రేపు చిరంజీవి 1990 క్లాసిక్ కొదమసింహం రీ రిలీజ్ కానుంది. నిన్న మీడియాకు వేసిన స్పెషల్ ప్రీమియర్లో క్వాలిటీ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. నిర్మాత కె మురళీమోహనరావు ఒరిజినల్ నెగటివ్ జాగ్రత్తగా కాపాడుకుంటూ రావడం ఎంత మేలు చేసిందో స్క్రీన్ మీద అవుట్ ఫుట్ చూశాక అర్థమయ్యింది. ఏదో కొత్త సినిమా చూస్తున్న స్థాయిలో రీ మాస్టరింగ్ వర్క్ అద్భుతంగా కుదిరింది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ ఏమంత ఆశాజనకంగా లేకపోవడం మెగా ఫ్యాన్స్ ని ఖంగారు పెడుతోంది. వాళ్లకు అడ్డాగా చెప్పుకునే హైదరాబాద్ సంధ్య 70 ఎంఎం సగం కూడా అడ్వాన్స్ గా ఫుల్ కాలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
ఇలా జరగడానికి ప్రధాన కారణం టైమింగ్. రేపు చిన్నవో పెద్దవో సుమారు పది దాకా కొత్త రిలీజులు ఉన్నాయి. వాటిలో 12 ఏ రైల్వే కాలనీ, రాజు వెడ్స్ రాంబాయి, ప్రేమంటే అంతో ఇంతో బజ్ తెచ్చుకున్నాయి. టాక్ బాగుంటే దేనికైనా మధ్యాన్నం నుంచే పికప్ ఉంటుంది. రాజ్ తరుణ్ పాంచ్ మినార్ రెండు రోజుల ముందే ప్రీమియర్లు కూడా వేసుకుంది. ఇవి కాకుండా మరో మూడు డబ్బింగులు, ఇంకో నాలుగు చిన్న సినిమాలు రేస్ లో ఉన్నాయి. వీటికి షోలు సర్దుబాటు చేయడమే చాలా చోట్ల కష్టంగా మారిన టైంలో కొదమసింహంకు స్లాట్లు దొరకడం కష్టమైపోయింది. అందుకే బజ్ విషయంలో శివ లాగా హడావిడి కనిపించ లేదు.
మరో రీజన్ ఉంది. పబ్లిసిటీని టీమ్ మరీ సీరియస్ గా తీసుకోలేదు. జగదేకవీరుడు అతిలోకసుందరికి చిరంజీవి ప్రత్యేక చొరవ తీసుకుని అశ్వినిదత్, రాఘవేంద్రరావులతో కలిసి స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. వీడియో బైట్స్ వదిలారు. వైజయంతి మూవీస్ నాన్ స్టాప్ గా సోషల్ మీడియాలో చేసిన హంగామా వల్ల జనంలో ఆసక్తి పెరిగింది. ఫలితం ఓపెనింగ్స్, కలెక్షన్స్ రెండూ వచ్చాయి. అందులోనూ పెద్దగా పోటీ లేని టైంలో రావడం ప్లస్ అయ్యింది. కానీ కొదమసింహంకు వాతావరణం అంత అనుకూలంగా లేదు. మరి రేపు, వీకెండ్ లో ఏమైనా అనూహ్యంగా పికప్ చూపించి వసూళ్లు తెస్తుందేమో వేచి చూడాలి.
This post was last modified on November 20, 2025 9:21 pm
ఇటీవలే కాంతారావు పురస్కారం అందుకున్న సందర్భంగా నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ తమిళ లెజెండరీ నటులు ఎంజీఆర్ ని ఉద్దేశించి అన్న…
జనవరిలో సంక్రాంతి పండక్కు నారి నారి నడుమ మురారితో సూపర్ హిట్ కొట్టిన శర్వానంద్ మూడు నెలలు దాటడం ఆలస్యం…
`క్యాసినో కింగ్`గా గుర్తింపు తెచ్చుకుని వందల కోట్ల రూపాయలను అక్రమంగా ఆర్జించారన్న కేసులు ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్కు బీజేపీ కీలక…
ప్రభాస్ కెరీర్లో ‘బాహుబలి-2’ తర్వాత అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన ‘కల్కి’ మెజారిటీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవలం రెండు…
గత ఏడాది కుంభమేళా సందర్భంగా కెమెరాల కళ్లలో పడి విపరీతమైన పాపులారిటీ సంపాదించిన అమ్మాయి.. మోనాలిసా. మధ్యప్రదేశ్లోని ఇండోర్కు చెందిన…
ఇరాన్తో యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాంగ్ స్టెప్ వేశారా? నాణేనికి ఒక వైపే చూశారా? అంటే..…