రాజు వెడ్స్ రాంబాయి సక్సెస్ ఈవెంట్ లో నిర్మాత బన్నీ వాస్ దగ్గరికి ఐబొమ్మ రవి అరెస్ట్ ప్రస్తావన వచ్చింది. సోషల్ మీడియాలో తనపై సానుభూతి పెరుగుతోందని, టికెట్ రేట్ల వల్లే జనాలు పైరసీకి అలవాటు పడిపోయి అతన్ని కొందరు హీరోలా చూడటం గురించి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పారు. టికెట్ ధరలు ఒకటే సమస్య కాదని, పెద్దా చిన్నా తేడా లేకుండా అన్ని సినిమాలు పైరసీ బారిన పడుతున్నాయని, రేట్లు పెంచుకునేవి సంవత్సరంలో పది పదిహేను ఉంటే మిగిలినవన్నీ చిన్నవేనని, వాటి నిర్మాతలు ఆస్తులు అమ్ముకుని అప్పుల పాలై వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారని, ఇది ఆలోచించాలని అన్నారు.
బన్నీ వాస్ చెప్పింది అక్షర సత్యం. అన్నీ పైరసీ బారిన పడుతున్నాయి. నిజమే. కానీ టికెట్ రేట్ల విషయంలో కొందరు నిర్మాతల అత్యాశ ప్రేక్షకులను కొన్ని వారాల పాటు థియేటర్లను దూరం చేస్తుందన్న విషయాన్ని విస్మరించకూడదు. ఉదాహరణకు ఒక ప్యాన్ ఇండియా మూవీ ప్రీమియర్ కు వెయ్యి రూపాయలు ఒక్క టికెట్ మీద ఖర్చు పెట్టిన ప్రేక్షకుడు పెద్ద సినిమా లేకపోతే రెండు మూడు వారాలు థియేటర్ వైపుకు వెళ్లడం లేదు. అది పుష్ప కావొచ్చు ఓజి అవ్వొచ్చు. తర్వాత పది రోజుల పాటు యాభై నుంచి నూటా యాభై దాకా పెంపు ఉండటం వల్ల ఆ ప్రభావం లాంగ్ రన్ మీద ఉంటోందనేది కాదనలేని వాస్తవం.
కంటెంట్లు బాగుంటే బడ్జెట్ తో సంబంధం లేకుండా బలగం నుంచి లిటిల్ హార్ట్స్ దాకా తెలుగు జనాలు చాలా బ్లాక్ బస్టర్లు ఇచ్చారు. అయిదేళ్ళు తీసిన హరిహర వీరమల్లుని తిరస్కరించారు. ఇవన్నీ పైరసీ బారిన పడినవే. ఆ భూతానికి హిట్టు ఫ్లాపు తేడా ఉండదు. ఇక రాజు వెడ్స్ రాంబాయికి 99 రూపాయల టికెట్ స్ట్రాటజి ఎంతగా గొప్పగా వర్కౌట్ అవుతోందో బుకింగ్స్ చూస్తే అర్థమైపోతుంది. ఒకవేళ సాధారణంగా ఉండే 177, 200 ఉంటే ఇంత స్పందన ఉండేది కాదేమో. సో ఎప్పటికైనా ప్రొడ్యూసర్లు టికెట్ రేట్ల విషయంలో మరీ అత్యాశ పోకపోవడం అనేది ఇండస్ట్రీకి ఖచ్చితంగా మేలు చేస్తుంది.
This post was last modified on November 21, 2025 7:40 pm
దురంధర్.. చాలా ఏళ్ల తర్వాత భారతీయ సినిమాలో బాలీవుడ్ తలెత్తుకునేలా చేసిన సినిమా. గత ఏడాది ఛావా, సైయారా సినిమాలు…
తమిళంలో కొన్నేళ్లుగా నంబర్ వన్ హీరోగా కొనసాగుతున్న విజయ్.. పూర్తి స్థాయి రాజకీయాల్లోకి అడుగు పెట్టి, ఎన్నికల బరిలోకి దిగే…
తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద…
న్యూజిలాండ్తో జరిగిన ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ ఘనంగా ముగించింది. శనివారం జరిగిన ఆఖరిదైన ఐదో టీ20లో టీమిండియా…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడకం వ్యవహారం సద్దుమణగక ముందే ఏపీ సీఎం చంద్రబాబును అంబటి రాంబాబు దుర్భాషలాడిన…
ఫోన్ ట్యాపింగ్ కేసులో నంది నగర్ లోని కేసీఆర్ నివాసంలోనే విచారణ జరుపుతామని సిట్ అధికారులు రెండోసారి కేసీఆర్ కు…