నేనిలాగే ఉంటాను, ఇలాగే తీస్తాను అంటూ మాటకు కట్టుబడి ఫక్తు ఎంటర్ టైనర్లు ఇస్తూ సంక్రాంతికి వస్తున్నాంతో మూడు వందల కోట్ల బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం మన శంకరవరప్రసాద్ గారు తీస్తున్న సంగతి తెలిసిందే. ఎవరికీ సాధ్యం కానీ చిరంజీవి – వెంకటేష్ కాంబోని నిజం చేయడం ద్వారా అభిమానుల అంచనాలు ఆల్రెడీ ఎక్కడికో తీసుకెళ్లాడు. రాజా సాబ్ లాంటి ప్యాన్ ఇండియా మూవీతో పాటు రవితేజ, నవీన్ పోలిశెట్టి, శర్వానంద్, విజయ్ తదితరులతో పోటీ తీవ్రంగా ఉన్నప్పటికీ ఎప్పటిలాగే ఫ్యామిలీ ఆడియన్స్ తో బ్లాక్ బస్టర్ కొట్టేస్తాననే నమ్మకంతో షూటింగ్ చేస్తున్నారు.
ఇదిలా ఉండగా అనిల్ రావిపూడితో చేయాలని వెయిట్ చేస్తున్న హీరోలు చాలానే ఉన్నారు. తమ హీరోలోని ఎనర్జీని కరెక్ట్ గా వాడుకునే దర్శకుడు అతనేనంటూ రామ్ అభిమానులు ఫీలవుతూ ఉంటారు. ఇటీవలే సరిగమా షోకు జడ్జిగా వచ్చిన రావిపూడి తమ కాంబో గురించి ఒక హింట్ అయితే ఇచ్చారు. రామ్ తో సినిమా ఎప్పుడు ఉంటుందో తెలియదు కానీ, వస్తే మాత్రం బద్దలవ్వాల్సిందేనని అనేశారు. అంటే ఏదో స్ట్రాంగ్ పాయింట్ మనసులో ఉండే ఉంటుంది. లేకపోతే నా చేతిలో ఏముంది, ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుందని చెప్పేవారుగా. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో ఈ కలయికని ఎక్స్ పెక్ట్ చేయొచ్చు.
ఇక రామ్ విషయానికి వస్తే ఆంధ్రకింగ్ తాలూకాతో మళ్ళీ కంబ్యాక్ అవుతానని బలంగా నమ్ముతున్నాడు. పాటలు, ట్రైలర్ ఆల్రెడీ పాజిటివ్ వైబ్స్ సృష్టించాయి. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్ దర్శకుడు మహేష్ బాబు టేకింగ్ చూసి హిట్టు ఖాయమని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. శంకరవరప్రసాద్ గారు తర్వాత రావిపూడి ఎవరితో చేస్తారనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. బాలయ్యతో ఉండొచ్చని అంటున్నారు కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు. అదేదో రామ్ తో చేస్తే బాగుంటుందని అభిమానులు భావిస్తున్నారు కానీ టాలీవుడ్ కాంబినేషన్లు ఎప్పుడు ఎలా ఎక్కడ మొదలవుతాయో వెంటనే చెప్పలేం.
This post was last modified on November 21, 2025 10:48 am
నిన్న విడుదలైన ది రాజా సాబ్ అభిమానుల అంచనాలకు తగ్గట్టే సెంచరీతో ఓపెనింగ్స్ మొదలుపెట్టింది. నిర్మాత విశ్వప్రసాద్ సక్సెస్ మీట్…
సెన్సార్ ఇష్యూతో పాటు థియేటర్ల కొరత కారణంగా తమిళ మూవీ పరాశక్తి మన దగ్గర విడుదల కాలేదు. ఒక వారం…
రేపు రాత్రి ప్రీమియర్లతో విడుదల కాబోతున్న మన శంకరవరప్రసాద్ గారు మీద ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరిగే దిశగా…
పాలన అంటే కార్యాలయాల్లో కూర్చుని సమీక్షలు చేయడమే కాదు. ప్రజల మధ్యకు వెళ్లి వారి సమస్యలను ప్రత్యక్షంగా చూడడమే నిజమైన…
తనపై విమర్శలు చేసే వారిని సహజంగా ఎవరైనా ప్రతివిమర్శలతో ఎదుర్కొంటారు. మాటకు మాట అంటారు. ఇక రాజకీయాల్లో అయితే ఈ…
ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాలపై యాగీ చేసుకోకుండా కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలంగాణ…