ఉయ్యాలా జంపాలతో మొదలుపెట్టి కుమారి 21 ఎఫ్ తో సూపర్ హిట్ అందుకున్న యూత్ హీరో రాజ్ తరుణ్ కు తర్వాత తిరుగులేదని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ వరస ఫ్లాపులతో కుర్రాడు మార్కెట్ ని రిస్క్ లో పెట్టేసుకున్నాడు. గత రెండేళ్లలో అతని సినిమాలు ఎన్ని రిలీజయ్యాయో ఠక్కున చెప్పడం కష్టం. కౌంట్ పెద్దదే కానీ ఏదీ కనీస ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఈ మధ్యే ఆహాలో చిరంజీవ అనే టైటిల్ తో ఓటిటి మూవీ చేశాడు. వ్యూస్ వచ్చినట్టున్నాయి కానీ సోషల్ మీడియాలో టాక్ అవ్వలేదు. నెటిజెన్ల దృష్టిలో పెద్దగా పడలేదు. రివ్యూలు కూడా సోసోగా రావడంతో అంత మంచి టైటిలున్నా నిలబడలేదు.
వీటి సంగతలా ఉంచితే రాజ్ తరుణ్ కొత్త సినిమా పాంచ్ మినార్ నవంబర్ 21 వస్తోంది. ఆ రోజు చాలా కాంపిటీషన్ ఉంది. అల్లరి నరేష్ 12 ఏ రైల్వేకాలనీ, ప్రియదర్శి ప్రేమంటేతో పాటు రాజు వెడ్స్ రాంబాయి, మఫ్టీ పోలీస్ లాంటి కంటెంట్లను నమ్ముకున్న అరడజను చిత్రాలు రేసులో ఉన్నాయి. వీటిలో మొదటి మూడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేసుకున్నాయి. ప్రేమంటేకి నాగచైతన్యని గెస్టుగా తీసుకొచ్చి ఆడియన్స్ దృష్టిలో పడేలా చేశారు. రాంబాయి కోసం రేపు కిరణ్ అబ్బవరం వస్తున్నాడు. రైల్వేకాలని ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి హరీష్ శంకర్ లాంటోళ్లను గెస్టుగా తేవడం ద్వారా అటెన్షన్ పెంచుకున్నారు.
పాంచ్ మినార్ కు కూడా చేశారు కానీ ఆడియన్స్ దృష్టిలో పూర్తిగా పడలేదు. కంటెంట్ మీద నమ్మకంతో రేపే పలు కేంద్రాల్లో ప్రీమియర్లు వేస్తున్నారు. సక్సెస్ కోసం తపించిపోతున్న రాజ్ తరుణ్ ఈసారి గ్యారెంటీ హిట్టు అంటున్నాడు. రామ్ కడుముల దర్శకత్వం వహించిన పాంచ్ మినార్ కు శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు. అయినా ఏదో ఒక హడావిడితో వైరలయ్యేలా పబ్లిసిటీ చేస్తే తప్ప చిన్న సినిమాల వైపు జనం చూడటం లేదు. అలాంటిది పాంచ్ మినార్ రెగ్యులర్ ఫార్మాట్ లోకి వెళ్లడం సరిపోదు. ఇంకేదైనా క్రియేటివ్ గా చేయాలి. చూడాలి ఈసారైనా రాజ్ తరుణ్ ని విజయలక్ష్మి వరిస్తుందో లేదో.
This post was last modified on November 19, 2025 10:50 am
రేపు రాత్రి అఖండ 2 తాండవం ప్రీమియర్లతో బాలయ్య షో ప్రారంభం కానుంది. ఓజి తర్వాత మళ్ళీ అంత పెద్ద…
శర్వానంద్ సినిమాలు విచిత్రమైన పరిస్థితిని ఎదురుకుంటున్నాయి. కారణం ఒకేసారి రెండు రిలీజులు రెడీ కావడం. అంతా సవ్యంగా జరిగి ఉంటే…
హనుమాన్, మిరాయ్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో ఘనవిజయం సాధించడంతో పెద్ద రేంజికి వెళ్లిపోయాడు తేజ సజ్జా. ఐతే ఈ…
ఔను! నిజం. మీరు చదివింది అక్షరాలా కరెక్టే!. సెకను అంటే రెప్పపాటు కాలం. ఈ రెప్పపాటు కాలంలోనే అఖిలాండ కోటి…
ఏపీ సీఎం చంద్రబాబు తాను వెళ్లిన ప్రతి చోట ప్రజలతో మమేకం అవుతుంటారు. గత ప్రభుత్వంలో అప్పటి సీఎం పరదాలు…
భద్రాద్రి కొత్తగూడెంలో డా.మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన…