తెలుగు సినీ రంగంలోని పెద్దల కళ్లలో ఇటీవల కాలంలో లేనంత ఆనందం కనిపించింది. పైరసీ భూతంగా మారి.. సినీ రంగానికి సవాల్ విసిరిన ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు, సైబర్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు. దీంతో తెలుగు ఇండస్ట్రీ పెద్దలు ఆనందానికి లోనయ్యారు. ఈ క్రమంలో తాజాగా సోమవారం ఉదయం హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సజ్జనార్తో చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు తదితరులు భేటీ అయి.. కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా వారు తమ ఆనందాన్ని పంచుకున్నారు. వేల కోట్ల రూపాయల పరిశ్రమ.. పైరసీ భూతానికి అల్లాడి పోయిందని.. పోలీసులు చొరవ తీసుకుని.. రవిని అరెస్టు చేయడంతో తమ కష్టాలు తగ్గాయని పేర్కొన్నారు. “దమ్ముంటే పట్టుకోండి అని పోలీసులకు సవాల్ విసిరాడు. ఇమ్మడి రవి ఇప్పుడెక్కడున్నాడు..? హైదరాబాద్ పోలీసులను అంత తక్కువగా అంచనా వేయొద్దు. పోలీసులను, ప్రభుత్వాన్ని సవాల్ చేస్తే ఏమవుతుందో మీకు తెలుసు. ప్రజలు ఇలాంటి సైట్ల జోలికి పోవద్దు. సపోర్ట్ చేయొద్దు.. మీకు నష్టం జరుగుతుంది“ అని ప్రజలకు సజ్జనార్ సూచించారు.
ఇక, చిరంజీవి మాట్లాడుతూ.. “ఎంతోమంది కష్టాన్ని ఉచితంగా దోచుకోవడం సబబు కాదు. సినిమా రంగం ఎన్నో కష్టనష్టాలకోర్చి చిత్రాలు తీస్తోంది. చాలా ఏళ్లుగా పైరసీ బాధించింది. సినిమాను నమ్ముకుని వేల కుటుంబాలు జీవిస్తున్నాయి. పైరసీ కట్టడికి పోలీసులు ఎంతో శ్రమించారు.. గత సీపీ సీవీ ఆనంద్, ప్రస్తుత సీపీ సజ్జనార్ పైరసీ భూతాన్ని పట్టుకున్నారు. తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలు“ అని తెలిపారు. రాజమౌళి, నాగార్జున సహా సినీ పెద్దలు సీపీకి కృతజ్ఞతలు చెప్పారు.
This post was last modified on November 17, 2025 1:54 pm
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…
అమరావతి రాజధానిపై వైసీపీ అధినేతగా జగన్ చేసిన తాజా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయనపై మరోసారి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని విషయంలో…
వైసీపీ అధినేత జగన్ హయాంలో ఓ కుటుంబం రోడ్డున పడింది. కేవలం మాస్క్ అడిగిన పాపానికి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరించి…
కోనసీమ జిల్లా వాసులు ఎంతో పవిత్రంగా, ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకునే పండుగ జగ్గన్నతోట ప్రభల తీర్థం. ఇది తరతరాలుగా సంప్రదాయబద్ధంగా కొనసాగుతూ…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలకు, కార్యకర్తలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురం నియోజకవర్గంలో పిచ్చి పిచ్చి…