రేపు చిరంజీవి 1990 క్లాసిక్ కొదమసింహం రీ రిలీజ్ కానుంది. నిన్న మీడియాకు వేసిన స్పెషల్ ప్రీమియర్లో క్వాలిటీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నిర్మాత కె మురళీమోహనరావు ఒరిజినల్ నెగటివ్ జాగ్రత్తగా కాపాడుకుంటూ రావడం ఎంత మేలు చేసిందో స్క్రీన్ మీద అవుట్ ఫుట్ చూశాక అర్థమయ్యింది. ఏదో కొత్త సినిమా చూస్తున్న స్థాయిలో రీ మాస్టరింగ్ వర్క్ అద్భుతంగా కుదిరింది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడం మెగా ఫ్యాన్స్ ని ఖంగారు పెడుతోంది. వాళ్లకు అడ్డాగా చెప్పుకునే హైదరాబాద్ సంధ్య 70 ఎంఎం సగం కూడా అడ్వాన్స్ గా ఫుల్ కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఇలా జరగడానికి ప్రధాన కారణం టైమింగ్. రేపు చిన్నవో పెద్దవో సుమారు పది దాకా కొత్త రిలీజులు ఉన్నాయి. వాటిలో 12 ఏ రైల్వే కాలనీ, రాజు వెడ్స్ రాంబాయి, ప్రేమంటే అంతో ఇంతో బజ్ తెచ్చుకున్నాయి. టాక్ బాగుంటే దేనికైనా మధ్యాన్నం నుంచే పికప్ ఉంటుంది. రాజ్ తరుణ్ పాంచ్ మినార్ రెండు రోజుల ముందే ప్రీమియర్లు కూడా వేసుకుంది. ఇవి కాకుండా మరో మూడు డబ్బింగులు, ఇంకో నాలుగు చిన్న సినిమాలు రేస్ లో ఉన్నాయి. వీటికి షోలు సర్దుబాటు చేయడమే చాలా చోట్ల కష్టంగా మారిన టైంలో కొదమసింహంకు స్లాట్లు దొరకడం కష్టమైపోయింది. అందుకే బజ్ విషయంలో శివ లాగా హడావిడి కనిపించ లేదు.
మరో రీజన్ ఉంది. పబ్లిసిటీని టీమ్ మరీ సీరియస్ గా తీసుకోలేదు. జగదేకవీరుడు అతిలోకసుందరికి చిరంజీవి ప్రత్యేక చొరవ తీసుకుని అశ్వినిదత్, రాఘవేంద్రరావులతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. వీడియో బైట్స్ వదిలారు. వైజయంతి మూవీస్ నాన్ స్టాప్ గా సోషల్ మీడియాలో చేసిన హంగామా వల్ల జనంలో ఆసక్తి పెరిగింది. ఫలితం ఓపెనింగ్స్, కలెక్షన్స్ రెండూ వచ్చాయి. అందులోనూ పెద్దగా పోటీ లేని టైంలో రావడం ప్లస్ అయ్యింది. కానీ కొదమసింహంకు వాతావరణం అంత అనుకూలంగా లేదు. మరి రేపు, వీకెండ్ లో ఏమైనా అనూహ్యంగా పికప్ చూపించి వసూళ్లు తెస్తుందేమో వేచి చూడాలి.
This post was last modified on November 20, 2025 9:21 pm
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…