ఉయ్యాలా జంపాలతో మొదలుపెట్టి కుమారి 21 ఎఫ్ తో సూపర్ హిట్ అందుకున్న యూత్ హీరో రాజ్ తరుణ్ కు తర్వాత తిరుగులేదని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ వరస ఫ్లాపులతో కుర్రాడు మార్కెట్ ని రిస్క్ లో పెట్టేసుకున్నాడు. గత రెండేళ్లలో అతని సినిమాలు ఎన్ని రిలీజయ్యాయో ఠక్కున చెప్పడం కష్టం. కౌంట్ పెద్దదే కానీ ఏదీ కనీస ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఈ మధ్యే ఆహాలో చిరంజీవ అనే టైటిల్ తో ఓటిటి మూవీ చేశాడు. వ్యూస్ వచ్చినట్టున్నాయి కానీ సోషల్ మీడియాలో టాక్ అవ్వలేదు. నెటిజెన్ల దృష్టిలో పెద్దగా పడలేదు. రివ్యూలు కూడా సోసోగా రావడంతో అంత మంచి టైటిలున్నా నిలబడలేదు.
వీటి సంగతలా ఉంచితే రాజ్ తరుణ్ కొత్త సినిమా పాంచ్ మినార్ నవంబర్ 21 వస్తోంది. ఆ రోజు చాలా కాంపిటీషన్ ఉంది. అల్లరి నరేష్ 12 ఏ రైల్వేకాలనీ, ప్రియదర్శి ప్రేమంటేతో పాటు రాజు వెడ్స్ రాంబాయి, మఫ్టీ పోలీస్ లాంటి కంటెంట్లను నమ్ముకున్న అరడజను చిత్రాలు రేసులో ఉన్నాయి. వీటిలో మొదటి మూడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేసుకున్నాయి. ప్రేమంటేకి నాగచైతన్యని గెస్టుగా తీసుకొచ్చి ఆడియన్స్ దృష్టిలో పడేలా చేశారు. రాంబాయి కోసం రేపు కిరణ్ అబ్బవరం వస్తున్నాడు. రైల్వేకాలని ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి హరీష్ శంకర్ లాంటోళ్లను గెస్టుగా తేవడం ద్వారా అటెన్షన్ పెంచుకున్నారు.
పాంచ్ మినార్ కు కూడా చేశారు కానీ ఆడియన్స్ దృష్టిలో పూర్తిగా పడలేదు. కంటెంట్ మీద నమ్మకంతో రేపే పలు కేంద్రాల్లో ప్రీమియర్లు వేస్తున్నారు. సక్సెస్ కోసం తపించిపోతున్న రాజ్ తరుణ్ ఈసారి గ్యారెంటీ హిట్టు అంటున్నాడు. రామ్ కడుముల దర్శకత్వం వహించిన పాంచ్ మినార్ కు శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు. అయినా ఏదో ఒక హడావిడితో వైరలయ్యేలా పబ్లిసిటీ చేస్తే తప్ప చిన్న సినిమాల వైపు జనం చూడటం లేదు. అలాంటిది పాంచ్ మినార్ రెగ్యులర్ ఫార్మాట్ లోకి వెళ్లడం సరిపోదు. ఇంకేదైనా క్రియేటివ్ గా చేయాలి. చూడాలి ఈసారైనా రాజ్ తరుణ్ ని విజయలక్ష్మి వరిస్తుందో లేదో.
This post was last modified on November 19, 2025 10:50 am
ఒకప్పుడు ఇంగ్లీష్ సినిమాలకు మన దేశంలో తెగ క్రేజ్ ఉండేది. జురాసిక్ పార్క్ నుంచి ఇది విపరీతంగా పెరిగిపోయింది. దానికి…
గత వారం విడుదలైన ‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా ఫుల్ పాజిటివ్ టాకేమీ తెచ్చుకోలేదు. ప్రిమియర్స్ నుంచే డివైడ్ టాక్ మొదలైంది.…
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని విష్ణుమూర్తి అవతారంగా ప్రముఖ బాలివుడ్ నటుడు సుదేష్ బెర్రీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో…
బలమైన కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఆశలన్నీ కొరియన్ కనకరాజు మీదే ఉన్నాయి. ఆగస్ట్…
ఏపీ దశ దిశలను మార్చేసే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం శనివారం ఉదయం లాంఛనంగా ప్రారంబమైంది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ అల్లూరి సీతారామరాజు…
జంతర్ మంతర్ ఆందోళనలో ప్రధాని మోదీపై విమర్శలు చేయడం కన్నీళ్లు తెప్పించిందని, పండ్లు కాసే చెట్టుపైకి రాళ్లేస్తారని, దేశం కోసం…