కొత్త రిలీజుల్లో ఒక్క రాజు వెడ్స్ రాంబాయి మాత్రమే థియేటర్లలో జనాన్ని నింపుతోంది. మిగిలిన కొత్త సినిమాలన్నీ అంతంత మాత్రం టాక్ తో ప్రేక్షకులను నిరాశపరిచాయి. కొద్దోగొప్పో పర్వాలేదనిపించుకున్న పాంచ్ మినార్ సరైన ప్రమోషన్లు లేక ఆడియన్స్ కి చేరువ కాలేకపోతోంది. ప్రెస్ మీట్లు గట్రా రాజ్ తరుణ్ టీమ్ చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. దీంతో హెవీ ఎమోషన్స్ ఉన్న కథైనా సరే రాజు వెడ్స్ రాంబాయికే ప్రేక్షకులు ఓటేస్తున్నారు. అయితే దీని దూకుడు నైజామ్ లో ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నేటివిటీ సమస్యో మరొకటో కానీ ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీలు వేగంగా లేవు.
రెండు రోజులకు సుమారు నాలుగు కోట్ల దాకా రాజు వెడ్స్ రాంబాయి వసూలు చేసినట్టు ట్రేడ్ టాక్. గత ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షోలు 69 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం చిన్న విషయం కాదు. మాములుగా టయర్ 2 హీరోలకే ఇలాంటి నెంబర్ కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఆడియన్స్ రాజుగాని ప్రేమకథకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఎక్కువ రెవిన్యూ హైదరాబాద్ నుంచే వస్తోంది. కరీంనగర్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో మాస్ ఆదరణ బాగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏపీ సైడ్ రేపటి నుంచి బాగా డ్రాప్ అవుతుందనే అంచనాలున్న నేపథ్యంలో దాన్నేమైనా బ్రేక్ చేస్తుందేమో చూడాలి.
సండే కలెక్షన్లు మాత్రం చెప్పుకోదగ్గ అంకెలతోనే నమోదు కావడం ఖాయం. చాలా చోట్ల స్క్రీన్లు పెంచారు. అయితే నిర్మాతలు ప్రకటించిన 99, 105 రూపాయల టికెట్ల స్థానంలో చాలా మంది ఎగ్జిబిటర్లు పాత ధరలే పెట్టడం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆఫర్ ఒక్క రోజే అని నిర్మాతలు ముందే ప్రకటించకపోవడం దీనికి కారణం. ఫ్లాప్ టాక్ వస్తే ఆఫర్ కొనసాగేదని, హిట్ టాక్ రావడం వల్ల అప్పటికప్పుడు రేట్లు మార్చేశారని ప్రేక్షకుల కంప్లైంట్. సరే ఏదైతేనేం మొత్తానికి హిట్టు స్టాంప్ వేయించుకున్న రాజు వెడ్స్ రాంబాయి తక్కువ బిజినెస్ కాబట్టి ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ దాటేసింది కానీ ఎంత లాభాలు నమోదు చేస్తుందో చూడాలి.
This post was last modified on November 23, 2025 1:26 pm
హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మరో దారుణం చోటుచేసుకుంది. సినిమా షూటింగ్ అవకాశం ఇస్తామని నమ్మించి ఇద్దరు అనాథ యువతులను సికింద్రాబాద్లోని గదికి…
రాహుల్ గాంధీకి ప్రధాన మంత్రి పదవిపై మోజులేదు. నేనే చెప్పి ఒప్పించా. వచ్చే ఎన్నికల్లోనే రాహుల్ ను ప్రదానిని చేసేందుకు…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో దళపతి విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కజగం (టీవీకే) ఘన విజయం సాధించింది. ఫలితంగా సినిమాల్లో…
దేశంలో రోజురోజుకూ పెరిగిపోతున్న వీధి కుక్కల దాడులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పిచ్చిపట్టిన, ప్రమాదకరంగా మారిన కుక్కలకు…
తెలుగులో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీస్లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా కచ్చితంగా ఉంటుంది. లెజెండరీ ప్రొడ్యూసర్ ఎం.ఎస్.రాజు కెరీర్ పీక్స్లో ఉండగా…
ఏపీ రాజధాని అమరావతిలోని సచివాలయంలో సోమవారం ఓ కీలక భేటీ జరిగింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు…