టాలీవుడ్ ఈ రోజు సంతోషంలో మునిగి తేలుతోంది. పైరసీ వ్యాప్తికి విపరీతంగా దోహద పడిన ఐబొమ్మ నిర్వాహకుడు పట్టుబడటంతో పాటు అతని యాప్స్ ని మూసేయించడం దానికి కారణం. పోలీస్ కమీషనర్ సజ్జనార్ తో కలిసి సినీ ప్రముఖులు ప్రెస్ మీట్ లో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే ఒక పెద్ద గండం తప్పినట్టే. ఇరవై వేల సినిమాలను హార్ట్ డిస్క్ లో దాచుకుని, ఇరవై కోట్ల రూపాయలు ఒక్క పైరసీ నుంచే సంపాదించిన ఇమ్మడి రవి తెలివితేటలు చూసి కాసేపు పోలీసులకు కూడా నోటమాట ఆగి ఉండొచ్చు. కాకపోతే దమ్ముంటే నన్ను పట్టుకోండి అంటూ పదే పదే ఛాలెంజ్ చేయడం చివరికి జైలు పాలు చేసింది.
సరే శుభం జరిగింది, అందరూ కోరుకున్నది ఇదే. మరి పైరసీ కథ క్లైమాక్స్ కు చేరి అంతమైనట్టేనా అంటే వెంటనే సమాధానం చెప్పలేం. ఎందుకంటే వరల్డ్ వైడ్ పాతుకుపోయిన పైరసీ మొత్తం సదరు ఇమ్మడి రవి వల్లే జరగలేదు. అతనో ప్రధాన పాత్రధారి అంతే. ఇంకా మిగిలిన క్యాస్టింగ్ బోలెడున్నారు. వాళ్ళను కూడా పట్టుకోవాలి. ముఖ్యంగా రిలీజ్ రోజే ప్రింట్లు పెట్టేస్తున్న తమిళ్ ఎంవి లాంటివి కట్టడి కావాలి. ఇది కూడా పెద్ద నెట్ వర్క్. టొరెంట్స్ పేరుతో వీళ్ళు పైరసీని పంచే విధానం చాలా సంవత్సరాల నుంచి ఉంది. కొన్నేళ్ల క్రితం అరుణ్ విజయ్ హీరోగా తమిళ్ రాకర్స్ అనే వెబ్ సిరీస్ కూడా వచ్చింది.
హైదరాబాద్ పోలీసులకు నెక్స్ట్ టార్గెట్ వీళ్ళే కావాలి. ఇందులో కూడా విజయం సాధిస్తే సినిమా రంగానికి ఇంకా పెద్ద మేలు జరుగుతుంది. పైరసీ దొరకదని తెలిసినప్పుడు ప్రేక్షకులు ఖచ్చితంగా థియేటర్లకు వస్తారు. వంద శాతం కాకపోయినా కనీసం అందులో సగం మంది టికెట్లు కొన్నా బాక్సాఫీస్ కు వందల కోట్ల ప్రయోజనం కలుగుతుంది.. సజ్జనార్ మాటలను బట్టి చూస్తే ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలేలా లేరు. కెమెరా ప్రింట్ల నుంచి హెచ్డి వర్షన్ల దాకా ఎదిగిపోయిన ఈ పైరసీ మురికికి మూల కారణంగా నిలిచిన సర్వర్లను అప్ గ్రేడ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ముందు చేయాల్సింది ఇదే.
This post was last modified on November 17, 2025 10:15 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…