ఉయ్యాలా జంపాలతో మొదలుపెట్టి కుమారి 21 ఎఫ్ తో సూపర్ హిట్ అందుకున్న యూత్ హీరో రాజ్ తరుణ్ కు తర్వాత తిరుగులేదని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ వరస ఫ్లాపులతో కుర్రాడు మార్కెట్ ని రిస్క్ లో పెట్టేసుకున్నాడు. గత రెండేళ్లలో అతని సినిమాలు ఎన్ని రిలీజయ్యాయో ఠక్కున చెప్పడం కష్టం. కౌంట్ పెద్దదే కానీ ఏదీ కనీస ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఈ మధ్యే ఆహాలో చిరంజీవ అనే టైటిల్ తో ఓటిటి మూవీ చేశాడు. వ్యూస్ వచ్చినట్టున్నాయి కానీ సోషల్ మీడియాలో టాక్ అవ్వలేదు. నెటిజెన్ల దృష్టిలో పెద్దగా పడలేదు. రివ్యూలు కూడా సోసోగా రావడంతో అంత మంచి టైటిలున్నా నిలబడలేదు.
వీటి సంగతలా ఉంచితే రాజ్ తరుణ్ కొత్త సినిమా పాంచ్ మినార్ నవంబర్ 21 వస్తోంది. ఆ రోజు చాలా కాంపిటీషన్ ఉంది. అల్లరి నరేష్ 12 ఏ రైల్వేకాలనీ, ప్రియదర్శి ప్రేమంటేతో పాటు రాజు వెడ్స్ రాంబాయి, మఫ్టీ పోలీస్ లాంటి కంటెంట్లను నమ్ముకున్న అరడజను చిత్రాలు రేసులో ఉన్నాయి. వీటిలో మొదటి మూడు పెద్ద ఎత్తున ప్రమోషన్లు చేసుకున్నాయి. ప్రేమంటేకి నాగచైతన్యని గెస్టుగా తీసుకొచ్చి ఆడియన్స్ దృష్టిలో పడేలా చేశారు. రాంబాయి కోసం రేపు కిరణ్ అబ్బవరం వస్తున్నాడు. రైల్వేకాలని ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసి హరీష్ శంకర్ లాంటోళ్లను గెస్టుగా తేవడం ద్వారా అటెన్షన్ పెంచుకున్నారు.
పాంచ్ మినార్ కు కూడా చేశారు కానీ ఆడియన్స్ దృష్టిలో పూర్తిగా పడలేదు. కంటెంట్ మీద నమ్మకంతో రేపే పలు కేంద్రాల్లో ప్రీమియర్లు వేస్తున్నారు. సక్సెస్ కోసం తపించిపోతున్న రాజ్ తరుణ్ ఈసారి గ్యారెంటీ హిట్టు అంటున్నాడు. రామ్ కడుముల దర్శకత్వం వహించిన పాంచ్ మినార్ కు శేఖర్ చంద్ర సంగీతం సమకూర్చారు. అయినా ఏదో ఒక హడావిడితో వైరలయ్యేలా పబ్లిసిటీ చేస్తే తప్ప చిన్న సినిమాల వైపు జనం చూడటం లేదు. అలాంటిది పాంచ్ మినార్ రెగ్యులర్ ఫార్మాట్ లోకి వెళ్లడం సరిపోదు. ఇంకేదైనా క్రియేటివ్ గా చేయాలి. చూడాలి ఈసారైనా రాజ్ తరుణ్ ని విజయలక్ష్మి వరిస్తుందో లేదో.
This post was last modified on November 19, 2025 10:50 am
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…
ఇవాళ చెప్పుకోదగ్గ కౌంట్ లో కొత్త సినిమాలు విడుదలయ్యాయి. ముఖ్యంగా హే బలవంత్ కోసం చాలా ప్రమోషన్లు చేశారు. మీడియాతో…