నేనిలాగే ఉంటాను, ఇలాగే తీస్తాను అంటూ మాటకు కట్టుబడి ఫక్తు ఎంటర్ టైనర్లు ఇస్తూ సంక్రాంతికి వస్తున్నాంతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం మన శంకరవరప్రసాద్ గారు తీస్తున్న సంగతి తెలిసిందే. ఎవరికీ సాధ్యం కానీ చిరంజీవి – వెంకటేష్ కాంబోని నిజం చేయడం ద్వారా అభిమానుల అంచనాలు ఆల్రెడీ ఎక్కడికో తీసుకెళ్లాడు. రాజా సాబ్ లాంటి ప్యాన్ ఇండియా మూవీతో పాటు రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్, విజయ్ తదితరులతో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ఎప్పటిలాగే ఫ్యామిలీ ఆడియన్స్ తో బ్లాక్ బస్టర్ కొట్టేస్తాననే నమ్మకంతో షూటింగ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా అనిల్ రావిపూడితో చేయాలని వెయిట్ చేస్తున్న హీరోలు చాలానే ఉన్నారు. తమ హీరోలోని ఎనర్జీని కరెక్ట్ గా వాడుకునే దర్శకుడు అతనేనంటూ రామ్ అభిమానులు ఫీలవుతూ ఉంటారు. ఇటీవలే సరిగమా షోకు జడ్జిగా వచ్చిన రావిపూడి తమ కాంబో గురించి ఒక హింట్ అయితే ఇచ్చారు. రామ్ తో సినిమా ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ, వస్తే మాత్రం బద్దలవ్వాల్సిందేనని అనేశారు. అంటే ఏదో స్ట్రాంగ్ పాయింట్ మనసులో ఉండే ఉంటుంది. లేకపోతే నా చేతిలో ఏముంది, ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పేవారుగా. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో ఈ కలయికని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
ఇక రామ్ విషయానికి వస్తే ఆంధ్రకింగ్ తాలూకాతో మళ్ళీ కంబ్యాక్ అవుతానని బలంగా నమ్ముతున్నాడు. పాటలు, ట్రైలర్ ఆల్రెడీ పాజిటివ్ వైబ్స్ సృష్టించాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ దర్శకుడు మహేష్ బాబు టేకింగ్ చూసి హిట్టు ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. శంకరవరప్రసాద్ గారు తర్వాత రావిపూడి ఎవరితో చేస్తారనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. బాలయ్యతో ఉండొచ్చని అంటున్నారు కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అదేదో రామ్ తో చేస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు కానీ టాలీవుడ్ కాంబినేషన్లు ఎప్పుడు ఎలా ఎక్కడ మొదలవుతాయో వెంటనే చెప్పలేం.
This post was last modified on November 21, 2025 10:48 am
ఇండస్ట్రీ పెద్ద ఎవరు..? ఈ ప్రశ్న టాలీవుడ్లో తరచుగా వినిపిస్తుంటుంది. ఒకప్పుడు దర్శక రత్న దాసరి నారాయణరావు ఈ పాత్రను…
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…