Movie News

రాంబాయి జోరు ఎక్కడిదాకా ఎప్పటిదాకా

కొత్త రిలీజుల్లో ఒక్క రాజు వెడ్స్ రాంబాయి మాత్రమే థియేటర్లలో జనాన్ని నింపుతోంది. మిగిలిన కొత్త సినిమాలన్నీ అంతంత మాత్రం టాక్ తో ప్రేక్షకులను నిరాశపరిచాయి. కొద్దోగొప్పో పర్వాలేదనిపించుకున్న పాంచ్ మినార్ సరైన ప్రమోషన్లు లేక ఆడియన్స్ కి చేరువ కాలేకపోతోంది. ప్రెస్ మీట్లు గట్రా రాజ్ తరుణ్ టీమ్ చేస్తున్నప్పటికీ పెద్దగా ఫలితం కనిపించడం లేదు. దీంతో హెవీ ఎమోషన్స్ ఉన్న కథైనా సరే రాజు వెడ్స్ రాంబాయికే ప్రేక్షకులు ఓటేస్తున్నారు. అయితే దీని దూకుడు నైజామ్ లో ఎక్కువగా ఉంది. ఆంధ్రప్రదేశ్ లో నేటివిటీ సమస్యో మరొకటో కానీ ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీలు వేగంగా లేవు.

రెండు రోజులకు సుమారు నాలుగు కోట్ల దాకా రాజు వెడ్స్ రాంబాయి వసూలు చేసినట్టు ట్రేడ్ టాక్. గత ఇరవై నాలుగు గంటల్లో బుక్ మై షోలు 69 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోవడం చిన్న విషయం కాదు. మాములుగా టయర్ 2 హీరోలకే ఇలాంటి నెంబర్ కనిపిస్తుంది. ముఖ్యంగా తెలంగాణ ఆడియన్స్ రాజుగాని ప్రేమకథకు బాగా కనెక్ట్ అవుతున్నారు. ఎక్కువ రెవిన్యూ హైదరాబాద్ నుంచే వస్తోంది. కరీంనగర్, ఆదిలాబాద్ తదితర ప్రాంతాల్లో మాస్ ఆదరణ బాగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఏపీ సైడ్ రేపటి నుంచి బాగా డ్రాప్ అవుతుందనే అంచనాలున్న నేపథ్యంలో దాన్నేమైనా బ్రేక్ చేస్తుందేమో చూడాలి.

సండే కలెక్షన్లు మాత్రం చెప్పుకోదగ్గ అంకెలతోనే నమోదు కావడం ఖాయం. చాలా చోట్ల స్క్రీన్లు పెంచారు. అయితే నిర్మాతలు ప్రకటించిన 99, 105 రూపాయల టికెట్ల స్థానంలో చాలా మంది ఎగ్జిబిటర్లు పాత ధరలే పెట్టడం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఆఫర్ ఒక్క రోజే అని నిర్మాతలు ముందే ప్రకటించకపోవడం దీనికి కారణం. ఫ్లాప్ టాక్ వస్తే ఆఫర్ కొనసాగేదని, హిట్ టాక్ రావడం వల్ల అప్పటికప్పుడు రేట్లు మార్చేశారని ప్రేక్షకుల కంప్లైంట్. సరే ఏదైతేనేం మొత్తానికి హిట్టు స్టాంప్ వేయించుకున్న రాజు వెడ్స్ రాంబాయి తక్కువ బిజినెస్ కాబట్టి ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ దాటేసింది కానీ ఎంత లాభాలు నమోదు చేస్తుందో చూడాలి.

This post was last modified on November 23, 2025 1:26 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

దెబ్బతిన్న హీరోలు vs రావిపూడి

టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…

6 minutes ago

తెలంగాణ జనసేన టార్గెట్ ఫిక్స్… పొత్తు ఉంటుందా పవన్ సార్?

తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్‌ శంకర్‌గౌడ్‌…

32 minutes ago

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

1 hour ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

2 hours ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

2 hours ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago