Movie News

వీడెందుకు వచ్చాడు?.. బాల‌య్య గ‌ర్జ‌న.. ఏం జ‌రిగింది?

టీడీపీ నాయ‌కుడు, హిందూపురం ఎమ్మెల్యే బాల‌కృష్ణ గురించి అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న ఎంత సౌమ్యంగా ఉంటారో.. అంతే అస‌హ‌నం కూడా ప్ర‌ద‌ర్శిస్తారు. ముఖ్యంగా అభిమానుల‌ను ఆద‌రించే బాల‌య్య‌.. అదే అభిమానులు గ‌డుసుగా ప్ర‌వ‌ర్తిస్తే.. బ‌హి రంగంగానే వారిపై విరుచుకుప‌డిన సంద‌ర్భాలు అనేకం ఉన్నాయి. అయితే.. ఇదంతా బాల‌య్య అభిమానులు కామ‌న్‌గానే తీసుకుంటారు. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి తాజాగా విశాఖ ప‌ర్య‌ట‌న‌లోనూ చోటు చేసుకుంది. త్వ‌ర‌లోనే అఖండ‌-2 విడుద‌ల‌కు రెడీ అవుతోంది. ఈ నేప‌థ్యంలో త‌న‌కుఎంతో ప్రీతిపాత్ర‌మైన సింహాచ‌లం అప్ప‌న్న ద‌ర్శ‌నానికి బాల‌య్య వ‌చ్చారు.

ఈ క్ర‌మంలో విశాఖ విమానాశ్ర‌యానికి వచ్చిన బాల‌య్య‌ను చూసేందుకు అభిమానులు తండోప‌తండాలుగా త‌ర‌లి వ‌చ్చారు. అయితే.. వీరిని తొలుత ఆప్యాయంగానే ప‌ల‌క‌రించిన‌ప్ప‌టికీ.. కొంద‌రు అభిమానులు బాల‌య్య‌తో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ ప‌డ్డారు. ఇది ఆయ‌న‌కు చిర్రెత్తుకొచ్చింది. ఇంత‌లో ఆయ‌న‌ను గ‌తంలో విమ‌ర్శించిన ఓ వ్య‌క్తి కూడా అక్క‌డే క‌నిపించారు. దీంతో మ‌రింత ఆగ్ర‌హానికి గురైన బాల‌య్య‌.. “వీడెందుకు వ‌చ్చాడు. నాకు క‌నిపించ‌డానికి వీల్లేదు. సాయంత్రం ఫంక్ష‌న్‌లోనూ వీడు రాకూడ‌దు.“ అని బాల‌య్య గ‌ర్జించారు. దీంతో అభిమానులు స‌ద‌రు వ్య‌క్తిని ప‌క్క‌కు తీసుకువెళ్లిపోయారు.

అనంత‌రం.. సింహాచ‌లం చేరుకున్న బాల‌య్య ద‌ర్శ‌కుడు బోయపాటి శ్రీనుతో క‌లిసి సింహాచలం చేరుకున్నారు. అక్కడ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే హోదాతో పాటు సీనియ‌ర్ న‌టుడు కూడా కావ‌డంతో బాల‌య్య‌కు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. తొలుత ఆల‌యంలోని `కప్ప స్తంభాన్ని` ఆలింగనం చేసుకున్న బాల‌య్య‌.. అనంతరం, గర్భగుడిలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ‌లో మంగ‌ళ‌వారం నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన‌నున్నారు. భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతున్న అఖండ‌-2 విజ‌య‌వంతం కావాల‌ని కోరుకున్న‌ట్టు కొద్ది మంది మీడియా మిత్రుల‌కు బాల‌య్య వెల్ల‌డించారు.

This post was last modified on November 19, 2025 10:50 am

Share
Show comments
Published by
Kumar
Tags: Balakrishna

Recent Posts

పవన్ చొరవతో క్షేమంగా ఇల్లు చేరిన ముస్లిం మహిళ

బతుకుదెరువు కోసం విదేశం వెళ్లిన ఏపీకి చెందిన ముస్లిం మహిళ అక్కడ విష వలయంలో చిక్కుకుంది. ఆ ఉచ్చు నుంచి…

6 hours ago

రిస్క్ ఉన్నా ముందుకెళ్తున్న అబ్బవరం

ఇటీవలే కిరణ్ అబ్బవరం నిర్మాతగా మారి తిమ్మరాజుపల్లి టీవీ తీశారు. మొదటి మూడు రోజులు తెగ హడావిడి చేశారు. గొప్ప…

7 hours ago

ఎల్లమ్మ సమస్యకు ఏది ముగింపు

దేవిశ్రీ ప్రసాద్ ని హీరోగా పరిచయం చేస్తూ నిర్మాత దిల్ రాజు ప్రకటించిన ఎల్లమ్మ ఇప్పటికీ రెగ్యులర్ షూటింగ్ కు…

8 hours ago

దేవిశ్రీ.. అంత:కరణశుద్ధితో..

సంగీత దర్శకులు హీరోలు కావడం తమిళ ఇండస్ట్రీలో ఇప్పటికే చూశాం. విజయ్ ఆంటోనీ, జి.వి.ప్రకాష్ కుమార్ లాంటి వాళ్లు సినీ…

9 hours ago

ఇక కాంగ్రెస్ వాళ్లతో కూర్చోలేం

ఇటీవల జరిగిన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్తో డీఎంకే పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే అయితే కేవలం ఐదు సీట్లు…

10 hours ago

అనుష్క సినిమాకు మళ్ళీ మౌనవ్రతం

అదేంటో అనుష్క సినిమాలు నిర్మాణంలోనే కాదు విడుదలలోనూ తెగ ఆలస్యానికి గురవుతున్నాయి. మలయాళంలో తను నటించిన ప్యాన్ ఇండియా మూవీ…

11 hours ago