, 2025 11:19 am
తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. నటి త్రిష,…
గుజరాత్లో చాందిపుర వైరస్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. ఈ వైరస్ కారణంగా ఇప్పటికే 22 మంది చిన్నారులు మృతిచెందినట్లు రాష్ట్ర…
సినీ అభిమానులందు తెలుగు అభిమానులు వేరు అని ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిందే. తమ సినిమాలను ప్రమోట్ చేయడం కోసం తెలుగు రాష్ట్రాలకు…
మలయాళం సూపర్ స్టార్ గా పేరొందిన మోహన్ లాల్ కూతురు విస్మయ ఈ శుక్రవారం విడుదల కాబోతున్న తుదక్కంతో తెరంగేట్రం…
బీహార్.. జాతీయ రాజకీయాల్లో మరోమారు పతాక శీర్షికలకు ఎక్కేసింది. నిన్నటిదాకా బీజేపీ, జేడీయూ మైత్రి... జేడియూ చీఫ్ నితీశ్ కుమార్ నుంచి పాలనా…
నమ్మలేక పోతున్నారా… అయినా ఇది నిజం. తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలంటే గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందన్న సంగతి అందరికీ…