టీడీపీ నాయకుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గురించి అందరికీ తెలిసిందే. ఆయన ఎంత సౌమ్యంగా ఉంటారో.. అంతే అసహనం కూడా ప్రదర్శిస్తారు. ముఖ్యంగా అభిమానులను ఆదరించే బాలయ్య.. అదే అభిమానులు గడుసుగా ప్రవర్తిస్తే.. బహి రంగంగానే వారిపై విరుచుకుపడిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అయితే.. ఇదంతా బాలయ్య అభిమానులు కామన్గానే తీసుకుంటారు. ఇలాంటి ఘటనే ఒకటి తాజాగా విశాఖ పర్యటనలోనూ చోటు చేసుకుంది. త్వరలోనే అఖండ-2 విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తనకుఎంతో ప్రీతిపాత్రమైన సింహాచలం అప్పన్న దర్శనానికి బాలయ్య వచ్చారు.
ఈ క్రమంలో విశాఖ విమానాశ్రయానికి వచ్చిన బాలయ్యను చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా తరలి వచ్చారు. అయితే.. వీరిని తొలుత ఆప్యాయంగానే పలకరించినప్పటికీ.. కొందరు అభిమానులు బాలయ్యతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడ్డారు. ఇది ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. ఇంతలో ఆయనను గతంలో విమర్శించిన ఓ వ్యక్తి కూడా అక్కడే కనిపించారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన బాలయ్య.. “వీడెందుకు వచ్చాడు. నాకు కనిపించడానికి వీల్లేదు. సాయంత్రం ఫంక్షన్లోనూ వీడు రాకూడదు.“ అని బాలయ్య గర్జించారు. దీంతో అభిమానులు సదరు వ్యక్తిని పక్కకు తీసుకువెళ్లిపోయారు.
అనంతరం.. సింహాచలం చేరుకున్న బాలయ్య దర్శకుడు బోయపాటి శ్రీనుతో కలిసి సింహాచలం చేరుకున్నారు. అక్కడ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే హోదాతో పాటు సీనియర్ నటుడు కూడా కావడంతో బాలయ్యకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత ఆలయంలోని `కప్ప స్తంభాన్ని` ఆలింగనం చేసుకున్న బాలయ్య.. అనంతరం, గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖలో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న అఖండ-2 విజయవంతం కావాలని కోరుకున్నట్టు కొద్ది మంది మీడియా మిత్రులకు బాలయ్య వెల్లడించారు.
This post was last modified on November 19, 2025 10:50 am
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…
ఒకప్పుడు శంకర్తో సినిమా చేయడానికి వివిధ ఇండస్ట్రీల టాప్ స్టార్లు, అగ్ర నిర్మాతలు లైన్లో ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి అంతటి…