Movie News

దుమారం రేపుతున్న తిరుమల వీడియో

ఇది సోషల్ మీడియా కాలం. సెలబ్రెటీ స్టేటస్ ఉన్న ఎవ్వరైనా తమ మాటలు, చేతల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. యథాలాపంగా చేసే కామెంట్లు కూడా కొన్నిసార్లు తీవ్ర వివాదాస్పదమై మొత్తం ఇమేజ్‌ను డ్యామేజ్ చేస్తుంటాయి. ఇప్పుడు న్యూస్ ప్రెజెంటర్ కమ్ యాంకర్ శివజ్యోతి ఇలాగే నోరు జారి తీవ్ర వివాదంలో చిక్కుకుంది. తాను ఎక్కడున్నా.. దేని గురించి మాట్లాడుతున్నా అని చూసుకోకుండా ఆమె చేసిన కామెంట్ సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకతకు దారి తీసింది. 

ఇటీవలే శివజ్యోతి తన భర్త, సన్నిహితులతో కలిసి తిరుమలకు వెళ్లింది. అక్కడ క్యూ లైన్లో నిలబడి ఉండగా.. టీటీడీ సిబ్బంది పక్క నుంచి భక్తులకు ప్రసాదం అందజేశారు. ఇది అక్కడ కామన్ ప్రాక్టీసే. ఐతే ఈ ప్రసాదం తీసుకుంటున్న సందర్భంగా వీడియో తీసుకుంటూ శివజ్యోతి, ఆమె భర్త చేసిన కామెంట్లు తీవ్ర వివాదానికి దారి తీశాయి. తాము కాస్ట్లీ ప్రసాదం అడుక్కుంటున్నామని.. తాము రిచెస్ట్ బిచ్చగాళ్లమని శివజ్యోతి, ఆమె భర్త సెల్ఫీ వీడియోలో కామెంట్ చేశారు. ఏదో ఒకసారి అంటే ఏదోలే అనుకోవచ్చు కానీ.. పదే పదే ఆ మాటలను వల్లెవేయడం.. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర వ్యతిరేకత తప్పలేదు.

తిరుమలలో దర్శనానికి వెళ్తూ క్యూ లైన్లో ఇలాంటి వీడియోలు చేయడమే తప్పంటే.. శ్రీవారి ప్రసాదం గురించి ఇలా కామెంట్ చేయడం భక్తుల మనోభావాలను దెబ్బ తీసేదే అని.. హిందూ దేవుళ్లు, ఆలయాలు.. హిందూ సంస్కృతి, ఆచారాల గురించి కామెంట్ చేయడం ఫ్యాషన్ అయిపోయిందని.. శివజ్యోతి బహిరంగ క్షమాపణ చెప్పాలని.. అలాగే ఆమె మీద టీటీడీ చర్యలు చేపట్టాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్ ప్రమోషన్లతో శివజ్యోతి ఇమేజ్ డ్యామేజ్ అయింది. సోషల్ మీడియాలో వ్యతిరేకత ఎదుర్కొంది. అది చాలదన్నట్లు ఇప్పుడు ఈ వీడియోతో ఆమె మరింత ఇబ్బందుల్లో పడేలా కనిపిస్తోంది.

This post was last modified on November 23, 2025 9:04 am

Share
Show comments
Published by
Kumar
Tags: Siva jyothi

Recent Posts

పరకామణి దొంగను వెనకేసుకొచ్చిన జగన్!

చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…

22 minutes ago

‘కూటమి బలంగా ఉండాలంటే మినీ యుద్ధాలు చేయాల్సిందే’

2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…

2 hours ago

ప్రీమియర్లు క్యాన్సిల్… ఫ్యాన్స్ గుండెల్లో పిడుగు

ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…

2 hours ago

‘పరదాల్లో పవన్’ అన్న వైసీపీ ఇప్పుడేమంటుందో?

ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…

4 hours ago

చైతూ వివాహ వార్షికోత్సవం… దర్శకుడి పోస్టు వైరల్

ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్‌‌గా పెళ్లి చేసుకుంది ఈ…

4 hours ago

కోహ్లీ… 2,462 రోజుల సెంటిమెంట్ బ్రేక్

విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్‌పూర్ వేదికగా జరిగిన రెండో…

4 hours ago