దాదాపు పదేళ్లుగా ఇండస్ట్రీలో ఉంది తెలుగమ్మాయి చాందిని చౌదరి. సినిమాల్లోకి రావడంలో ఆలస్యం జరిగింది కానీ.. అంతకుముందే ఆమె షార్ట్ ఫిలిమ్స్తో సత్తా చాటింది. యూట్యూబ్లో ఆమె ఒక స్టార్ అంటే అతిశయోక్తి కాదు. వెండితెరలో అడుగు పెట్టడానికి ముందే మంచి ఫాలోయింగ్ను సంపాదించుకున్న చాందిని.. ఇక సినీ రంగంలో ఒక వెలుగు వెలిగిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఆమెకు ఇక్కడ చేదు అనుభవాలే ఎదురయ్యాయి. హీరోయిన్గా చేసిన ఏ సినిమా కూడా సరిగా ఆడలేదు. పెద్ద సినిమాల్లో సైడ్ రోల్స్ కూడా పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు.
కుందనపు బొమ్మ, హౌరా బ్రిడ్జ్, మను.. ఇలా చాందిని కథానాయికగా నటించిన సినిమాలు కనీస స్పందన కూడా తెచ్చుకోలేదు. ఐతే ఎట్టకేలకు ఆమె కోరుకున్న బ్రేక్ లభించినట్లే ఉంది. ‘కలర్ ఫోటో’ ఆమెకు మంచి పేరు తెచ్చింది. ‘ఆహా’లో రిలీజైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందనే వచ్చింది.
పేరున్న హీరోలు, దర్శకులతో సినిమాలు చేయాలన్న చాందిని ఆశ ఎట్టకేలకు ఫలించింది. ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో చాందిని ‘సూపర్ ఓవర్’ అనే సినిమా చేయబోతోందట. ఈ విషయాన్ని స్వయంగా చాందినినే వెల్లడించింది. దీంతో పాటు యువ కథానాయకుడు విశ్వక్సేన్తో ‘ప్రాజెక్ట్ గామి’ అనే సినిమాను కూడా ఓకే చేసినట్లు ఆమె తెలిపింది.
ఇవీ మరీ పెద్ద సినిమాలు కావు కానీ చాందిని ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే వీటి రేంజ్ ఎక్కువే. వేరే సినిమాలు కూడా కొన్ని చర్చల దశలో ఉన్నాయని.. వచ్చే ఏడాది కాలానికి తన కాల్ షీట్లు ఖాళీగా లేవని.. సినీ రంగంలో తాను ఆరేళ్ల పాటు పడ్డ కష్టానికి ఫలితం ఇదని.. గతంలో తాను చేసిన సినిమాల ఫలితాలు తీవ్ర నిరాశకు గురి చేశాయని.. అలాగే కొన్ని సినిమాలకు ఎంపిక చేసినట్లే చేసి తప్పించారని.. ఈ అనుభవాల తర్వాత ఒక దశలో పరిశ్రమను వదిలేద్దామనిపించిందని.. కానీ తట్టుకుని నిలబడి ఈ రోజు మంచి స్థాయిని అందుకున్నానని చాందిని చెప్పింది.
This post was last modified on December 4, 2020 1:33 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…